Minister Srinivas Yadav
-
గొర్రెల రీ సైక్లింగ్ నిజమే!
పుల్కల్ (అందోల్): గొర్రెల రీసైక్లింగ్ను అధికార యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. ‘అక్కడా.. ఇక్కడా అదే గొర్రె.. బకరా ఎవరు’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’ ప్రధాన సంచిక లో ప్రచురితమైన కథనానికి స్పందించిన మంత్రి శ్రీనివాస్యాదవ్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో పశు సంవర్ధక శాఖ అధికారులే కాకుండా కలెక్టర్ ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో విచారణ జరిపించారు. ఈ క్రమంలో పుల్కల్ మండలంలో ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను విక్రయించింది వాస్తవమే అని విచారణలో తేలింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు కలెక్టర్కు ఇటీవల నివేదిక సైతం సమర్పించారు. గొర్రె లను అమ్మిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని కలెక్టర్ ఆదేశించడంతో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు సోమవారం పుల్కల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. గొర్రెలు ఎవరు తీసుకున్నారు? ఎవరికి అమ్మారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అనే దాంతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన పుల్కల్ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్నీ సేకరి స్తున్నట్లు తెలిసింది. పుల్కల్లో ఐదుగురు, అక్సాన్పల్లి, సింగూరులో పలువురిపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. -
‘వ్యాట్’ సవరణలకు సభ ఆమోదం
తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్పై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను పెంచుతూ గతంలో సర్కార్ తీసుకున్న నిర్ణయానికి శాసనసభ ఆమోదముద్ర వేసింది. పెట్రోల్పై 31 శాతం నుంచి 35.2శాతం, డీజిల్పై 22.5 శాతం నుంచి 27 శాతానికి వ్యాట్ పెంచుతూ చేసిన చట్ట సవరణలను విపక్ష పార్టీల వ్యతిరేకత మధ్య సోమవారం రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. వ్యాట్ చట్టానికి సవరణల బిల్లులను వాణిజ్య పన్నుల మంత్రి శ్రీనివాస్ యాదవ్ శాసనసభలో ప్రవేశపెట్టగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎంలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమయ్యాయని, అయితే ప్రభుత్వం వ్యాట్ను పెంచడంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదని ఆక్షేపిం చాయి. మరోవైపు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల అమలు, గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను రూ.1200 నుంచి రూ.101కి తగ్గింపు లాంటి జీహెచ్ఎంసీ, మునిసిపల్ చట్టాలకు చేపట్టిన సవరణలను మాత్రం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.