breaking news
Minister Sridharbabu
-
రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ: మంత్రి శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఆయా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) తరహాలో ఈ వర్సిటీ నైపుణ్య మానవ వనరులను అందిస్తుందని వివరించారు. టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయని చెప్పారు. వర్సిటీ కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారని వ్యాఖ్యానించారు. బుధవారం మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్లో జరిగిన టెలిపర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్బాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతుందని పునరుద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతులకు ప్రత్యేక పాలసీలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. జూన్లో హైదరాబాద్లో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏఐ కంపెనీలను ఆహ్వనిస్తున్నామని శ్రీధర్బాబు వివరించారు. ఏఐ సాంకేతికతలో హైదరాబాద్ను గ్లోబల్ హెడ్ క్వార్టర్స్గా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిసారించామని, టూరిజం అభివృద్ధిని 20 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ ఖాయం 1990వ దశకంలో దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఉన్నప్పుడే హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని మంత్రి శ్రీధర్బాబు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ... తాము హైదరాబాద్లో ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. టెలిపర్ ఫార్మెన్స్ గ్రూప్ ఫౌండర్ డానియల్ జులియన్, సీఈఓ అనీష్ ముక్కర్ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్ను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వివరించారు. గురువారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ, ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. -
మళ్లీ మొదలైన ఇసుక రవాణా..
కరీంనగర్ రూరల్, న్యూస్లైన్ : మండలంలోని ప లు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. మానేరువాగు నుంచి యథావిధిగా ఇసు క రవాణా జరుగుతున్నా అధికారులెవరూ పట్టిం చుకోవడంలేదు. ఇటీవల దుర్శేడ్లో ఇసుక మాఫి యా చేతిలో మృతి చెందిన న్యాలం కుమార్గౌడ్ సంఘటనతో కొన్ని రోజులపాటు ఇసుక అక్రమ ర వాణాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే నా లుగు రోజుల నుంచి సుల్తానాబాద్ మండలం గొ ల్లపల్లి, గట్టెపల్లి, నీరుకుల్ల, గర్రెపల్లి, కరీంనగర్ మండలం ఎలగందల్, ఖాజీపూర్, చేగుర్తి గ్రామాల్లోని మానేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాజీవ్ రహదారి నుంచే ప్ర తీరోజు వందలాది ట్రాక్టర్లు కరీంనగర్కు దర్జాగా వెళ్తున్నా పోలీస్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. శనివారం మంత్రి శ్రీధర్బాబు మం థని వెళ్తుండగా బందోబస్తు కోసం వచ్చిన రూరల్ సీఐ కమలాకర్రెడ్డి , ఎస్సై సృజన్రెడ్డి బైపాస్రోడ్డు వద్ద ఎనిమిది ట్రాక్టర్లను పట్టుకున్నారు. అయినా యథావిధిగానే ట్రాక్టర్లు నడిచాయి. ఆదివారం ఉ దయం 8గంటలకు మొగ్ధుంపూర్ స్టేజీవద్ద ఇసుక ట్రాక్టర్ అతివేగంతో రోడ్డు దాటుతుండగా అడ్డుగా వచ్చిన క్వాలిస్ వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. దాదాపు అరగంటపాటు ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది. ఈ సంఘటనలో రోడ్డుపక్కనే ద్విచక్రవాహనంపై ఉన్న మరో ట్రాక్టర్ యజమాని కాలు విరిగింది. క్వాలిస్లోని ముగ్గురు వ్యక్తులకు గా యాలయ్యాయి. రూరల్ పోలీసులు వచ్చి ప్రమాదతీరును పరిశీలించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఇసుక ట్రాక్టర్లు గ్రామంలోనుంచి రావద్దని మొగ్ధుంపూర్ గ్రామస్తులు గొల్లపల్లి ట్రాక్టర్ యజ మానులతో వాగ్వాదానికి దిగారు. ట్రాక్టర్ల రాకతో రోడ్లు చెడిపోతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇసుక ట్రాక్టర్లు గ్రామం నుంచి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.