breaking news
Minister kimmane ratnakar
-
అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి
అధికారులకు మంత్రి కిమ్మనె సూచన శివమొగ్గ : జిల్లాలో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి కిమ్మనె రత్నాకర్ సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఆరోగ్యశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అంటువ్యాధులపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇంటికీ కరపత్రాలను అందజేయాలన్నారు. డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ... నగరంలో కోతుల నుంచి వ్యాపించే అంటువ్యాధులు ఈ ఏడాదిలో 41 కేసులు గుర్తించినట్లు తెలిపారు. గత ఏడాది ఈ తరహా కేసులు 147 నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ వ్యాధిపై ప్రతి గ్రామ పంచాయతీలో చైతన్య ర్యాలీలు నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తులకు మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వ్యాధి కేవలం శివమొగ్గ, చిక్కమగళూరు, ఉత్తర కన్నడ, మంగళూరు, ఉడుపి, చామరాజ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోందని, దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు అవసరమని అన్నారు. -
‘మత ఘర్షణలకు బీజేపీ కుట్ర’
బెంగళూరు: రాష్ట్రంలో మత ఘర్షణలు రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ ఆరోపించారు. తీర్థహళ్లిలో విద్యార్థి నందితా మృతిని ఇందుకు పావుగా వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తీర్థహళ్లి విద్యార్థిని నందితా మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, అయినా కూడా ఈ అంశంలో బీజేపీ అనవసర రాద్ధాంతానికి దిగుతోందని విమర్శించారు. ఇక తమ ప్రభుత్వంలోని మంత్రులు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఈ సందర్భంగా కిమ్మనె రత్నాకర్ పునరుద్ఘాటించారు.