-
లక్ష్యానికి మించి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బియ్యం సమకూర్చుకునే విషయంలో జిల్లా అధికారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ.. ధాన్యం కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్స్ మిల్లింగ్ రైస్ విధానంతో మిల్లర్లకు కేటాయించి.. మిల్లింగ్ చేయించే ప్రక్రియకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరించిన అధికారులు.. అంచనాలకు మించి కొనుగోలు కేంద్రాలకు రావడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో జిల్లాలో సంక్షేమ పథకాలకు వినియోగించే బియ్యానికి ఇబ్బంది లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అధికారులు సేకరించిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి తీసుకుని వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించనున్నారు. ప్రధానంగా జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం జిల్లా నుంచి సేకరించిందే కావడం విశేషం. జిల్లా అవసరాలకు మించి ధాన్యం సేకరించిన అధికారులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు దాదాపు 7వేల మెట్రిక్ టన్నులు పంపించారు. అక్కడ అనుకున్న స్థాయిలో పంట దిగుబడులు లేకపోవడం.. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి కాకపోవడంతో ధాన్యాన్ని అక్కడికి తరలించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఆయా రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం దామాషా ప్రకారం మిల్లింగ్ చేసి.. బియ్యంగా చేసి.. మార్చి చివరి నాటికి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఇందుకోసం మిల్లింగ్ జరుగుతున్న తీరును పౌరసరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో పండించిన ధాన్యంతో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని రేషన్ షాపులతోపాటు ఐసీడీఎస్ కేంద్రాలకు, పలు సంక్షేమ పథకాలకు వినియోగించనున్నారు. అయితే ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేసే బియ్యం పూర్తిస్థాయిలో సన్న రకాలుగా ఉండే బియ్యాన్ని సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 86 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో ఐకేపీ ద్వారా 14, పీఏసీఎస్ల ద్వారా 72 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా 1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 1,50,551.320 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. లక్ష్యానికి మించి ధాన్యం రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 7,349.480 మెట్రిక్ టన్నులు కేటాయించారు. దీనికి సంబంధించి మిల్లర్లు అందించిన బియ్యాన్ని ఆ జిల్లాకే ఉపయోగించనున్నారు. ఇలా కేటాయించారు.. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 1,50,551.320 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లర్లకు అందించింది. వీటిలో 67 శాతం బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అందించిన 7,349.480 ధాన్యం పోను.. ఖమ్మం జిల్లాలో 1,43,201 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు అందజేశారు. అందులో మిల్లర్లు 95,453.011 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 40,635.420 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించారు. కాగా.. ఇంకా రావాల్సిన 54,817.591 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మార్చి 31వ తేదీలోగా పౌరసరఫరాల శాఖకు అందించాల్సి ఉంది. జిల్లాలో 75,817.152 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం.. జిల్లాలోని రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని వినియోగిస్తారు. ఈసారి అత్యధికంగా కొనుగోళ్లు జరగడంతో ఈ అవసరాలు తీరిపోగా.. ఇంకా కొద్దిమొత్తంలో బియ్యం మిగిలే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రేషన్ దుకాణాల కోసం నెలకు 6,228.096 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కాగా.. అంగన్వాడీ కేంద్రాలకు 90 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అంటే నెలకు 6,318.096 మెట్రిక్ టన్నుల బియ్యం కావాల్సి ఉంటుంది. ఏడాదికి 75,817.152 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. మిల్లర్ల నుంచి దాదాపు 95,453.011 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుండడంతో ఈ అవసరాలకు పోను.. కొంత మేరకు మిగిలే అవకాశం ఉంది. అయితే వచ్చే ఈ బియ్యంలో 5వేల నుంచి 10వేల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఇక్కడ ఎవరూ ఉపయోగించకపోవడంతో బియ్యాన్ని ఎఫ్సీఐకి విక్రయించనున్నారు. అయితే పూర్తిస్థాయిలో రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలకు పోను.. సుమారు 10వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిగిలే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మద్దతు ధర పెరగడంతో.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేశారు. 2017–18లో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. కేవలం 39,360 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గత ఏడాది గ్రేడ్–‘ఏ’ ధాన్యం క్వింటా ధర రూ.1,590 ఉండగా.. కామన్కు రూ.1,550 నిర్ణయించారు. ఈ ఏడాది గ్రేడ్–‘ఏ’ క్వింటా ధాన్యం రూ.1,770, కామన్ రకం రూ.1,750 నిర్ణయించారు. దీంతోపాటు పంట దిగుబడి కూడా కొద్దిమేర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపారు. అవగాహనతోనే సాధ్యం.. ఈ ఏడాది లక్ష్యానికి మించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. గతంలో కంటే మద్దతు ధర పెరగడంతోపాటు నీటి సౌకర్యంతో ధాన్యం దిగుబడి కూడా పెరిగింది. దీంతో అనుకున్న లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేయగలిగాం. క్షేత్రస్థాయి అధికారులు కూడా రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. – వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ -
మిర్చి రైతు దిగాలు
గుంటూరు: మిర్చికి గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు చెందుతున్నారు. రెండు నెలల క్రితం క్వింటాలు మిర్చి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పలికింది. పంటపూర్తిగా చేతికొచ్చి రైతులు యార్డుకు తెచ్చే సరికి రూ.7 వేల నుంచి రూ.8 వేలు మాత్రమే పలుకుతోందని గుంటూరు జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గిట్టుబాటు కావడంలేదని కొందరు మిర్చి బస్తాలను ఏసీల్లో నిల్వ ఉంచుతుంటే పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చేందుకు మరికొందరు ప్రస్తుతం ఉన్న ధరకే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మిర్చి దిగుబడి కూడా తక్కువ గా ఉందని రైతులు తెలుపుతున్నారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వాపోతున్నారు. సిండికేట్ వల్ల ధర తగ్గిందా...? మిర్చి సీజన్ ప్రారంభం కావడంతో వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ మిర్చిని తెచ్చినా కనీస ధర లభించడం లేదు. వ్యాపారులంతా ఒకే ధర చెబుతుండ టంతో సిండికేట్ అయినట్లు అర్థమవుతోందని రైతులు చెబుతున్నారు. రవాణా ఖర్చులు భరించి గుంటూరు మిర్చి యార్డుకు కాయలు తరలిస్తున్నా, వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే ధర తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. రెండు నెలల కిందట రూ.12 వేల వరకు ఉంటే సీజన్ ప్రారంభంలోనే ధర ఎందుకు తగ్గిందో అర్థం కావడంలేదని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ వ్యాపారులు కూడా కాయలో నాణ్యత లేదని ధర తగ్గించి మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.అదే విధంగా కాటాల్లో మోసం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement