-
కృష్ణపట్నంలో మినీ హార్బర్
ఆటుపోట్ల మధ్య జీవనం సాగించే కడలి పుత్రులు ప్రాణాలను పణంగా పెట్టి ఎగసి పడే అలలను దాటుకుని సముద్రంలో వేట సాగిస్తేనే కడుపులు నిండుతుంది. ప్రకృతి విపత్తులు, వేట నిషేధిత కాలంలో రోజుల తరబడి వాటిని భద్రపరుచుకోవడం తలకు మించిన భారంగా మారింది. దీంతో పాటు వేట సమయంలో రోజుల తరబడి సముద్రంలో రెక్కలు ముక్కలు చేసుకుని మత్స్య సంపదను ఒడ్డుకు చేర్చినా నిల్వ చేసుకునే పరిస్థితులు లేక దళారులకు తెగనమ్ముకునే పరిస్థితి నెలకొంది. ఈ దయనీయ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని కృష్ణపట్నం తీర మండలాల మత్స్యకారులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఇప్పటికే సుమారు రూ.288 కోట్లతో జిల్లాలో జువ్వలదిన్నె వద్ద భారీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉంది. తాజాగా కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఈ దిశగా అధికారులు పరిశీలన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా పరిధిలోని ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. 14 ఏళ్ల క్రితం కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందు ఇక్కడి జెట్టీల కేంద్రంగా మత్స్యకారులు సముద్రంలో చేపలవేట చేపట్టారు. వలలకు చిక్కిన మత్స్య సంపదను ఆరబెట్టుకోవడం, నిల్వ చేసుకోవడం ద్వారా వందల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందారు. కృష్ణపట్నం పోర్టు ప్రారంభమైన తర్వాత జెట్టీలు అదృశ్యమయ్యాయి. ఇక్కడి మెకనైజ్డ్ బోట్లు ఇతర రేవులకు తరలిపోయాయి. ఎక్కడికీ వెళ్లలేని మోటారు బోట్లు, నాన్ మోటారు బోట్లు మాత్రం నానా కష్టాల మధ్య సముద్రంలో వేట సాగిస్తున్నాయి. వేటాడిన తర్వాత మత్స్యసంపదను అపరిశుభ్ర వాతావరణంలో ఎండబెట్టుకుంటూ, అమ్మకాలు చేసుకునే దుస్థితి కొనసాగుతోంది. 15 ఏళ్ల క్రితమే సర్వే కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందే బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. ఉప్పు కాలువలో పడవల ద్వారా పర్యటించిన నిపుణులు హార్బర్ నిర్మాణానికి రూ.300 కోట్లు అవసరమైనట్టు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అయితే, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. 1996లో తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టును నాట్కో అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. కాగా, ఆ సంస్థ ఒక్క ఇటుక కూడా వేయలేకపోయింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పోర్టును నాట్కో సంస్థ నుంచి నవయుగ సంస్థకు అప్పగించారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఈ సంస్థ పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న అంశానికి అప్పుడే బీజం పడింది. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే.. కృష్ణపట్నం తీరంలో ఏర్పాటు కావల్సిన ఫిషింగ్ హార్బర్ తర్వాత బోగోలు మండల పరిధిలోని జువ్వలదిన్నెకు తరలించారు. రూ.288 కోట్లతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. పూర్వ నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెన్నాయపాళెం నుంచి తడ వరకూ 169 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. సుమారు రెండు లక్షల మంది మత్స్యకారులు సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏడాదికి 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 40 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. సరైన వసతులు, స్టోరేజీ సామర్థ్యం లేని కారణంగా మిగిలిన 60 శాతం సరుకు దళారుల చేతుల్లో పడుతోంది. మత్స్యకారుల నుంచి అతి తక్కువ ధరకు చేపలు, రొయ్యలను సొంతం చేసుకుంటున్న దళారులు చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం 40 శాతం ఎగుమతులపైనే ఏడాదికి జిల్లా నుంచి రూ.200 కోట్లు విదేశీ మారకం వస్తున్నట్లు అధికారుల అంచనా. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్ చేపడితే జిల్లాలో ప్రస్తుతం లభిస్తున్న 1.05 లక్షల టన్నులు రెట్టింపు మత్స్య సంపదను మత్స్యకారులు చేజిక్కించుకునే అవకాశం ఉంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం రెట్టింపు కానుందని నిపుణులు వివరిస్తున్నారు. మరింత వెసులుబాటు కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్ ఏర్పాటైతే కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, సర్వేపల్లి పరిధిలోని తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలాల మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. మినీ హార్బర్ నిర్మాణంతో మత్స్యకార మహిళలకు సైతం సమృద్ధిగా జీవనోపాధి లభిస్తుంది. తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పలువురు వివరిస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మినీ హార్బర్ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్ ఉంటుంది. సముద్రతీరం వెంబడి మత్స్యకారులు అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడుతుంది. వారికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. మార్కెట్ వంటి వసతులు చెంతకు వస్తాయి. – పామంజి నరసింహ, జిల్లా ఆక్వా సొసైటీ డైరెక్టర్ మత్స్యకారులకు ఎంతో మేలు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. అధునా«తన, బోట్లు, వలలతో వేటాడే అవకాశం ఉంటుంది. దీంతో మత్స్య సంపద పెరగడంతో పాటు ఎగుమతులకు మంచి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి ఉన్న గంగపుత్రులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. – శ్రీహరికోట శ్రీనివాసులు, మైపాడు తూర్పుపాళెం కాపు -
మినీ హార్బర్కు ‘లంగర్’
చీరాల వాడరేవులో మినీహార్బర్ నిర్మిస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. హార్బర్ నిర్మాణ హామీ ఆచరణలోకి రావడం లేదు. చీరాల: స్థానిక వాడరేవులో మినీ హార్బర్ (జెట్టీ) నిర్మిస్తామంటూ పాలకులు ఎన్నో ఏళ్లుగా కోతలు కోస్తూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతిపాదిత నిర్మాణం పూర్తి చేసి మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని డబ్బాలు కొడుతూనే ఉన్నారు. కానీ వారి మాటలు హామీల వృక్షంపై పదిలంగా ఉన్నాయి. మత్స్యకారులు మాత్రం హార్బర్ వస్తుందన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. మత్స్య సంపద ఫుల్.. చీరాల ప్రాంతంలో నెలకు రూ.40 లక్షలకుపైగా మత్య్ససంపద లభిస్తుంది. విలువైన చేపలను స్థానిక మార్కెట్తో పాటు విజయవాడ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ వేట సాదాసీదాగా ఉండదు. చేపలు పుష్కలంగా పడేందుకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల విలువ చేసే వలలను వినియోగిస్తుంటారు. నియోజకవర్గంలో 4 వేల కుటుంబాల్లోని వారు వేట, అమ్మకాలు చేస్తూ పొట్ట నింపుకుంటున్నారు. కానీ వారికి ఎంతో అవసరమైన జెట్టీ లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు బోట్లు పదిలపరచుకోనే అవకాశం లేక అల్లాడిపోతున్నారు. దీని నిర్మాణంపై నాటి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, చీరాల ప్రజాప్రతినిధులు ఆశ చూపించి పక్కకు తప్పుకున్నారు. కేంద్ర బృందం పర్యటనకే పరిమితం.. మినీ హార్బర్ కోసం రూ. 300 కోట్ల బడ్జెట్ అంచనా రూపొందింది. అలాగే అనువైన ప్రదేశం, స్థల సేకరణ, సముద్రం లోతు తదితర వసతుల పరిశీలన కోసం 2013 నవంబర్లో కేంద్ర బృందం పర్యటించి వెళ్లింది. కానీ ఇప్పటికీ హార్బర్ నిర్మాణంపై ఎలాంటి పనులూ ముందుకు క దల్లేదు. స్థల సేకరణ పూర్తై పనుల జాప్యంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంగరు వేయడం ప్రహసనం.. కష్టపడి రాత్రంతా వేటాడిన జాలర్లు తిరిగి తమ బోట్లను ఒడ్డుకు చేర్చి లంగరు వేయాలంటే ముప్పతిప్పలు పడుతున్నారు. వాడరేవు, చిన్నబరప, విజయలక్ష్మీపురం, బాపట్ల మండలంలోని దానవాయిపేట, పాండురంగాపురం గ్రామాలకు చెందిన మత్య్సకారులు ప్రస్తుతం ఈపూరుపాలెం స్ట్రయిట్కట్పై ఉన్న బ్రిడ్జి సమీపంలో బోట్లను కట్టేస్తున్నారు. మండల పరిధిలోని ఇతర జాలర్లు కొన్నేళ్లుగా బాపట్ల మండలంలోని దానవాయిపేట సమీపంలో లంగరు వేస్తున్నారు. తుపాన్లు వస్తే అంతే.. బంగాళాఖాతంలో తుపాన్లు సంభవించినా.. తీవ్ర వాయుగుండాలు ఏర్పడినా సముద్రం అల్లకల్లోలమవుతుంది. అలలు ఎగిసి పడుతుంటాయి. ఇలాంటి సమయంలో బోట్లను ఒడ్డుకు తేవడం చాలా కష్టం. జెట్టీ లేకుండా లంగరు వేస్తే బోట్లు ధ్వంసం అవుతాయి. సాధారణంగా సముద్రంలోనే లంగరు వేసే మత్స్యకారులు.. ఇలాంటి ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రం దిక్కుతోచక అల్లాడిపోతున్నారు. చేపలను దించడం కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది. చేసేది లేక.. బోట్లను సముద్రంలోనే వదిలేయలేక ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీరానికి దూరంగా ఎక్కడో భద్రపరచుకోవాల్సి వస్తోంది. వలలదీ ఇదే పరిస్థితి. కానీ దీనివల్ల వారి సామగ్రికి భద్రత కరువవుతోంది. హామీలతోనే సరిపెట్టారు... పి.విశ్వనాథం... మినీ హార్బర్ మత్స్యకారుల భవిష్యత్. కానీ దీనిపై ప్రభుత్వం స్పందించడంలేదు. వేలాదిమందికి ఉపయోగపడే పని చేయడానికి పాలకులకున్న అడ్డంకి ఏమిటో తెలియడంలేదు. వరదలు వచ్చినప్పుడు ఉన్నదంతా కోల్పోవాల్సి వస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
Advertisement