breaking news
Metal industry
-
హిందాల్కో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్ రంగ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 71 శాతం జంప్చేసి రూ. 2,331 కోట్లను తాకింది. అల్యూమినియం, కాపర్ విభాగాలు పటిష్ట పనితీరు చూపడం లాభాలకు దోహదం చేసింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,362 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 53,151 కోట్ల నుంచి 52,808 కోట్లకు బలహీనపడింది. కఠిన మార్కెట్ పరిస్థితుల్లోనూ వృద్ధి బాటలో సాగినట్లు కంపెనీ ఎండీ సతీష్ పాయ్ తెలియజేశారు. అల్యూమినియం, కాపర్ బిజినెస్లు ఆకర్షణీయ ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఇందుకు మెరుగైన ప్రొడక్ట్ మిక్స్, తగ్గిన ముడివ్యయాలు సహకరించినట్లు వెల్లడించారు. ఈ రెండు విభాగాల విస్తరణపై పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఈ ఏడాది రూ. 4,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రస్తావించారు. వచ్చే ఏడాది(2024–25) పెట్టుబడులను రూ. 5,500 కోట్లకు పెంచనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో హిందాల్కో షేరు బీఎస్ఈలో 12.5 శాతం పతనమై రూ. 510 వద్ద ముగిసింది. -
చైనా ఫ్యాక్టరీలో పేలుడు
68 మంది మృతి, 187 మందికి గాయాలు బీజింగ్: తూర్పు చైనాలోని జియాంగ్జు రాష్ట్రంలో ఒక లోహ పరిశ్రమలో శనివారం భారీ పేలుడు సంభవించింది. 68 మంది మృతి చెందగా, 187 మంది గాయపడ్డారు. షాంఘై నగరానికి చేరువలోని కున్షాన్ పట్టణంలో ఉన్న ప్రఖ్యాత వీల్ హబ్ పాలిషింగ్ కంపెనీ కున్షాన్ జోంగ్రాంగ్ మెటల్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా ఉత్పత్తులను సరఫరా చేసే పెద్ద కంపెనీల్లో ఇదీ ఒకటి. ప్రఖ్యాత జనరల్ మోటార్స్ లాంటి సంస్థలకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. పేలుడు సమయంలో ఆ ఫ్యాక్టరీలో 260 మంది ఉన్నారు. 40 మృతదేహాలు ప్రమాద స్థలంలో లభించాయని, మిగతా 28 మంది ఆస్పత్రితో మృతిచెందారని మీడియా తెలిపింది.