-
వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!
ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సైన్స్, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్(ట్విటర్) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో మనవాళ్లు ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఫైనల్స్కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్ మహీంద్ర వావ్.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్ని చూడండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ ఛాంపియన్షిప్స్లో పురుషుల 4X400 మీటర్ల విభాగంలో ఇంటియన్ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. What? When? Where? An Indian men’s 4x400 relay team qualifying for the finals in the World Athletics Championship? Looks like everyone is shooting for the moon now… Look at them run…Our Cheetahs…. pic.twitter.com/K0Il2UEXpR — anand mahindra (@anandmahindra) August 27, 2023 Who saw this coming 😳 India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h — World Athletics (@WorldAthletics) August 26, 2023 -
Thomas Cup 2022: ఎన్నాళ్లో వేచిన పతకం
సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఐదుసార్లు చాంపియన్ మలేసియా జట్టును క్వార్టర్ ఫైనల్లో ఓడించిన భారత్ 1979 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ సెమీఫైనల్ చేరింది. తద్వారా 73 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత పురుషుల జట్టు తొలిసారి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. 1990 నుంచి థామస్ కప్లో సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకూ కాంస్య పతకాలు అందజేస్తున్నారు. అంతకుముందు మాత్రం సెమీఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య ప్రత్యేకంగా కాంస్య పతకం కోసం మ్యాచ్ను నిర్వహించేవారు. బ్యాంకాక్: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించింది. గతంలో సాధ్యంకాని ఘనతను ఈసారి సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్ అయిన థామస్ కప్లో భారత పురుషుల జట్టు తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో ఐదుసార్లు చాంపియన్ మలేసియా జట్టును ఓడించి సెమీఫైనల్ చేరింది. థామస్ కప్లో సెమీఫైనల్ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. నేడు జరిగే సెమీఫైనల్లో 2016 చాంపియన్ డెన్మార్క్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో ఇండోనేసియాతో జపాన్ ఆడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో డెన్మార్క్ 3–2తో దక్షిణ కొరియాపై... జపాన్ 3–2తో చైనీస్ తైపీపై... ఇండోనేసియా 3–0తో చైనాపై విజయం సాధించాయి. గెలిపించిన ప్రణయ్ మలేసియాతో పోటీలో భారత్కు శుభారంభం దక్కలేదు. తొలి మ్యాచ్లో భారత నంబర్వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 21–23, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ లీ జి జియా చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 21–19, 21–15తో గో జె ఫె– నూరుజుద్దీన్ జోడీని ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ఆటగాడు చిరాగ్ చక్కటి సమన్వయంతో ఆడుతూ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ జోరు పెంచి ప్రత్యర్థి జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడో మ్యాచ్లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ 21–11, 21–17తో ఎన్జీ జె యోంగ్పై గెలిచి భారత్ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ తొలి గేమ్లో చెలరేగిపోగా... రెండో గేమ్లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. నాలుగో మ్యాచ్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట 19–21, 17–21తో ఆరోన్ చియా–తియో యె యి ద్వయం చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది. తెలంగాణ ప్లేయర్ విష్ణువర్ధన్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కృష్ణప్రసాద్ పోరాటపటిమ కనబరిచినా కీలకదశలో తడబడ్డారు. నిర్ణాయక ఐదో మ్యాచ్లో అనుభవజ్ఞుడైన హెచ్ఎస్ ప్రణయ్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆడి 21–13, 21–8తో లియోంగ్ జున్ హావోపై నెగ్గడంతో భారత్ 3–2తో చిరస్మరణీయ విజయాన్ని ఖరారు చేసుకుంది. స్కోరు 20–8 వద్ద ప్రణయ్ స్మాష్ షాట్ కొట్టి చివరి పాయింట్ రాబట్టిన వెంటనే భారత జట్టు సభ్యులందరూ ఆనందంతో కోర్టులోకి దూసుకెళ్లి సంబరాలు చేసుకున్నారు. -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు కాంస్యం
ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఢాకాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల జట్టు కాంస్య పతకం నెగ్గగా... మహిళల జట్టు ఓడిపోయింది. అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రిషభ్ యాదవ్లతో కూడిన భారత జట్టు 235–223తో బంగ్లాదేశ్ను ఓడించి కాంస్యం నెగ్గింది. భారత మహిళల జట్టు కాంస్య పతక పోరులో 208–220తో కజకిస్తాన్ జట్టు చేతిలో ఓడింది. -
క్రికెట్ చరిత్రలో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్
Sarah Taylor Becomes First Woman Coach In Mens team: క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి టీమ్ అబుదాబి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు మహిళా క్రికెటర్ను కోచ్గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజీ తెలిపింది. అబుదాబీ టీ10 లీగ్లో మాజీ ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్ను అసిస్టెంట్ కోచ్గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ట్విటర్లో వెల్లడించింది. దీంతో మెన్స్ ఫ్రాంఛైజీ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తూ సారా టేలర్ చరిత్ర సృష్టించింది. కాగా ఇంతకుముందు ఇంగ్లండ్ మెన్స్ కౌంటీ టీమ్ ససెక్స్ జట్టుకి స్పెషలిస్ట్ కోచ్(వికెట్ కీపింగ్ కోచ్)గా నూ సారా టేలర్ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇక ఇంగ్లండ్ సాధించిన రెండు వన్డే వరల్డ్ కప్లు, ఒక టీ20 వరల్డ్ కప్ జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. కాగా నవంబర్ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్ ప్రారంభం కానుంది. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: భేష్.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్ -
మహిళలే అధిగమించారు
మౌంట్ మాంగనుయ్: మహిళలు ఆకాశంలో సగమే కాదు... రికార్డుల్లోనూ ఘనమని చేతల్లో చాటారు. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉన్న వరుస వన్డే విజయాల రికార్డును ఆ దేశ మహిళల క్రికెట్ జట్టు అధిగమించింది. న్యూజి లాండ్ పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుసగా 22 వన్డేల్లో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో 2003లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పిన 21 వరుస విజయాల రికార్డు తెరమరుగైంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు జైత్రయాత్ర 2018 మార్చి 12న మొదలైంది. ఈ క్రమంలో ఆసీస్ 3–0తో భారత్పై... 3–0తో పాకిస్తాన్పై... 3–0తో న్యూజిలాండ్పై... 3–0తో ఇంగ్లండ్పై... 3–0తో వెస్టిండీస్పై... 3–0తో శ్రీలంకపై... 3–0తో న్యూజిలాండ్పై గెలిచి 2020 అక్టోబర్ 7న ఆస్ట్రేలియా పురుషుల జట్టు పేరిట ఉన్న 21 వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్పై గెలుపుతో ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో మొదట న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 212 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ లారెన్ డాన్ (90; 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకుంది. కెప్టెన్ అమీ సాటెర్వైట్ (32; 3 ఫోర్లు), అమెలియా కెర్ (33; 4 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షుట్ 4, నికోలా క్యారీ 3 వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా మహిళల జట్టు 38.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అలీసా హీలీ (65; 7 ఫోర్లు, 2 సిక్స్లు), అష్లే గార్డ్నెర్ (53 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), ఎలీస్ పెర్రీ (56 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. కివీస్ బౌలర్లలో జెస్ కెర్, హన్నా రోవ్, అమెలియా కెర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement