breaking news
memorundum
-
అలవెన్సులకు కోత... ఖర్చులు తగ్గించాలన్న ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులు ఓవర్ టైం, ట్రావెల్ అలవెన్సులకు కోత పడనుంది. కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పొదపు మంత్రం పఠిస్తోంది కేంద్రం. దీంతో అన్ని శాఖల పరిధిలో 20 శాతం మేర ఖర్చులు తగ్గించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కోరారు. నివారించతగిన వృథాతో పాటు సాధ్యమైనంత వరకు వ్యయాన్ని నియంత్రించాలని ఆమె సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఈ దిశగా చర్యలు చేపట్టాలంటూ ఆర్థిక శాఖ నుంచి గురువారం మెమోరాండం జారీ చేశారు. అలవెన్సులు కట్ వ్యయనియంత్రణలో భాగంగా ఓవర్ టైం అలవెన్సులు, ట్రావెల్ అలవెన్సులు, రివార్డులు, ఆఫీసు ఖర్చులు, ఆద్దెలు, పన్నులు, రాయాల్టీ, ముద్రణ తదితర విభాగాల్లో వ్యయాన్ని నియంత్రించాలని కేంద్రం సూచించింది. వీటితో పాటు ఫ్యూయల్ బిల్స్, దుస్తులు, స్టేషనరీ కొనుగోలు, కరెంటు బిల్లు, అడ్వర్టైజ్మెంట్లతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ తదితర చోట్ల ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఆర్థిక శాఖ తెలిపింది. అలవెన్సులో కోత పెడితే సీ క్లాస్ ఉద్యోగులకు నష్టపోతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2020 మే ప్రతిపాదికగా 2020 మేలో శాఖల వారీగా జరిగిన ఖర్చుల వివరాలను ప్రతిపాదికగా తీసుకుని ఆయా శాఖలు వ్యయ నియంత్రణ పాటించాలని కేంద్రం సూచించింది. చదవండి: Covid-19: ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే -
కుక్కకు మెమోరండం
వికారాబాద్: కనీస వేతనాల పెంపు కోరుతూ గడిచిన 14 రోజులుగా సమ్మెచేస్తోన్న వికారాబాద్ మున్సిపాలిటీ కార్మికులు ఆదివారం వినూత్నరీతిలో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓ శునకానికి మెమోరండం ఇచ్చారు. కార్మికులకు కనీస వేతనం రూ. 14,170, సూపర్వైజర్స్కు రూ. 17380 వేతనం చెల్లించి పర్మనెంట్ చేయాలనే డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వికారాబాద్ మున్సిపల్ ఆఫీసు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో మున్సిపాల్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ అధ్యక్షుడు పి. మల్లేశం, ఇతర కార్మిక నేతలు మాపాల్గొన్నారు. కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీలు ఈ నెల 20 నుంచి 24 వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.