breaking news
Meerakumar
-
టీఆర్ఎస్కు నీతి, నిజాయితీ లేదు: సంపత్
హైదరాబాద్: తెలంగాణ బిల్లు పాస్ చేసే క్రమంలో అప్పటి స్పీకర్ మీరాకుమార్ కృషి మరవలేనిదని.. ఆమె కృషికి కృతజ్ఞతగానైనా రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్కు చేతులు జోడించి అడుగుతున్నా.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని బీజేపీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టొద్దని ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు కేసీఆర్ ఎన్డీఏ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. టీఆర్ఎస్ నీతి, నిజాయితీ లేని పార్టీ అని ఇప్పటికి చాలాసార్లు రుజువైంది. మీరాకుమార్కు ఓటు వేయకపోతే టీఆర్ఎస్ నియ్యతు లేని పార్టీ అని రుజువవుతుంది. మీరాకుమార్కు మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను సంప్రదిస్తున్నా. ఇప్పటికే 38 మంది ప్రజాప్రతినిధులు మీరాకుమార్కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందులో టీఆర్ఎస్ వాళ్లే ఎక్కువగా వున్నారు. ఓట్లు వేసే సమయానికి తొంభైశాతం ప్రజాప్రతినిధులు ఆత్మప్రబోధానుసారం మీరాకుమార్కు ఓటు వేసే అవకాశం ఉందని అన్నారు. -
తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ నాశనం చేస్తుండు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిని సీఎం కేసీఆర్ నాశనం చేస్తుండని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. గడీల పాలన చేస్తున్నావా అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఫోన్ చేసినా మాట్లాడకుండా అవమానపరిచాడని ఆయన మండిపడ్డారు. గ్రామ గ్రామాన తిరిగి గడీల పాలనను అంతం చేస్తామని హెచ్చరించారు. జీఎస్టీ వల్ల నష్టం జరుగుతుందని ఈటల రాజేందర్ అంటే.. నష్టం ఏమి లేదని సీఎం అనడం శోచనీయమన్నారు. అసలు ఎవరు తప్పు చెబుతున్నారు కేసీఆరా? లేక ఈటలనా? అని సూటిగా అడిగారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి కేసీఆర్ భజన చేస్తున్నారని విమర్శించారు. -
ట్విటర్ లో వర్మ కితకితలు!
సంచలన దర్శకుడిగా సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, వ్యంగ్యం, వివాదస్పద వ్యాఖ్యలతో సెన్సేషనల్ గా మారారు. సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ గమ్మత్తైన సెటైర్లతోనే కాకుండా, వ్యక్తులపై వ్యంగ్యస్థాలను విసరడంలో వర్మ డిఫెరెంట్ స్టైల్ ను ఫాలోఅవుతుంటారు. ఇటీవల కాలంలో దయ్యాల కథలతో తెరపై హారర్ సృష్టిస్తున్న వర్మ సోషల్ మీడియాలో హాస్యాన్ని పంచుతూ తనలో మరో కోణం ఉందనిపించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ , లగడపాటి రాజగోపాల్, లోకసభ స్పీకర్ మీరా కుమార్ పై చేసిన చాలా ఆసక్తిని రేకెత్తించాయి. "@sirasri: For the 1st time I am eagerly waiting for hot summer; just to see Mr.Arvind Kejriwal without Muffler."— Ram Gopal Varma (@RGVzoomin) February 6, 2014 ఎప్పుడూ తలచుట్టూ మఫ్లర్ కట్టుకుని కనిపించే కేజ్రివాల్ పై గమ్మత్తైన ట్వీట్ చేశారు వర్మ. 'రానున్న వేసవి కాలం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే తలకు మఫ్లర్ లేని కేజ్రివాల్ ను చూడాలని ఉంది' అని ట్వీట్ చేశారు. అంతేకాక ఇక కేజ్రివాల్ కాదు.. కేజ్రిఫాల్ అంటూ సెటైర్ వేశారు. పెప్పర్ స్ప్రే ఘటన తర్వాత లగడపాటిని టార్గెట్ చేశారు. భగత్ సింగ్ తర్వాత పార్లమెంట్ ను కుదిపేసిన రెండవ వ్యక్తి లగడపాటి. పార్లమెంట్ లో ఏం జరిగిందో పక్కన పెడితే.. ప్పెప్పర్ స్పే ను ఆత్మరక్షణ ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని లగడపాటి పబ్లిసిటీ ఇచ్చారు. భవిష్యత్ ఉద్యమకారులకు పెప్పర్ స్పే ఓ మంచి ఆయుధంగా మారే అవకాశం ఉంది. త్వరలోనే క్లాస్ రూమ్, సినిమా హాళ్లలో, షాపింగ్ మాల్స్ లో పెప్పర్ స్పే వినియోగించడం త్వరలోనే చూస్తాం అని ట్వీట్ చేశారు. One thing the pepper spray has achieved is that for the first time evr I saw Meira kumar without a smile— Ram Gopal Varma (@RGVzoomin) February 15, 2014 అంతేకాక కాకుండా మిర్చి పౌడర్ కంటే పెప్పర్ స్పే ఘాటుగా ఉంటుందా అనే కుతుహలం మొదలైందన్నారు వర్మ. ఇంకా ఓ అడుగు ముందేసి .. ఎప్పుడూ చిరునవ్వుతో దర్శనమిచ్చే స్పీకర్ మీరా కుమార్ ..పెప్పర్ స్పే ఘటన తర్వాత ఆమె ముఖంలో నవ్వు మాయమైంది అని ట్విటిచ్చారు. "@sirasri: BREAKING News announced BREAKING Andhra Pradesh"— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు లోకసభ ఆమోదం లభించిన తర్వాత.. బ్రేకింగ్ న్యూస్ అనౌన్స్ డ్... బ్రేకింగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వర్మ ట్విట్ చేశారు. దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలపై స్పందిస్తూ.. సెటైర్లతో నెటిజన్లకు ఆనందాన్ని పంచుతున్న రాంగోపాల్ ట్విటర్ అకౌంట్ లో 8 లక్షల 17 వేల మంది వర్మను ఫాలో అవుతున్నారు.