breaking news
Mcx-sx
-
భారీగా తగ్గిన పసిడి ధర
శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. శుక్రవారం ఉదయం సెషన్లో 10 గ్రాముల పసిడిధర రూ.300 పెరిగి మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల పసిడి రూ.656 తగ్గి రూ.45,732 వద్ద ముగిసింది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర భారీగా పతనమైంది. గురువారంతో పోలిస్తే ఔన్స్ బంగారం 28 డాలర్లు తగ్గి, 1,688.35 డాలర్ల వద్ద ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ డీలర్స్ బంగారంపై భారీ ఆఫర్లు ప్రకటింస్తుండడంతో ధరలు దిగివస్తున్నాయి. అంతేగాకుండా అంతర్జాతీయంగాను దేశీయంగాను ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవ్వడం, ఇన్వెస్టర్లు బంగారాన్ని విక్రయించేందుకు మొగ్గు చూపుతుండడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రూ.46,400కు పసిడి ధర
గతవారం భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ వారం ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం బుధవారం భారీగా పతనమైంది. ఉదయం 10:15 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటి మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.734 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.46,395 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే 20 డాలర్లు తగ్గి ఔన్స్ బంగారం 1,728.60 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ అంతర్జాతీయ ఈక్విటి మార్కెట్లు లాభాల్లో ట్రేడ్అవుతుండడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల పై దృష్టిపెట్టడంతో బంగారం ధరలు దిగివస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్లు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అదనంగా 500 బిలియన్ల యూరోలను ప్రకటిస్తుందని పెట్టుబడిదారులు అంచనావేస్తున్నారు. అంతేగాకుండా డాలర్ ఇండెక్స్ 0.2శాతం తగ్గి రెండు నెలల కనిష్టానికి చేరడం కూడా పసిడి ధరలు తగ్గుదలకు దోహదం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. -
ఎంసీఎక్స్ఎక్స్ఛేంజీ చైర్మన్ రాజీనామా
ముంబై/న్యూఢిల్లీ: ఎంసీఎక్స్ఎక్స్ఛేంజీచైర్మన్ పదవికి జీకే పిళ్లై రాజీనామా చేశారు. 2008లో ఎక్స్ఛేంజీకి లెసైన్స్ లభించడంపై సీబీఐ దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్న పిళ్లై రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ అంశానికి సంబంధించి అప్పట్లో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి చైర్మన్గా పనిచేసిన భవేపై సీబీఐ ప్రాథమిక విచారణ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పిళ్లై రాజీనామాతో ఎక్స్ఛేంజీ చైర్మన్ పదవిని ఎల్ఐసీ మాజీ చైర్మన్, ఎక్స్ఛేంజీ వైస్చైర్మన్ థామస్ మాథ్యూ చేపట్టారు. వైస్చైర్మన్గా ఆషిహా గోయల్ నియమితులయ్యారు. పలు సవాళ్ల మధ్య తాను పదవిని చేపట్టానని, ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నానని పిళ్లై చెప్పారు. అయినప్పటికీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో ఎక్స్ఛేంజీ నడుస్తుందని తెలిపారు. ఇకపై ఎక్స్ఛేంజీ సీఈవో సౌరభ్ సర్కార్ మరింత కీలకంగా వ్యవహరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పిళ్లైసహా నలుగురు సభ్యుల బోర్డును గతేడాది సెబీ నియమించిన విషయం విదితమే. ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో బోర్డును సెబీ పునర్వ్యవస్థీకరించింది. అయితే ఎక్స్ఛేంజీకి చెందిన ట్రేడింగ్ సభ్యులు, వాటాదారుల ఆందోళనలను తొలగించేందుకు ఇటు ప్రభుత్వం, అటు సెబీ తాజాగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎంసీఎక్స్ఎస్ఎక్స్లో ఐఎఫ్సీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. రైట్స్ ఇష్యూకి స్పందన ఒక షేరుకి రెండు షేర్ల నిష్పత్తిలో చేపట్టిన రైట్స్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించినట్లు ఎంసీఎక్స్ఎస్ఎక్స్ కొత్త యాజమాన్యం తెలిపింది. శనివారం నో ట్రేడింగ్ వ్యవసాయ కమోడిటీలలో శనివారం ఫ్యూచర్స్ ట్రేడింగ్ను ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ) నిషేధించింది. 2014 ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల కమోడిటీలలోనూ అన్ని ఎక్స్ఛేంజీలూ శనివారం ట్రేడింగ్ నిర్వహించడాన్ని ఎఫ్ఎంసీ తాజాగా నిషేధించింది. ఎన్బీహెచ్సీ విక్రయం నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్(ఎన్బీహెచ్సీ)ను ఇండియా వ్యాల్యూ ఫండ్ ట్రస్టీకు రూ. 242 కోట్లకు విక్రయించనున్నట్లు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ తెలిపింది. వివిధ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ టెక్ ఎంసీఎక్స్ఎస్ఎక్స్కు సంబంధించి లిస్టింగ్ ఒప్పందంలో భాగంగా ఎన్బీహెచ్సీను విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 4.5% పతనమై రూ. 361 వద్ద ముగియగా, ఎంసీఎక్స్ సైతం అదే స్థాయిలో దిగజారి రూ. 493 వద్ద నిలిచింది.