-
ఇంతకీ.. గెలిచింది ఎవరు!
మూడు రాష్ట్రాలు. మూడు ఎన్నికలు. మూడు పార్టీలు. మూడు విభిన్న తీర్పులు. మూడు ముక్కల్లో తాజాగా ముగిసిన గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సారాంశమిదే. దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకునే సమ్మోహన శక్తి ఏ పార్టీకీ లేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి గానీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు గానీ, బీజేపీకి పోటీగా ఎదగాలని కలలుగంటున్న ఆప్కు గానీ అవి ఊహించుకుంటున్నంత బలం లేదని తేలిపోయింది. ఈ మూడు పార్టీలు ఎక్కడ గెలవాలన్నా ఇంకేదో వాటికి అసంకల్పితంగా సహాయపడుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓ పార్టీగా నెగ్గలేదు. మోదీ ప్రధానిగా ఉండటం వల్ల మాత్రమే రికార్డు విజయాన్ని సాధించగలిగింది. ప్రధాని గుజరాతీ కావడం వల్లే ఆ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను ఆసాంతం పక్కకు నెట్టేసి బీజేపీని అక్కున చేర్చుకున్నారు. ఇక హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా అది సొంత చరిష్మాతో అసలే కాదు. పాలక పక్షమైన బీజేపీపై గూడుకట్టుకుని ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్కు ఓటేయడం ద్వారా జనం బహిర్గతం చేశారు. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓటర్లు ఇలాగే స్పందించడంతో ఎంసీడీపై 15 ఏళ్ల బీజేపీ పెత్తనానికి తెర పడింది. అక్కడ కాంగ్రెస్ కన్నా ఆప్ మెరుగని ఓటర్లు భావించడంతో ఎంసీడీ కేజ్రీవాల్ పార్టీ వశమైంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ గెలిచిన పార్టీలకు సొంత బలానికి మించి అదనపు బలం వ్యతిరేక ఓటు ద్వారానో, ప్రాంతీయాభిమానం రూపేణో సమకూరింది. ఆ లెక్కన వాటివి అసంపూర్ణ విజయాలు మాత్రమే! గెలవలేదు, గెలిచామనిపించాయి!! మోదీ మ్యాజిక్ను నమ్ముకుని 2024లో ఏకంగా 400 ఎంపీ స్థానాలు కొల్లగొడతామని కలలుగంటున్న బీజేపీ పైకి ఏం చెబుతున్నా ఈ మూడు ఎన్నికల్లో సదరు మ్యాజిక్ ఒకే రాష్ట్రానికి, అదీ ఆయన స్వరాష్ట్రానికి మాత్రమే పరిమితమైందన్న వాస్తవం మింగుడుపడటం లేదు. తన మ్యాజిక్కూ పరిమితులున్నాయని మోదీకి కూడా ఈసరికే అర్థమై ఉంటుంది. కలెగూరగంప లాంటి తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరి పరిమితులేమిటో చూద్దాం... మోదీ.. తగ్గుతున్న మేజిక్ గుజరాత్ను సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రి. ప్రస్తుతం దేశాన్నేలుతున్న ప్రధాని. ప్రపంచం దృష్టిలో విశ్వగురు. అత్యధిక ప్రజాదరణ ఉన్న నేత. బీజేపీకి పెద్ద దిక్కు. ఒకరకంగా పారీ్టకి ప్రస్తుతతం అన్నీ ఆయనే! ఎంతగా అంటే... బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ అనేంతగా!! వరుసగా రెండోసారి ప్రధాని పదవి చేపట్టాక మోదీ ద్విగుణీకృత ఆకర్షణ శక్తితో వెలిగిపోయినా ఆ శక్తి రాను రానూ సన్నగిల్లుతున్నట్టు కన్పిస్తోంది. తాజా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అది కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. ఒకవిధంగా మోదీ గ్రాఫ్ తగ్గడం నోట్ల రద్దు నిర్ణయంతోనే మొదలైంది. తర్వాత బడా కార్పొరేట్ దిగ్గజాల భారీ రుణాలను గుండుగుత్తగా మాఫీ చేయడం మొదలుకుని ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దాకా ఆయన గ్రాఫ్ పడిపోతూనే ఉంది. మెజారిటీ లేని రాష్ట్రాల్లో బేరసారాలతో రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ వశం చేయడం సాధారణ పౌరులకు కూడా మింగుడుపడని అంశం. ఎంసీడీలోనూ, హిమాచల్ప్రదేశ్లోనూ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని ఉంటే మోదీ గాలికి తిరుగులేదని బహుశా నిరూపితమయ్యేదేమో. కానీ జరిగింది మరొకటి. గుజరాత్లోనూ ఎన్నడూ లేనంతటి మెజారిటీ సాధించడం కచి్చతంగా మోదీకి ప్లస్ పాయింటే. అయితే అది మోదీ స్వరాష్ట్రం కావడం వల్లే ఆ ఘనత సాధ్యమైంది. ఆయన్ను తమ రాష్ట్ర ముద్దుబిడ్డగా గుజరాత్ ఓటర్లు భావించబట్టే ఆ స్థాయిలో అందలమెక్కించారు. మోదీ కాక మరో రాష్ట్ర నేత ఎవరైనా ప్రధానిగా ఉన్నట్టయితే గుజరాత్ ఫలితం మరోలా ఉండేదేమో! ఊహాజనితమే అయినా ఇది చర్చనీయాంశమే! గుజరాత్లో గెలిచింది నిస్సందేహంగా మోదీ మాత్రమే. బీజేపీ కేవలం ఆయన వెంట నడిచింది. అంతే! అదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు మోదీ కూడా ఓడారన్నది కాదనలేని వాస్తవం! బీజేపీ.. మోదీపైనే భారం కేంద్రంలో అధికారంలో ఉన్న పారీ్టగా అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగరేయాలని ఉవి్వళ్లూరుతున్న బీజేపీకి హిమాచల్ ఓటమి మింగుడుపడనిదే. ఈ ఫలితంతో బీజేపీ అధికారం 16 రాష్ట్రాలకే పరిమితమైంది. వీటిలో సొంతంగా 10 రాష్ట్రాల్లో, సంకీర్ణంతో మిగతా ఆరుచోట్ల అధికారంలో ఉంది. డబుల్ ఇంజన్ (కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం) నినాదంతో దేశాన్ని హోరెత్తిస్తున్న బీజేపీకి హిమాచల్లో ఒక ఇంజన్ పట్టాలు తప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అక్కడ కేవలం ఒక శాతం ఓటు తేడాతోనే ఓడామని మోదీ సరిపుచ్చుకునే ప్రయత్నం చేసినా ఓటమి ఓటమే కదా! పైగా హిమాచల్లో కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం కూడా చేయకపోయినా విజయం ఆ పార్టీనే వరించడం బీజేపీపై అక్కడి ప్రజలకున్న వ్యతిరేకతకు అద్దం పడుతుంది. స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన అగి్నపథ్, వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకం వంటివాటిపై బీజేపీ దృష్టి పెట్టకపోవడం, కేవలం మోదీ మ్యాజిక్ మీదే మితిమీరిన నమ్మకం పెట్టుకోవడం ఓటమికి దారితీశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరిగిన ఒక లోక్సభ, ఆరు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు అసెంబ్లీ సీట్లలో మాత్రమే నెగ్గింది. ఆ పార్టీ ప్రాభవం తగ్గుతోందంనేందుకు ఇదీ సూచికే. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభ, కతౌలీ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడటం గమనార్హం. మెయిన్పురితో సమాజ్వాదీ అభ్యరి్థ, పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఏకంగా 2.88 లక్షల ఓట్ల మెజారిటీ సాధించడం మరో విశేషం. 2024 లోక్సభ ఎన్నికల్లోగా బీజేపీ సంస్థాగతంగా మరింత పట్టు సాధించకుంటే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా తయారవడం ఖాయం. లేదంటే మోదీనే నమ్ముకుని గుజరాత్ వంటి విజయాల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. కాంగ్రెస్... అదే అయోమయం ఈ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హిమాచల్లో గట్టెక్కినా అది సొంతం బలంతో కాదని కాంగ్రెస్కూ తెలుసు. గుజరాత్లో, ఢిల్లీ కార్పొరేషన్లో పార్టీ కనీస స్థాయి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆప్ దెబ్బకు గుజరాత్లో ముక్కోణపు పోరులో పూర్తిగా మునిగింది. కోలుకునే పరిస్థితి సుదూరంలోనూ కని్పంచడం లేదు. రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒరిగిందేమీ లేదు. గుజరాత్పైనే దృష్టి పెట్టిన కాంగ్రెస్, హిమాచల్లో సరైన ప్రచారం కూడా చేయలేదు. ప్రియాంకా గాంధీ అదపాదడపా పర్యటనలతో మమ అనిపించారు. రాహుల్ ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయినా బీజేపీ వైఫల్యానికి తోడు, ఆప్ ప్రభావం చూపలేకపోవడంతో కాంగ్రెస్ను విజయం తనంతతానుగా వరించింది. కష్టించి సాధించినది కాదు. ఆప్... అప్పుడే కాదు! బీజేపీకి కంచుకోట అయిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను బద్దలు కొట్టి 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెర దించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. భారీ పథకాలు, తాయిలాలతో అట్టహాసంగా రాష్ట్ర ఎన్నికల బరిలో దిగిన ఆప్.. ‘పహలే ఆప్’ అంటూ ఏమాత్రం పోటీనివ్వకుండా బీజేపీకి దారిచి్చంది! పైగా కాంగ్రెస్ ఓట్లను భారీగా చీల్చి బీజేపీకి రికార్డు సంఖ్యలో స్థానాలు కట్టబెట్టింది. గుజరాత్లో సాధించిన ఓట్ల శాతం సాయంతో జాతీయ పార్టీ గుర్తింపు దక్కనుండటమే ఆప్కు ఏకైక ఊరట. బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనంటూ పదేపదే చీపురు ఝళిపిస్తున్న ఆప్ నిజంగా ఆ స్థాయికి చేరాలంటే మరింత సమయం తప్పదని ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి. ఇక హిమాచల్ ఎన్నికల్లోనైతే ఆప్ సోదీలో కూడా లేకుండానే పోయింది. ఓడినా అనుభవం దక్కిందని తృప్తి పడటమే ఆ పారీ్టకి చివరికి మిగిలింది! - ఎస్.రాజమహేంద్రారెడ్డి -
గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు
న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని, అనూహ్య ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలిచిన వారంతా తమతోనే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, గుజరాత్, హిమచల్ ప్రదేశ్ ఎన్నికలు ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ ఢిల్లీని వరుసగా 15 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ను అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టి ఓడించారని సీఎం భగవంత్ మాన్ గుర్తు చేశారు. అలాగే 15 ఏళ్లుగా ఎంసీడీని ఏలుతున్న బీజేపీని ఇప్పుడు మట్టి కరిపించారని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని బీజేపీ.. ఢిల్లీలో మొహరించిందని ఆరోపించారు. విద్వేష రాజకీయాలు వద్దు ఢిల్లీ ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారని సీఎం భగవంత్ మాన్ అన్నారు. ‘ఢిల్లీ వాసులు విద్వేష రాజకీయాలు ఇష్టపడటం లేదు. స్కూల్స్, ఆస్పత్రులు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కోసం ఓటు వేశార’ని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: హస్తినలో ‘ఆప్’ హవా.. ఢిల్లీ మేయర్గా మహిళ!) -
ధిక్కారం ఏమైంది? స్వరం మార్చిన సీఎం!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వరం మారింది. ఆయన ఓటమిని అంగీకరించారు. ఎంసీడీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీని అభినందించడమే కాదు.. కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. నిజానికి సోమవారం వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధిక్కార స్వరమే వినిపించారు. ఆప్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే ఈవీఎంలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేపడతామని హెచ్చరికలు చేశారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. అంతకుముందు ఆప్ నేతలు కూడా తమ పార్టీ ఓటమికి ఈవీఎంలే కారణమని నిందించారు. ఢిల్లీలో మోదీ హవా లేదని, ఈవీఎంల హవా మాత్రమే ఉందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వ్యాఖ్యానించారు. ఎంసీడీ ఫలితాల సరళిలో ఆప్ ఓటమి ఖాయమని తేలిన నేపథ్యంలో సీనియర్ నేతలు మనిష్ సిసోడియా, గోపాల్ రాయ్తో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ 'ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ విజయం సాధించిన బీజేపీ అభినందనలు. ఢిల్లీ పురోగావృద్ధి కోసం ఎంసీడీలతో కలిసి పనిచేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది' అని ట్వీట్ చేశారు. I congratulate BJP on their victory in all 3 MCDs. My govt looks forward to working wid MCDs for the betterment of Delhi — Arvind Kejriwal (@ArvindKejriwal) 26 April 2017 -
డ్రామాలు చేయకు.. ప్రధాని ఆలోచన మానుకో!
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ఆయన సన్నిహితుడొకరు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ సన్నిహిత అనుచరుడైన ఆప్ మాజీ నేత మయాంక్ గాంధీ తాజాగా తీవ్ర విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ బహిరంగ లేఖ రాశారు. కేజ్రీవాల్ను హీరో, రాజకీయ నాయకుడిగా సంబోధిస్తూ ఆయన రాసిన ఈ లేఖలో ఆప్ తాజా ఘోర పరాభవం అహంకారానికి తగిలిన ఎదురుదెబ్బగా అభివర్ణించారు. 'రాజీపడటమే ఎరుగని ఒకప్పటి నిస్వార్థ హీరో అరవింద్ ఇప్పుడు బతికిలేడు. అతని స్థానంలో 2019లో ప్రధానమంత్రి కావాలన్న లక్ష్యంతో అందుకు అనుగుణంగా మద్దతును పొందాలనుకుంటున్న రాజకీయ నాయకుడు మాత్రమే ఉన్నాడు' అని మయాంక్ విమర్శించారు. 'సొంత అహంకారం, అంతర్గత రాజకీయ కుమ్ములాటల్లో మనం ఇతర పార్టీలను ఓడించాం' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఢిల్లీ ముఖ్యమంత్రిగా, పార్టీ కన్వీనర్గా పగ్గాలు చేపట్టడం ద్వారా పూర్తి అధికారాన్ని నీ చేతుల్లోనే పెట్టుకున్నావు. ప్రత్యామ్నాయ రాజకీయాలను అందించడానికి ఇంకెంత అధికారం నీకు కావాలి?' అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్తో పోరాడటానికే ఆప్ పురుడు పోసుకున్నదని, కానీ అలాంటి మరో పార్టీగా మిగలడానికి కాదని హితవు పలికారు. ప్రధానమంత్రి కావాలన్న జాతీయ ఆశయాలను పక్కనబెట్టి ఇకనైన ఢిల్లీలో మెరుగైన పాలన అందించాలని, డ్రామాలు, ఇతరులను నిందించడాలు ఆపాలని ఆయన సూచించారు. -
వ్యూహం మార్చిన ఆప్!
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల రాజోరీ గార్డెన్ ఉప ఎన్నికలో ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచార వ్యూహాన్ని మార్పు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ప్రచారం చేయడానికి బదులు తమ ప్రభుత్వ పనితీరును, హామీలను గురించి ప్రచారం చేయాలని ఆప్ నిర్ణయించింది. ఆప్ ప్రభుత్వం నీటి బిల్లును మాఫీ చేసిందని, మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే హౌస్ టాక్స్కు మాఫీ చేస్తామని ఆప్ ఏర్పాటు చేసిన హోర్డింగులు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి. రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు సంధిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలు ఇప్పుడు ఎమ్సీడీ ఎన్నికల్లో దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల కోసం పాటించిన వ్యూహాన్నే ఇక పాటించాలని ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఇటీవల నిర్ణయించింది. 49 రోజుల్లో తమ ప్రభుత్వం చేసిన పనులను విస్తృతంగా ప్రచారంలో ఉపయోగించుకుని ఆప్ 2015 ఎన్నికలలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో నెగ్గడనానికి కూడా రెండు సంవత్సరాల్లో ఆప్ ప్రభుత్వం చేసిన పనులను వివరించాలని పార్టీ నిర్ణయించింది. మోదీ ప్రభజంనం బలంగా ఉన్నందువల్ల ఆయన వ్యతిరేక ప్రచారం చేసినట్లయితే తమకు ఎదురు దెబ్బ తగలవచ్చన్న విషయాన్ని ఆప్ యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాల ద్వారా గ్రహించింది. అందుకే ఆప్ నేతలు తమ ప్రచారంలో నరేంద్ర మోదీ పేరెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజోరీ గార్డెన్ ఎన్నికలో ఓటమి తరువాత కూడా ఆప్ నేతలు గతానికి భిన్నంగా వ్యవహరించి జర్నైల్ సింగ్ రాజీనామా కారణంగా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహమే తమను విజయానికి దూరం చేసిందని పార్టీ నేతలు అంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పనితీరు మెరుగుపడకపోతే చర్యలు
హోం ఓటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ఆదివారం రాహుల్ గాంధీ..
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం....
రాహుల్గాంధీ సభను విజయవంతం చేయండి
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
సై.. అంటే సై!
మహిళలే నిరే్ణతలు
ఆదివారం రాహుల్ గాంధీ..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement