breaking news
Maulana Fazlullah
-
పెషావర్ కంటే తీవ్రమైన దాడి చేస్తాం: తాలిబన్ చీఫ్
పెషావర్: గత సంవత్సరం డిసెంబర్ నెలలో పెషావర్ లో సృష్టించిన విధ్వంసం కంటే ఈసారి తీవ్రమైన దాడిని చేస్తామని తాలిబన్లు హెచ్చరించారు. దీనికి సంబంధించిన తాలిబన్ చీఫ్ మౌలానా ఫజుల్లాహ్ పేరుతో విడుదల అయిన వీడియో తాజాగా కలకలం రేపుతోంది.' పెషావర్ లో భారీ విధ్వంసం సృష్టించాం. ఈసారి అంతకంటే తీవ్రమైన దాడి చేస్తాం' అని ఆ వీడియో ద్వారా సోమవారం హెచ్చరికలు జారీ చేశాడు. 2014 వ చివర్లో పెషావర్ ఆర్మీ పాఠశాలలో తాలిబాన్లు పాల్పడిన ఘాతకంలో 148 మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 16 వ తేదీన చేసిన తాలిబన్ల దాడిలో ఎక్కువ మంది విద్యార్థులు మరణించారు. -
తాలిబన్ చీఫ్ ఫజులుల్లా హతం !
-
తాలిబన్ చీఫ్ ఫజులుల్లా హతం !
పాకిస్థాన్ : పాక్ సైన్యం జరిపిన ద్రోణి దాడుల్లో పాక్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజులుల్లా హతమైనట్లు పాక్ మీడియాలో శనివారం విస్తృతంగా కథనాలు వచ్చాయి. పెషావర్లో ఇటీవల జరిగిన ఆర్మీ స్కూల్పై తీవ్రవాదుల దాడిలో 148 మంది హతమైన ఘటనకు ఫజులుల్లానే సూత్రధారిని పాక్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ పెషావర్ ఘటన అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాక్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని స్వాత్ లోయని తాలిబన్ స్థావరాలపై పాక్ సైన్యం ద్రోణి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఫజులుల్లా మృతి చెందినట్లు తెలిపింది. ఇన్నాళ్లు ఫజ్లుల్లా గురించి తెలిసినా.. పట్టించుకోనట్టు ఉన్నా పాక్ పెద్దలు.. పెషావర్ దాడితో సైనిక దాడులు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫజ్లుల్లా స్థావరం గురించి పక్కాగా తెలుసుకున్న సైన్యం,..ద్రోణి దాడులతో మట్టుపెట్టినట్టు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి.