breaking news
Matheran hill station
-
మాథేరాన్ టాయ్ట్రైన్ వచ్చేస్తోంది..
దాదర్: పర్యాటకులకు ఎంతో ఇష్టమైన నేరల్–మాథేరాన్ మధ్య నడిచే టాయ్ ట్రైన్ సేవలు నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 నుంచి సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా ఆకస్మిక వర్షాల కారణంగా ఇది వాయిదా పడింది. కాని రైల్వే అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేరల్–మాథేరాన్ మధ్య నడిచే టాయ్ ట్రైన్ రైలు మార్గం 80% కొండ అంచుల మీదుగా ఉంది. నేలపై ఉన్న నేరల్ నుంచి కొండపై ఉన్న మాథేరాన్ మధ్య 21 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ (అప్, డౌన్లో) గమ్యస్థానానికి చేరుకోవాలంటే రెండు గంటలపైనే సమయం పడుతుంది.ముఖ్యంగా వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, కల్వర్టులు కొట్టుకుపోవడం, పట్టాల కిందున్న మట్టి, కంకర వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతుంది. ఫలితంగా అనేక చోట్ల రైలు పట్టాలు గాలిలో వేలాడుతుంటాయి. దీంతో ప్రమాదాలు జరగక ముందే ముందు జాగ్రత్త చర్యగా ఏటా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకు అంటే జూన్ 15వ తేదీ నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు ఈ రైలు మార్గం పూర్తిగా మూసి వేస్తారు. ఈ సమయంలో రైల్వే ఇంజిన్లు, కోచ్లు మరమ్మతుల నిమిత్తం పరేల్లోని రైల్వే వర్క్ షాపునకు తరలిస్తారు. అలాగే ఈ నాలుగు నెలల కాలవ్యవధిలో రైల్వే ట్రాక్స్కు మరమ్మతు పనులు పూర్తిచేసి అక్టోబరు 16 నుంచి రైలు సేవలు పునరుద్ధరిస్తారు. ఆ ప్రకారం అక్టోబరు 16 నుంచి టాయ్ ట్రైన్ సేవలు వినియోగంలోకి రావాల్సి ఉంది. పర్యాటకులు కూడా మాథేరాన్ రావడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఏడాది అక్టోబరులో 15 తర్వాత కూడా భారీ వర్షాలు కురవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టాయ్ ట్రైన్ సేవల ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందిప్రారంభించి వందేళ్లు దాటినా...ఈ రైలు మార్గాన్ని ప్రారంభించి వందేళ్లు దాటినప్పటికీ ఇంకా పర్యాటకుల మన్ననలు పొందుతూనే ఉంది. రోడ్డు మార్గం కంటే రైలు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకునే అనుభూతి పర్యాటకులు ఎన్నటి మరిచిపోరు. ఏటా లక్షలాది పర్యాటకులు మాథేరాన్ను సందర్శిస్తారు. వంద శాతం పర్యాటకులు టాయ్ ట్రైన్ను ఎక్కి ప్రయాణం చేయాలని కోరుకుంటారు. టికెట్లు దొరకని వారు రోడ్డు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకుంటారు. చదవండి: మహారాష్ట్ర చూపంతా ఈ నియోజకవర్గంపైనే...నవంబర్ 1కి వాయిదా పడిన విషయం కొందరు పర్యాటకులకు తెలియలేదు. ఎప్పటిలాగే అనేకమంది పర్యాటకులు ఎంతో ఉత్సాహంతో తమ కుటుంబ సభ్యులతో ఈ నెల 16, 17వ తేదీన నేరల్కు చేరుకున్నారు. వర్షాల కారణంగా నవంబర్ ఒకటో తేదీకి వాయిదా పడినట్లు తెలియగానే కొందరు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు రోడ్డు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకున్నారు. -
సెల్ఫీ తీసుకుంటూ చూస్తుండగానే..
సాక్షి, ముంబై : సరదాగా కుటుంబంతో గడుపుదామని విహారయాత్రకు వెళ్లిన ఓ వివాహిత ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించింది. ఈ ఘటన రాయ్గఢ్ జిల్లాలోని మాథెరన్ హిల్ స్టేషన్లో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ సంజయ్ పాటిల్ ప్రకారం.. ఢిల్లీకి చెందిన సరితా రామేష్ చౌహన్(33) తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి మంగళవారం చుట్టూ కొండలతో, ప్రకృతి రమణీయంగా ఉండే మాథెరన్ హిల్ స్టేషన్కు విహారయాత్రకు వెళ్లారు. ఎత్తయిన కొండ ప్రాంతం లూసియా పాయింట్ వద్ద సాయంత్రం అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో సరితా 500 అడుగుల లోయలో కాలుజారిపడిపోయారు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారని ఎస్పీ వెల్లడించారు. అప్పటికే చీకటి పడడంతో స్థానికుల సహాయంతో అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని వెలికి తీశామని పోలీసులు తెలిపారు. కాగా, తమిళనాడుకు చెందిన పర్యాటకులు సెల్ఫీ తీసుకునే క్రమంలో సోమవారం గోవా సముద్ర జలాల్లో నీటిలో మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్టు రిపోర్టు ప్రకారం.. 2015లో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న సెల్ఫీ ప్రమాద మరణాల్లో భారత్ వాటా సగమని తెలిపింది. -
ప్రాణం తీసిన గుర్రపు స్వారీ
అలీబాగ్(మహారాష్ట్ర): సరదాకి చేసిన గుర్రపు స్వారీ ఏడేళ్ల బ్రిటన్ బాలిక ప్రాణాలు తీసింది. గుర్రంపై నుంచి పడి కళ్లముందే తమ కూతురు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు విలవిలలాడారు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్కు చెందిన బాలిక ఇండియా మెవ్యూతన కుటుంబ సభ్యులతో కలసి అలీబాగ్లోని మధరాన్ హిల్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం గుర్రంపై షికారును ఎంజాయ్ చేస్తోంది. ఒక్కసారిగా గుర్రం పిచ్చిపట్టినదానిలా ఎగురుతూ బాలికతో సహా అడవిలోకి పరుగుతీసింది. ఈ క్రమంలో బాలిక గుర్రంపై నుంచి బ్యాలెన్స్ తప్పి కిందపడింది. అదే సమయంలో గుర్రానికి ఉన్న కల్లెంలో తన కాలు ఇరుక్కుపోవడంతో ఆ బాలికను గుర్రం దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ బాలిక తలకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు కోల్పోయింది. ఆ బాలిక తండ్రి గోవిన్ మార్క్ మెవ్యూ దుబాయ్లోని ఓ కపంఎనీలో పనిచేస్తున్నాడు. ముంబై వచ్చిన అతడు సరదాగా గడిపేందుకు కుటుంబంతో హిల్ స్టేషన్కు రాగా ఈ విషాధం చోటుచేసుకుంది.