match fees cut
-
భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్కు షాక్
భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్కు భారీ షాక్ తగిలింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో మహిళా అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు అతని మ్యాచ్ ఫీజ్లో 30 శాతం కోత విధించారు. అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినందుకు 10 శాతం.. పరికరాల దుర్వినియోగానికి పాల్పడినందుకు (బ్యాట్) 20 శాతం జరిమానా విధించారు. ఈ విషయమై మ్యాచ్ రిఫరీ అశ్విన్ను విచారించగా తప్పు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.అశ్విన్కు ఇలాంటివి కొత్త కాదుఅంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న అశ్విన్కు ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. గతంలో చాలా సార్లు మ్యాచ్ రిఫరీల చేత అక్షింతలు వేయించుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా దేశవాలీ క్రికెట్లోనూ తన దురుసు ప్రవర్తనతో వార్తల్లోకెక్కేవాడు. ఏదైన విషయంలో అశ్విన్ తన అసంతృప్తిని గట్టిగా వ్యక్తం చేసేవాడు.అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్లో అశ్విన్ దిండిగల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. లీగ్లో భాగంగా నిన్న (జూన్ 8) ఐడ్రీమ్ తిరుప్పుర్తో జరిగిన మ్యాచ్లో అశ్విన్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. సాయి కిషోర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతికి అశ్విన్ స్వీప్ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతి వికెట్ల ముందు అశ్విన్ ప్యాడ్లకు తాకింది.దీంతో సాయి కిషోర్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశాడు. అక్కడే ఉన్న మహిళా అంపైర్ మారు ఆలోచించకుండా అశ్విన్ను ఔట్గా ప్రకటించింది. దీంతో అశ్విన్ పట్టరాని కోపంతో ఊగిపోతూ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ పట్టించుకోకపోవడంతో అశ్విన్ అసహనంతో బ్యాట్ను తన ప్యాడ్కు కొట్టుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. అశ్విన్కు రివ్యూ కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. అప్పటికే ఆ జట్టు రెండు రివ్యూలను వినియోగించుకుంది.ఈ మ్యాచ్లో అశ్విన్ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 18 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో అశ్విన్ జట్టు దిండిగుల్ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. -
ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్.. విండీస్కు కూడా..!
5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా విండీస్తో నిన్న (ఆగస్ట్ 3) జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నుంచి తేరుకోక ముందే ఐసీసీ భారత జట్టుకు మరో షాకిచ్చింది. స్లో ఓవర్రేట్ కారణంగా ఐసీసీ టీమిండియా మ్యాచ్ ఫీజ్లో 5 శాతం, విండీస్ మ్యాచ్ ఫీజ్లో 10 శాతం కోత విధించింది. నిర్దిష్ట సమయానికి భారత్ ఒక ఓవర్, విండీస్ రెండు ఓవర్లు వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఇరు జట్లకు జరిమానా విధించింది. కాగా, ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 145 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్లో పూరన్ (41), కెప్టెన్ రోవ్మన్ పావెల్ (48) రాణించగా.. భారత్ ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (39) ఒక్కడే పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లు అర్ష్దీప్ సింగ్, చహల్ తలో 2 వికెట్లు, హార్దిక్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టగా.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్, ఓబెద్ మెక్కాయ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు, అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. రెండో టీ20 ఆగస్ట్ 6న గయానాలో జరుగనుంది. -
టీమిండియా కెప్టెన్ దురుసు ప్రవర్తన.. ఐసీసీ చర్యలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. బంగ్లాదేశ్తో నిన్న (జులై 22) జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ.. బ్యాట్తో వికెట్లను కొట్టనందుకు గాను, అలాగే ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా అంపైర్లపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసినందుకు గాను హార్మన్కు ఐసీసీ జరిమనా విధించింది . Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 హర్మన్ వ్యవహరించిన తీరును దురుసు ప్రవర్తనగా పేర్కొన్న ఐసీసీ.. ఆమె మ్యాచ్ ఫీజ్లో 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. హర్మన్ ప్రవర్తనను లెవెల్ 2 అఫెన్స్ కింద పరిగణించిన ఐసీసీ.. ఆమెకు 4 డీ మెరిట్ పాయింట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 జరిమానాలో 50 శాతం ఆన్ ఫీల్డ్ దురుసు ప్రవర్తనకు, 25 శాతం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు ఐసీసీ తెలిపింది. అలాగే 3 డీమెరిట్ పాయింట్లు ఆన్ ఫీల్డ్ దురుసు ప్రవర్తనకు, ఓ డీమెరిట్ పాయింట్ ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు వివరించింది. The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd — Female Cricket (@imfemalecricket) July 22, 2023 కాగా, బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్కు తగలకుండా.. ప్యాడ్కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్ అవతల పిచ్ అయిందని భావించిన హర్మన్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయింది. బ్యాట్తో వికెట్లను కొట్టడమే కాకుండా.. కనీస ధర్మాన్ని పాటించడం లేదంటూ అంపైర్ను తిట్టుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లింది. ఇంతటితో ఆగని హర్మన్.. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా బంగ్లాదేశ్ అంపైరింగ్ ప్రమాణాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు కనీసం స్వాగతం కూడా పలకలేదని అసహనం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ క్రికెట్లో అంపైరింగ్ లోపాలే అనుకున్నాం.. వారికి కనీస మర్యాదలు కూడా తెలియవని తీవ్రస్థాయి పదజాలాన్ని వాడింది. అలాగే ప్రజెంటేషన్ సెర్మనీ మొత్తం పూర్తయ్యాక బంగ్లా ఆటగాళ్లతో ఫోటోలు దిగేందుకు కూడా నిరాకరించింది. -
IPL 2023: రవిచంద్రన్ అశ్విన్కు భారీ షాక్
చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ను భారీ షాక్ తగిలింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్లు బంతిని మార్చడాన్ని బహిరంగంగా విమర్శించినందుకు (పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో) గాను అశ్విన్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద అశ్విన్కు ఈ జరిమానా విధించినట్లు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ తెలిపారు. కాగా, ఇదే మ్యాచ్కు సంబంధించి రాజస్థాన్కు మరో షాక్ కూడా తగిలింది. స్లో ఓవర్రేట్ కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్కు కూడా రిఫరీ జరిమానా (12 లక్షలు) విధించారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట విజయం సాధించి టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. -
రోహిత్, బాబర్ సేనలకు భారీ షాక్
IND VS PAK: ఆసియా కప్-2022లో భాగంగా గత ఆదివారం పాక్తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు సంబంధించి ఐసీసీ తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసినందుకు గాను ఐసీసీ భారత్, పాక్లకు జరిమానా విధించింది. ఇరు జట్ల మ్యాచ్ ఫీజ్లో ఏకంగా 40 శాతం కోత విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం.. మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా జరిగితే ఆటగాళ్లకు స్లో ఓవర్ రేట్ ఫైన్తో పాటు మ్యాచ్లో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఆ మ్యాచ్లో ఇరు జట్లు కోటా సమయాన్ని (గంటన్నర) దాటి అరగంట ఇన్నింగ్స్ను పొడిగించారు. దీంతో ఆ అరగంట సమయంలో ఇరు జట్లు ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్తో బరిలో నిలిచాయి. దీని ప్రభావం భారత్తో పోలిస్తే పాక్పై అధికంగా పడింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ నిబంధనే పాక్ కొంపముంచింది. ఛేదనలో హార్ధిక్ చెలరేగడానికి ఈ నిబంధన పరోక్ష కారణంగా చెప్పవచ్చు. ఆఖరి మూడు ఓవర్లలో 30 గజాల సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండటాన్ని హార్ధిక్ అడ్వాంటేజ్గా తీసుకుని చెలరేగిపోయాడు. సిక్సర్ కొట్టి మరీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, ఆగస్ట్ 28న పాక్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చలాయించి విజేతగా నిలిచింది. హార్ధిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించగా.. భువీ, కోహ్లి, జడేజాలు జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: మరో బిగ్ సండే.. వచ్చే ఆదివారం మరోసారి పాక్తో తలపడనున్న టీమిండియా..! -
కేఎల్ రాహుల్కు జరిమానా..
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్కు మ్యాచ్ రిఫరి క్రిస్ బ్రాడ్ జరిమానా విధించారు. రాహుల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. మూడో రోజు ఆట తొలి సెషన్ 34వ ఓవర్లో ఆండర్సన్ బౌలింగ్లో బెయిర్స్టో క్యాచ్కు అపీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూకి వెళ్లాడు. అందులో బంతి బ్యాట్ ఎడ్జ్కి తగిలినట్లు తేలడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని రాహుల్ను ఔట్గా ప్రకటించాడు. దీనిపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అతనిపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8(అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం) ఉల్లంఘన నేరం కింద జరిమానా విధించారు. దీంతోపాటు రాహుల్ క్రమశిక్షణ రికార్డ్లో ఒక డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చారు. చదవండి: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక సభ్యుడికి కరోనా -
రోహిత్ శర్మ అస్సలు కేకలు వేయలేదు!
ఎంపైర్ తో వాగ్వాదానికి దిగిన తమ జట్టు కెప్టెన్ ను ముంబై ఇండియన్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెనకేసుకొచ్చాడు. ఎంపైర్తో రోహిత్ శర్మ తప్పుగా ప్రవర్తించలేదని, నిబంధనలకు ఎంపైర్కు వివరించడానికే అతను ప్రయత్నించాడని చెప్పుకొచ్చాడు. రోహిత్ ఎంపైర్తో వాదన పెట్టుకోలేదని, కేకలు వేయలేదన్నాడు. వాంఖడే స్టేడియంలో సోమవారం పుణేతో జరిగిన మ్యాచ్లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపైర్తో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. పుణే బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ వేసిన బంతి వైడ్ వెళ్లినా అంపైర్ ఇవ్వకపోవడంతో రోహిత్కు కోపం వచ్చింది. నేరుగా అంపైర్ దగ్గరకు వెళ్లి ఎందుకు వైడ్ ఇవ్వలేదంటూ వాదనకు దిగాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింనందుకు రోహిత్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. మ్యాచ్లో జరిగిన ఈ ఘటనపై హర్భజన్ స్పందిస్తూ.. ‘ ఆ బంతి మాత్రం చాలా దూరంగా వెళ్లింది. నిజాయితీగా చెప్పాలంటే.. అది వైడా, కాదా అన్నది నాకు తెలియదు. బ్యాట్మన్ రెండు కాళ్లు కదిలించినప్పుడు బౌలర్కు మార్జిన్ ఇవ్వవచ్చు. కానీ రోహిత్ ఒక కాలు మాత్రమే కదిలించాడు. ఆ ప్రకారం ఇది వైడ్ కావాలి. కానీ ఎంపైర్ నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఆటలో ఎవరు మెరుగ్గా ఆడితే వారే గెలుస్తారు’ అని చెప్పాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్తో ముంబైపై పుణేతో మూడు పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. బేన్ స్టోక్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్ గతిని మార్చి.. పుణే వైపు మొగ్గేలా చేసిందని, ఆఖరి వరకూ పోరాటం చేసినా చివరి ఓవర్లో రోహిత్ ఔటవ్వడంతో విజయావకాశాలు దెబ్బతిన్నాయని అన్నారు. -
రోహిత్ శర్మకు షాక్
ముంబై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు షాక్ తగిలింది. అంపైర్తో వాగ్వాదానికి దిగినందుకు అతడికి జరిమానా విధించారు. సోమవారం రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అంపైర్ ఎస్. రవితో వాదానికి దిగాడు. పుణే బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ వేసిన బంతి వైడ్ వెళ్లినా అంపైర్ ఇవ్వకపోవడంతో రోహిత్కు కోపం వచ్చింది. నేరుగా అంపైర్ దగ్గరకు వెళ్లి ఎందుకు వైడ్ ఇవ్వలేదని గొడవపడ్డాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింనందుకు రోహిత్ శర్మపై చర్య తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించినట్టు ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. రోహిత్ కూడా తప్పు ఒప్పుకున్నాడు. ఐపీఎల్-10లో రెండోసారి అంపైర్ నిర్ణయాన్ని అతడు వ్యతిరేకించాడు. కోల్కతా నైట్రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి మందలింపుకు గురయ్యాడు. సునీల్ నరైన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుటైన రోహిత్ శర్మ.. అంపైర్ సీకే నందన్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్ వైపు బ్యాటు చూపిస్తూ అసంతృప్తిగా మైదానం వీడాడు.