Mata Vaishnav Devi Temple
-
వైష్ణో దేవి యాత్ర నిలిపివేత.. భక్తులకు ప్రత్యేక సూచన
జమ్మూ: ప్రస్తుతం కొనసాగుతున్న చైత్ర నవరాత్రుల వేళ జమ్ముకశ్మీర్లోని మాతా వైష్ణో దేవి ఆలయం భక్తజన సంద్రమైంది. రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తడంతో భద్రతా కారణాల దృష్ట్యా శనివారం (మార్చి 21) సాయంత్రం యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.ఒక్కరోజే 39 వేల మంది..రియాసీ జిల్లాలోని త్రికూట పర్వతాలపై కొలువైన ఈ దివ్య క్షేత్రానికి శనివారం ఒక్కరోజే సుమారు 39,000 మంది భక్తులు తరలివచ్చారు. చైత్ర నవరాత్రులు (మార్చి 19 - మార్చి 27) ప్రారంభమైన మూడవ రోజే ఈ స్థాయిలో రద్దీ పెరగడంతో, క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా యాత్రను నిలిపివేస్తున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.మళ్లీ రిజిస్ట్రేషన్లు ఎప్పుడంటే..యాత్ర నిలిపివేతతో కొత్త రిజిస్ట్రేషన్లను ప్రస్తుతానికి ఆపివేశారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు పోలీసులు మైకుల ద్వారా భక్తులకు సమాచారం అందించారు. అప్పటి వరకు భక్తులు తమ హోటళ్లలోనే వేచి ఉండాలని సూచించారు. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న సుమారు 10,000 మంది భక్తులు ప్రస్తుతం కొండపైకి వెళ్తున్నట్లు సమాచారం. ‘జై మాతా దీ’ స్మరణలతో కొండ మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.పటిష్ట భద్రత - ప్రత్యేక పూజలునవరాత్రుల రద్దీ దృష్ట్యా కత్రా బేస్ క్యాంప్ నుండి ఆలయ మార్గం వరకు బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్య సదుపాయాలు, మార్గదర్శక కేంద్రాలను బోర్డు సిద్ధం చేసింది. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో గురువారం ప్రారంభమైన 'శత చండీ మహాయాగం' శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండటంతో రాబోయే వారం రోజుల పాటు రద్దీ ఇలాగే ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎన్నికల విధుల ఒత్తిడి.. నదిలో దూకిన ఉపాధ్యాయుడు -
నేటి నుంచి వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని రియాసీ జిల్లా త్రికూట పర్వతాల్లో కొలువైన మాతా వైష్ణోదేవి ఆలయ తీర్థయాత్ర ఈ నెల17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అయితే, వాతావరణం అనుకూలంగా ఉంటేనే యాత్ర మొదలవుతుందని ఆలయ బోర్డు మంగళవారం తెలిపింది. ఆగస్ట్ 26వ తేదీన ఆలయ మార్గంలో కొండచరియలు విరిగి పడి 34 మంది యాత్రికులు చనిపోవడం తెల్సిందే.ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా యాత్రను నిలిపివేశారు. ఈ నెల 14వ తేదీన యాత్ర పునఃప్రారంభం అవు తుందని ఆలయ బోర్డు ప్రకటించింది. అయితే, ఎడతెరిపి లేని వానలతో వాయిదా వేస్తున్నట్లు తెలి పింది. అయితే, రెండు రోజుల క్రితం కొందరు యాత్రికులు కాట్రా బేస్ క్యాంప్ వద్ద ఆందోళనకు దిగడంతో యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. -
గంటసేపు సొరంగంలోనే
చండీగఢ్: మాతా వైష్ణవీ దేవి ఆలయం- ఢిల్లీ మధ్య ఇటీవల ప్రవేశపెట్టిన శ్రీశక్తి సూపర్ఫాస్ట్ ఏసీ ఎక్స్ప్రెస్ రైలు గంటపాటు ప్రయాణికులను బెంబేలెత్తించింది. కత్రా రైల్వేస్టేషన్కు ఐదు కిలోమీటర్ల దూరంలోగల ఓ సొరంగంలో బుధవారం ఈ రైలు ఆగిపోయింది. ఈ రైలును ఇటీవల ప్రారంభించిన సంగతి విదితమే. ఈ విషయమై ఫిరోజ్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎన్సీ గోయల్ మాట్లాడుతూ ఏడు గంటలకు కత్రా స్టేషన్కు చేరుకుందన్నారు. వాస్తవానికి ఇది ఈ స్టేషన్కు ఉదయం గం 5.30కే రావాల్సి ఉందన్నారు. ఈ సమాచారం అందగానే ఉధంపూర్నుంచి మరో ఇంజన్ను అక్కడికి పంపించామన్నారు. ఇంజన్ ఎందుకు పనిచేయలేదనే అంశానికి సంబంధించి తమకు సమాచారం అందాల్సి ఉందన్నారు. 100 నిమిషాల తర్వాత శ్రీశక్తి సూపర్ఫాస్ట్ ఏసీ ఎక్స్ప్రెస్ రైలు తన గమ్యస్థానానికి చేరుకుందన్నారు. అప్పటికే ఈ రైలు 35 నిమిషాలమేర ఆలస్యంగా నడుస్తోందని, దీంతో 100 నిమిషాల తర్వాత తన గమ్యస్థానానికి చేరుకుందన్నారు. ఇదే విషయమై ఉత్తర రైల్వే డివిజనల్ మేనేజర్ నీరజ్శర్మ మాట్లాడుతూ ఇంజన్ పనిచేయకపోవడం వల్లనే రైలు సొరంగంలో చిక్కుకుపోయిందన్నారు. టన్నెల్ మార్గంలో ఎటువంటి సమస్యలూ లేవన్నారు. మరో ఇంజన్ అక్కడికి చేరుకుని ఈ ఎక్స్ప్రెస్ను గమ్యస్థానానికి చేర్చిందన్నారు.


