breaking news
massive search
-
ఆత్రేయీ మజుందార్ నీవెక్కడ..?
బెంగుళూరు : గత వారం అదృశ్యమైన బెంగుళూరుకు చెందిన ఆంత్రోపాలజిస్ట్ ఆత్రేయీ మజుందార్ (35) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆమె ఆచూకీ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. అందుకోసం వారు గూగుల్ స్ప్రెడ్ షీట్స్ను కూడా వాడుతున్నారు. కెనడాలో పీహెచ్డీ చేస్తున్న మజుందార్ ఏప్రిల్ 4న బెంగుళూరులోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇంటికి వచ్చిన అనంతరం తన గదిలోకి వెళ్లి రాత్రి తొమ్మిది గంటల వరకూ నిద్రపోయింది. తర్వాత తన గది నుంచి బయటకు వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. నాటి నుంచి ఈ రోజు వరకూ ఆమె ఆచూకీ తెలియలేదు. కాగా మజుందార్ కనిపించకుండా పోవడానికి ఒక్క రోజు ముందు తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. కానీ ఆమె వారితో సరిగా మాట్లడలేదు. మరుసటి రోజు ఆమె తాను ఢిల్లీలో ఉన్నట్లు తండ్రితో చెప్పింది. ఆమెను బెంగుళూరు రమ్మని తండ్రి సూచించినా కుమార్తె ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్రేయీ మజుందార్ బెంగళూరులోని బెల్లందూర్లో బస చేసిన నోవాటెల్, మారియట్ హోటల్ నుంచి సీసీటీవీ ఫూటేజ్ తెప్పించి పరిశీలించారు. మజుందర్ హోటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తనతో పాటు పాస్పోర్టు, డబ్బులను మాత్రమే తీసుకెళ్లింది. ఫోన్ను హోటల్లోనే వదిలేసి వెళ్లినట్లుగా తెలిసింది. మజుందార్ తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో ఆమె ఫోటోను షేర్ చేసి ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బెంగళూరులోని నేషనల్ లా కాలేజీలో చదువుకున్న మజుందార్ ప్రస్తుతం పీహెచ్డీ చేయడానికి టోరంటో వెళ్లింది. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఈ కింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుతున్నారు. 9845261515, 9448290990 -
హోటళ్లు, లాడ్జీల్లో విస్త్రత తనిఖీలు
నెల్లూరు, సిటీ: జిల్లా కోర్టు ఆవరణలో కుక్కర్ బాంబు ఘటనతో పోలీసులు నెల్లూరు నగరంలోని అన్ని హోటల్స్, లాడ్జీలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాలతో అన్ని స్టేషన్ల పరిధిలోని హోటల్స్, లాడ్జీల్లో సోమవారం రాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. హోటల్స్లోని ప్రతి గదినీ పరిశీలించారు. అనుమానితులుగా ఉన్న వారిని ప్రశ్నించి, వారి పూర్తివివరాలు సేకరించారు. మంగళవారం రాత్రి కూడా తనిఖీలు కొనసాగాయి. -
ఉలిక్కిపడ్డ నెల్లూరు
జిల్లా కోర్డు ఆవరణలో బాంబు పేలుడుతో భయపడ్డ జనం పోలీసు యంత్రాంగం అప్రమత్తం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన బాంబు పేలుడు ఘటనతో నెల్లూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు. కక్షిదారుల మధ్య గొడవల కారణంగానే ఈ సంఘటన జరిగిందా? లేక నగరంలో అలజడి సృష్టించడానికి జరిగిన విద్రోహక చర్యా? అన్న అనుమానాల నేపథ్యంలో పోలీసు యంత్రాగం విభిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసింది. పేలుడు సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ విశాల్ గున్నీ గుంటూరు నుంచి హుటాహుటిన ఇక్కడికి వచ్చారు. సంఘటన స్థలంలో లభించిన వస్తువులను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. నెల్లూరు(క్రైమ్): జిల్లా కోర్టు ఆవరణ(మూడో అదనపు జూనియర్ జడ్జి కోర్టు ఎదురుగా గల గోడవద్ద)లో సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు గుర్తుతెలియని దుండగులు బాంబు పేల్చారు. పేలుడు దాటికి గోడకు, సమీపంలోని చెట్టుకు, గోడ అవతలివైపున రంధ్రాలయ్యాయి. దుండగులు అరలీటర్ సామర్థ్యం కల్గిన ప్రెజర్ కుక్కర్ను టిఫిన్ బ్యాగ్లో అమర్చి 9వోల్ట్స్ బ్యాటరీలను వినియోగించి పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బ్లాస్ట్లో అమోనియం నైట్రేట్ను వినియోగించినట్లు సమాచారం. బ్లాస్టింగ్ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ తరహా ఘటనలను ఐఈడీ(ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)గా పోలీసులు తెలిపారు. భిన్న కోణాల్లో దర్యాప్తు నిత్యం వందలాదిమంది కక్షిదారులు, న్యాయవాదులు కోర్టుకు వస్తున్న నేపథ్యంలో బాంబు ఘటనతో సోమవారం జిల్లా కోర్టు ఆవరణలోని అన్నీ కోర్టుల్లో ఏయే కేసులు విచారణ సాగింది అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి కేసుల్లోని బాధితులు? ముద్దాయిలు ఎవరైనా ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉండవచ్చునన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. తీవ్రవాద సంస్థ అల్ ఉమా హస్తం ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. అదనపు ఎస్పీలు శరత్బాబు, సూరిబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు, మేయర్ అబ్దుల్ అజీజ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాగం జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటల్స్, రైల్వే, బస్ స్టేషన్లతో పాటు వాహన తనిఖీలను నిర్వహించింది. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : విశాల్గున్నీ, ఎస్పీ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఇది విద్రోహక చర్య కాదు. ఎవరో కావాలనే ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉండవచ్చు. బక్రీదు సందర్భంగా జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా? అనుమానాస్పదంగా వాహనాలు నిలిపి ఉంచినా వెంటనే 9440796300, 9447096384, 9440796303, డయల్ 100కు సమాచారం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తాం. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తాం. -
ఇంకా దొరకని సైకో సూదిగాడు!