breaking news
marudanayakam
-
మరుదనాయగమ్ ఎవరు?
కమల్హాసన్కి డ్రీమ్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ‘మరుద నాయగమ్’ ఒకటి. 1997లో స్వీయదర్శకత్వంలో టైటిల్ రోల్ చేస్తూ ఈ సినిమాని మొదలుపెట్టారు కమల్. అయితే మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దానికి ఓ కారణం బడ్జెట్ అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఏదో సందర్భంలో కమల్ ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ‘మరుదనాయగమ్’ని పూర్తి చేయాలనుకుంటున్నానని కమల్ పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నందువల్ల ఈ సినిమాలో నటించలేనని స్పష్టం చేశారు. విక్రమ్ నటిస్తారని టాక్. ఇంతకీ ‘మరుదనాయగమ్’ ఎవరు? అంటే.. 18వ శతాబ్దానికి చెందిన పోరాట యోధుడు. ఆయన ఇస్లామ్ మతానికి మారాక యూసఫ్ ఖాన్గా పేరు మార్చుకున్నారు. -
ముమ్మరంగా మరుదనాయకం
విశ్వనటుడు చేయని పాత్ర, చేయలేని పాత్ర అంటూ ఉండదు. అయినా ఒక్కో నటుడికి ఒక్కో డ్రీమ్ పాత్ర ఉన్నట్లు కమలహాసన్ కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే మరుదనాయకం. ఒక చరిత్ర వీరుని కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని కమలహాసన్1997 అక్టోబర్ 16వ తేదీన ఎంతో ఆర్భాటంగా మొదలెట్టారు. చిత్ర ప్రారంభోత్సవానికి రాణి ఎలిజబెత్ను చెన్నైకి రప్పించారు. మరుదనాయకం 30 నిమిషాల సన్నివేశాలను అద్భుతంగా కమల్ చిత్రీకరించారు. అప్పటికే రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే చిత్ర బడ్జెట్ రూ.200 కోట్లు దాటుతుందన్న అంచనాతో షూటింగ్ ఆగిపోయింది. అయితే మరుదనాయకం చిత్రం డ్రాప్ అయినట్లు కమలహాసన్ ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పటికైనా ఆ చిత్రాన్ని చేసి తీరాలన్న దృఢ సంకల్పంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఉన్న విశ్వనటుడు అందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ మధ్య విదేశీ మిత్ర బృందం మరుదనాయకం చిత్రాన్ని పూర్తి చేయడానికి ముందుకొచ్చినట్లు కమలహాసనే స్వయంగా వెల్లడించారు. తాజాగా రజనీకాంత్ హీరోగా సుమారు రూ.400 కోట్లతో 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సంస్థ మరుదనాయకం చిత్ర నిర్మాణానికి ముందుకొచ్చినట్లు కమల్ వెల్లడించారు.ఈ విషయమై కమల్ ఆ సంస్థ అధినేత సుభాష్కరణ్తో చర్చలు జరిపినట్లు సమాచారం. మొత్తం మీద 19 ఏళ్ల తరువాత మరుదనాయకం చిత్ర నిర్మాణానికి ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లు తెలుస్తోంది. కమల్ తాజా చిత్రం శభాష్నాయుడు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రానికి లైకా సంస్థ భాగస్వామ్యం వహిస్తుందన్నది గమనార్హం.