breaking news
ManithaNeya Makkal Katchi
-
ఈసీకి హైకోర్టు నోటీసు
టీనగర్, న్యూస్లైన్: ఎన్నికల చిహ్నం కోరుతూ మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఎన్నికల కమిషన్కు మద్రాసు హైకోర్టు నోటీసులు పంపింది. మద్రాసు హైకోర్టులో మనిదనేయ మక్కల్ కట్చి అధ్యక్షుడు జేఎస్ రిపాయి దాఖలు చేసిన పిటిషన్లో ఈ విధంగా తెలిపారు. భారత ఎన్నికల కమిషన్లో తమ పార్టీ 2009లో నమోదైందని ఆనాటి నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ 24న జరగనున్నాయని ఈ ఎన్నికలలో డీఎంకే, వీసీకే పార్టీలతో తమ పార్టీ కూటమి ఏర్పాటు చేసుకుని మైలాడుదురై పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తోందన్నారు. ఈ నియోజకవర్గంలో తమ పార్టీ తరపున సీనియర్ నేత ఎస్ హైదర్ అలీ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి కొవ్వొత్తి చిహ్నం కేటాయించారన్నారు. అందువల్ల జరగనున్న పార్లమెంటు ఎన్నికలల్లోనూ అదే చిహ్నాన్ని కేటాయించాలంటూ భారత ఎన్నికల కమిషన్కు గత 17వ తేదీ విజ్ఞప్తి చేసింది. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువల్ల తమ పార్టీకి కొవ్వొత్తి చిహ్నం కేటాయించాలని ఎన్నికల కమిషన్కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎన్.పాల్ వసంతకుమార్, ఎం.సత్యనారాయణన్ ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది. విచారణ జరిపిన న్యాయమూర్తులు ఈ పిటిషన్కు వచ్చే ఏప్రిల్ 1వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలంటూ భారత ఎన్నికల కమిషన్కు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే తెన్కాశి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పుదియ తమిళగం పార్టీకి టెలివిజన్ చిహ్నం కేటాయించాలంటూ ఆ పార్టీ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తులు పాల్ వసంతకుమార్, సత్యనారాయణన్, ఏప్రిల్ 1వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలంటూ భారత ఎన్నికల కమిషన్కు ఉత్తర్వులు ఇచ్చారు. -
ఎమ్మెల్యేపై హత్యాయత్నం
తమిళనాడులోని మనిదనేయ మక్కల్ కట్చి (ఎంఎంకే)కి చెందిన ఎమ్మెల్యే అస్లం బాషాపై హత్యాయత్నం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద విచారణ జరుపుతున్నారు. ద్రావిడ తమిళర్ ఇయక్క పేరవై ఆధ్వర్యంలో తాంబరం షణ్ముగం రోడ్డులో శుక్రవారం సాయింత్రం బహిరంగ సభ జరిగింది. ఇందులో శుభ వీరపాండియన్, మనిదనేయ మక్కల్ కట్చికి చెందిన ఆంబూర్ ఎమ్మెల్యే అస్లం బాషా, జిల్లా డీఎంకే కార్యదర్శి టీఎం అన్బరసన్ పాల్గొన్నారు. సభ ముగియగానే అస్లం బాషా కారులో బయలుదేరి వెళ్లారు. కారు వెనుక ఆయన పార్టీకి చెందిన ఇమ్రాన్, ఖుదా ఆయన భద్రత కోసం బైకులో వెళ్లారు. జీఎస్టీ రోడ్డు, కడపేరి సమీపంలోగల పెట్రోలు బంకులో పెట్రోలు పట్టుకునేందుకు కారును నిలిపారు. ఆ సమయంలో పెట్రోల్ నింపుకునేందుకు వచ్చిన ఒక కాల్ ట్యాక్సీ బైక్ను ఢీకొనే విధంగా వచ్చి ఆగింది. దీంతో ఇమ్రాన్, ఖుదా వారిని నిలదీశారు. వెంటనే ట్యాక్సీలో నుంచి దిగిన నలుగురు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. వెంటనే అస్లం బాషా కారు దిగి వచ్చి వారిని ప్రశ్నించడంతో వారి మధ్య ఘర్షణకు దారితీసింది. ఆగ్రహించిన వారు కత్తులతో అస్లంబాషాపై దాడికి ప్రయత్నించారు. ఈ విషయం ఎంఎంకే కార్యకర్తలకు తెలియడంతో వారు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను రక్షించి కారులో పంపివేశారు. తర్వాత దాడికి పాల్పడ్డ నలుగురిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించగా వారు ఆయుధాలను క్రింద పడేసి పరారయ్యారు. ఈ సంఘ టనతో ఆగ్రహించిన మనదనేయ మక్కల్ కట్చి కార్యకర్తలు కాల్ట్యాక్సీని ధ్వంసం చేశారు. కాల్టాక్సీ డ్రైవర్ను ముడిచ్చూరు సమీపంలోగల వరదరాజపురానికి చెందిన మహేష్ (30), సౌందరరాజ్ను పట్టుకున్నారు. సమాచారం అందుకున్న తాంబరం పోలీసులు అక్కడకు చేరుకుని స్థలం చేరుకున్నారు. వారి వద్ద ఇరువురిని అప్పగించారు. వారి వద్ద నుంచి కాల్ ట్యాక్సీని, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న డీఎంకే, ఎంఎంకే, వీసీకే పార్టీలకు చెందిన కార్యకర్తలు పోలీసుస్టేషన్ చేరుకున్నారు. డెప్యూటీ కమిషనర్ తిరుజ్ఞానం అక్కడికి చేరుకుని చర్చలు జరిపారు. పోలీసులు పెట్రోలు బంక్లో నమోదైన సీసీ కెమెరాల ద్వారా విచారణ జరుపుతున్నారు.