manal kayiru -2
-
త్వరలో మణల్కయిరు-2
మణల్కయిరు 1982 మే నెల ఏడో తేదీన విడుదలై శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇది. ఆ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన దర్శకుడు విసు, నటుడు ఎస్వీ.శేఖర్, కురియఘోస్ రంగాముగ్గురు అదే పాత్రల్లో నటిస్తున్న చిత్రం మణల్కయిరు-2. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అశ్విన్ శేఖర్, పూర్ణ నాయికీనాయకులుగా నటిస్తున్నారు. కథ, కథనం సంభాషణల పర్యవేక్షణ బాధ్యతలను నటుడు ఎస్వీ.శేఖర్ నిర్వహించిన ఈ చిత్రానికి ఇంతకు ముందు మారడా మహేశ్ చిత్రాన్ని తెరకెక్కించిన మదన్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ తరం అమ్మాయిలు పెళ్లి విషయంలో చాలా కలలు కంటున్నారన్నారు.పలు ప్రణాళికలను సిద్ధం చేసుకుని వాటిని నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.అదే విధంగా స్త్రీలకు సమాజంలో పలు హక్కులు కల్పిస్తున్నారని వాటిని సాధించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయితే అలాంటివి స్థాయికి మించితే జరిగే పరిణామాలేమిటన్నది ఈ చిత్రంలో కథానాయకి పాత్ర ద్వారా తెలుపుతున్నట్లు చెప్పారు. ఇటీవల మరణించిన గీతరచయిత నా.ముత్తుకుమార్ చిత్రంలోని పాటలన్నీ రాశారని తెలిపారు. ధరణ్ సంగీతాన్ని అందించారని చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు మదన్కుమార్ వెల్లడించారు. -
34 ఏళ్ల తరువాత మణల్ కయిరు రీమేక్
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అలా గత చిత్రాలెప్పుడు ఆపాత మధురాలే. ఇకపోతే 34 ఏళ్ల ముందు తెరపైకొచ్చిన మణల్ కయిరు చిత్రం చక్కని కుటుంబ కథా చిత్రంగా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు తెలుగు తదితర భాషల్లోనూ పునర్నిర్మాణమైంది.ఆ చిత్రానికి దర్శకుడు విసు సృష్టికర్త. ఆయన పెళ్లిళ్ల పేరయ్యగా నటించారు కూడా. ఇక అష్ట షరతులతో పెళ్లి చేసుకున్న యువకుడిగా ఎస్వీ.శేఖర్, కురియగోస్ రంగా ముఖ్యపాత్రలు పోషించారు. ఆ చిత్రాన్ని ఇప్పుడు మణల్ కయిరు-2 పేరుతో శ్రీతేనాండాళ్ ఫిలింస్ పతాకంపై నిర్మాత రామస్వామి రీమేక్ చేస్తున్నారు. 34 ఏళ్ల తరువాత అదే పేరుతో పునర్నిర్మాణం కావడం విశేషం అయితే ఆ చిత్రంలో నటించిన నటులు అదే పాత్రల్లో మళ్లీ నటించడం మరో విశేషం. విసు, ఎస్వీ.శేఖర్, కురియగోస్ రంగా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఎస్వీ.శేఖర్ కొడుకు అశ్విన్ శేఖర్ ఆయన కొడుకుగానే నటిస్తున్నారు. కురియగోస్ రంగా కూతురిగా నటి పూర్ణ నటిస్తుండగా ఇతర పాత్రల్లో లొల్లుసభ స్వామిరాథన్, శావ్యమ్, జగన్, జార్జ్ నటిస్తున్నారు. విసు కథకు ఎస్వీ.శేఖర్ కథనం,సంభాషణలు అందించగా మరుడామహేశ్ చిత్రం ఫేమ్ మదన్కుమార్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. దర్శకుడు విసు క్లాప్ కొట్టగా, ఎస్వీ.శేఖర్ స్విచ్ ఆన్ చేశారు. దీనికి తరుణ్ సంగీతాన్ని, గోపీనాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.