breaking news
malaysian woman
-
ఒక ఫేక్ వీడియో.. ఇద్దరి ఆత్మగౌరవ పోరాటం!
ఒక నల్లటి పొట్టి డ్రెస్.. ఒక 15 సెకన్ల వీడియో.. ఇద్దరు మహిళల జీవితాలను సవాలు చేసింది. వారిలో ఒకరు తమిళనాడు ఎంగెస్ట్ ఉమన్ మినిస్టర్. మరొకరు మలేషియా సాధారణ యువతి. ఆ సాధారణ యువతిని ‘పొట్టి డ్రస్సు వేసుకున్న మంత్రి’గా చూపి ట్రోల్ చేసిన ప్రత్యర్థులకు వారిద్దరూ కలిసి ఇచ్చిన సమాధానం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం.సమాజంలో మహిళ ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా, లేదా తన ప్రపంచంలో తను ప్రశాంతంగా బతుకుతున్నా ఆమెను తక్కువ చేసి చూపించడానికి కొందరు వాడే పాత ఆయుధం... ఆమె వేసుకునే బట్టలు. తాజాగా తమిళనాడుకు చెందిన యువ మహిళా మంత్రి ఎస్.కీర్తన, మలేషియాకు చెందిన వినోషా రవి విషయంలో ఇదే జరిగింది. ఒక చిన్న తప్పుడు వీడియో ఇద్దరు మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? వారు దాన్ని భయంతో కాకుండా ధైర్యంతో ఎలా ఎదుర్కొన్నారు? అసలేం జరిగింది? గత 48 గంటలుగా సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఒక నల్లటి పొట్టి దుస్తులు వేసుకున్న మహిళ కారు దిగుతున్న దృశ్యం అది. ఆ వీడియోలో ఉన్నది తమిళనాడు పారిశ్రామిక శాఖ మంత్రి ఎస్. కీర్తన అంటూ కొందరు రాజకీయ ప్రత్యర్థులు ట్రోలింగ్ ప్రారంభించారు. ‘ఇలాంటి బట్టలతో పెట్టుబడులు తెస్తారా?’ అంటూ వెటకారం చేశారు. కానీ అసలు నిజం ఏమిటంటే... ఆ వీడియోలో ఉన్నది మంత్రి కీర్తన కాదు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మలేషియాకు చెందిన వినోషా రవి అనే సాధారణ మహిళ. వినోషా చెప్పిన దాని ప్రకారం, ఆ వీడియోను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆమెకు తెలియకుండా తీసి ఇంటర్నెట్లో పెట్టి, దానికి తమిళనాడు మంత్రి పేరును తగిలించి తప్పుడు ప్రచారం చేశారు. ఒక అమాయకురాలి ప్రైవసీని దొంగిలించి, దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చారు.‘నేనే అయితే తప్పేంటి?’...అయితే ఈ వివాదాన్ని ఆ ఇద్దరు మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముందుగా మలేషియా నుంచి వినోషా రవి జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘మా కొలీగ్ ఆ వీడియో పంపితే జోక్ అనుకున్నా. కానీ ఆ తర్వాత అది సీరియస్ అయ్యింది. నా ఇన్బాక్స్ నిండా బూతులు, వల్గర్ కామెంట్స్, బెదిరింపులు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి నేను బయటకు వెళ్లాలన్నా, ఆఫీస్కి వెళ్లాలన్నా భయపడుతున్నాను. అయినా నేను నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోను’ అని తేల్చి చెప్పారు. ఈ పై ఆమె మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమిళనాడు మంత్రి కీర్తన చాలా దీటుగా స్పందించారు.ఆగాలంటే ఏం చేయాలి? ఇలా బట్టల ఆధారంగా జరిగే మానసిక దాడులు ఆగాలంటే ముందుగా సమాజంలో మార్పు రావాలి. ఒక మహిళ క్యారెక్టర్ను ఆమె వేసుకునే దుస్తులను బట్టి జడ్జ్ చేసే వికృతమైన ఆలోచనా విధానాన్ని వీడాలి. ఇక ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు అస్సలు భయపడకూడదు. కీర్తన, వినోషాలాగే గొంతు విప్పి ధైర్యంగా ప్రశ్నించాలి. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (1930) ద్వారా ఫిర్యాదు చేయాలి. మౌనంగా ఉంటే ట్రోలర్లు మరింత రెచ్చిపోతారు.ఈ సంఘటన ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి మహిళా సైబర్ భద్రత ముప్పుకు ఒక ఉదాహరణ. అయినా సరే ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకుండా, కేవలం కొన్ని వ్యూస్ కోసం ఒకరి జీవితాన్ని రోడ్డున పడేసే సైబర్ బూచీలకు చెంపదెబ్బ లాంటి సమాధానం ఇచ్చారు ఈ ఇద్దరు మహిళలు. మహిళల ప్రతిభను చూడాలే తప్ప, వారు వేసుకునే బట్టలను కాదు అనే సత్యాన్ని సమాజం ఎప్పుడు గ్రహిస్తుందో మరి!‘ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. కానీ ఒకవేళ నేనే అయినా అందులో తప్పేముంది? ఒక మహిళ ఏం వేసుకోవాలో మీరు డిసైడ్ చేస్తారా? ఇది పురుషాధిక్య సమాజపు సంకుచిత, కురచ ఆలోచన’ అంటూ ఎదురుదాడి చేశారు. అంతేకాదు, తన పోలికల వల్ల అనవసరంగా వివాదంలోకి లాగబడిన వినోషా రవికి క్షమాపణలు చెప్పారు. ‘నన్ను క్షమించు సోదరి. నువ్వు ఆ దుస్తుల్లో చాలా అందంగా ఉన్నావు. నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించు’ అంటూ ఆమెకు అండగా నిలిచారు. ఇది రాజకీయాలకు అతీతమైన సిస్టర్ హుడ్.ఈ ఘటనపై డిఎంకె ఎంపీ కనిమొళి కూడా స్పందిస్తూ ‘ఇది దుష్ట రాజకీయం. మహిళలను ఇలా టార్గెట్ చేయడం ఆపండి’ అంటూ కీర్తనకు మద్దతు పలకడం విశేషం. కీర్తన గతంలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం సూట్ వేసుకుని వీడియో చేస్తే కూడా ట్రోల్ చేశారు. అంటే చీర కట్టినా, సూట్ వేసినా, షార్ట్ డ్రెస్ వేసినా.. దాడి మాత్రం ఆడవారిపైనే. -
ప్రియుడి కోసం వేలకోట్ల సంపదను వదిలేసిన బిజినెస్ టైకూన్ కూతురు
నిజమైన ప్రేమ ఎంతటి కష్టాన్నైనా ఎదురిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ప్రేమించిన మనిషికోసం ఎంతటి త్యాగానికైనా సాహసానికైనా పూను కుంటుంది. ఇవి సినిమాడైలాగుల్లా, డ్రమటిగ్గా అనిపిస్తున్నాయా? కానీ ఈ మాటల్ని అక్షరాలా నిజం చేసింది ఓ మహిళ . ఆమె ఎవరో తెలుసుకుందాం రండి..! కుటుంబాన్ని, వేలకోట్ల సంపదను వదులుకుని మరీ తన ప్రియుడు కోసం తృణప్రాయంగా త్యజించింది. మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఏంజెలిన్ ఫ్రాన్సిస్. ఆమె మలేషియా బిజినెస్ టైకూన్ కూ కే పెంగ్ కుమార్తె. ఈయన కోరస్ హోటల్స్ డైరెక్టర్. మలేషియాలో 44వ ధనవంతుడు. అంతేకాదు మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె. ధనిక కుటుంబానికి చెందిన ఏంజిలిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, మిత్రుడు జెడిడియాతో ప్రేమలో పడింది. అతణ్ణే పెళ్లాడనుకుంది. భయపడుతూనే తల్లిదండ్రులను సంప్రదించింది. కానీ ఏంజెలిన్ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించ లేదు. భిన్న ఆర్థిక నేపథ్యాలను ఏంజెలిన్ తండ్రి వీరి పెళ్లికి ససేమిరా అన్నాడు. బాయ్ఫ్రెండ్ కావాలో లేక వేల కోట్ల వారసత్వ ఆస్థి కావాలో తేల్చుకో మన్నాడు. చివరికి ఏంజెలిన్ జెడిడియా ఫ్రాన్సిస్ను వివాహం చేసుకోవడానికే నిర్ణయించుకుంది. ఈ పెళ్లి చేసుకోవడం ద్వారా వారసత్వంగా దాదాపు రూ. 25వేల కోట్లు (300 మిలియన్ల డాలర్లు)ను వదిలేసుకుంది. విలాసవంతమైన జీవితం కన్నా ప్రేమించినవాడితో జీవితం చాలునుకుంది. అలా 2008లో ఏంజెలిన్, జెడిడియా వివాహం చేసుకున్నారు. అయితే సాధారణమైన ప్రియుడి కోసం వేల కోట్ల సంపదను కుటుంబాలను వదులుకున్న ఉదంతం మరొకటి కూడా ఉంది. జపాన్ యువరాణి మాకో ప్రేమకోసం అపారమైన సంపదను, రాయల్ బిరుదును కూడా వదులుకుంది. 2021లో మాకో, కీ కొమురోవాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ ఆన్లైన్లో గేమ్ ఆడుతూ భారత్కు చెందిన వ్యక్తితో ప్రేమలో పడి, ఇండియాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. -
ఫేస్ బుక్లో ప్రేమ.. హత్యకు కుట్ర
అన్నానగర్: వీరపాండి సమీపంలో వివాహానికి అంగీకరించని ఫేస్బుక్ ప్రేమికుడిని హతమార్చడానికి మలేషియా మహిళ పంపిన కూలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తేని జిల్లా వీరపాండి సమీపంలో ఉన్న కాట్టునాయక్కన్ పట్టికి చెందిన అశోక్ కుమార్ (28) బెంగళూర్లో ఉన్న ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఫేస్బుక్ ద్వారా మలేషియాకు చెందిన అముదేశ్వరి పరిచయమైంది. కాలక్రమేణా ప్రేమగా మారింది. తరువాత అభిప్రాయ బేధాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ స్థితిలో మలేషియా నుంచి కవితా అరుణాచలం అనే మహిళ, అశోక్కుమార్ సెల్ఫోన్కి కాల్ చేసి మాట్లాడింది. ఆమె తనను అముదేశ్వరి అక్క అని, వివాహం చేసుకోకపోవడం వల్ల అముదేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది. అశోక్ కుమార్ దిగ్భ్రాంతి చెందాడు. ఇంకా ఆమె పనిచేసిన సంస్థలో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అనంతరం మలేషియా నుంచి తమిళనాడు వచ్చిన కవితా అరుణాచలం... అక్టోబర్ 30న అశోక్ కుమార్ను కలిసింది. అప్పుడు ఆమె తనను వివాహం చేసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అశోక్కుమార్ దీనిపై తేని పోలీసులకి సమాచారం అందించాడు. పోలీసులు ఆ మహిళ వద్ద విచారణ చేశారు. ఇందులో 45 ఏళ్లు గల ఆ మహిళ, అముదేశ్వరి, కవితా అరుణాచలం అనే పేరుతో అశోక్కుమార్ వద్ద మాట్లాడినట్లు తెలిసింది. తరువాత ఆమెని పోలీసులు హెచ్చరించి పంపారు. ఆమె అసలు పేరు విఘ్నేశ్వరి అని తెలిసింది. ఈ స్థితిలో తనను వివాహం చేసుకోకుండా మోసం చేసిన అశోక్కుమార్ని చంపటానికి 9 మంది కూలీ ముఠాను పంపింది. వారు శుక్రవారం బోడి సమీపంలో ఉన్న ప్రైవేట్ లాడ్జీలో ఉండగా వారి ప్రవర్తన మీద అనుమానం చెందిన లాడ్జీ కార్మికులు బోడి టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. ఇందులో అశోక్కుమార్ని హత్య చెయ్యడానికి విఘ్నేశ్వరి పంపించిన కూలీ ముఠ అని తెలిసింది. తరువాత పోలీసులు కేసు నమోదు చేసి అన్బరసన్ (24), మునుస్వామి (21), అయ్యనార్ (39), మురుగన్ (21), జోసఫ్ (20), యోగేష్ (20), కార్తిక్ (21), దినేష్ (22), భాస్కరన్ (47)ని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా వారి నుంచి కారు, కత్తి వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు విఘ్నేశ్వరి కోసం గాలిస్తున్నారు. -
ఎయిర్ బ్యాగ్ పనిచేయక మహిళ మృతి
ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కదా.. ప్రమాదాల్లో రక్షిస్తాయని కాస్తంత ఖరీదు ఎక్కువైనా హోండా సిటీ కారు కొందా మహిళ. కానీ, చిన్నపాటి ప్రమాదంలోనే ఆ కారు ఎయిర్ బ్యాగులు కాస్తా చినిగిపోవడంతో ఆమె మరణించింది. తమ కార్లలో ఎయిర్ బ్యాగులు సరిగా పనిచేయడం లేదంటూ, 1.45 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు హోండా కంపెనీ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం సంభవించడం గమనార్హం. ప్రమాదం జరిగిన విషయం తెలిసి.. తాను అక్కడకు వచ్చేసరికి స్టీరింగ్ వీల్కు ఉన్న ఎయిర్ బ్యాగ్ చినిగిపోయి ఉందని, బాధితురాలు తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నారని సహాయ అధికారి రోస్డి హైనన్ చెప్పారు. కొద్దిసేపటికే ఆమె మరణించారు. తాము ఈ ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నామని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని టోక్యోలోని హోండా మోటార్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు టకాటా కంపెనీ తయారుచేసిన ఎయిర్ బ్యాగులు పనిచేయక 11 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. -
జైపూర్లో మలేసియా మహిళపై అత్యాచారం!!
రాజస్థాన్ అందాలను, జైపూర్ కోట రాజసాన్ని చూడాలని వచ్చిన ఓ మలేసియన్ పర్యాటకురాలిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భిల్వారాకు చెందిన నిందితుడిని తాము అరెస్టు చేసినట్లు డీసీపీ అమన్దీప్ సింగ్ తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం తాను జైపూర్ వచ్చానని, అక్కడ అతడిని కలిసిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేశామని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడి నుంచి అతడు దూరంగా ఉన్న ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి కారులోనే అత్యాచారం చేసినట్లు తెలిపింది. తర్వాత ఆమెను హోటల్ ముందు వదిలేశాడు. ఆమె ఎలాగోలా జవహర్ సర్కిల్ ప్రాంతంలోని ఓ పోలీసు కారు వద్దకు వెళ్లి ఫిర్యాదుచేసింది. మూడు గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.


