breaking news
Malamahanadu leaders
-
కోనసీమ ఘర్షణ కారకులు బాబు, పవన్లే
ప్రొద్దుటూరు: కోనసీమ జిల్లాలో గొడవలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కారకులని జాతీయ మాలమహానాడు అధ్యక్షుడు గోసా మనోహర్ ఆరోపించారు. అమలాపురం ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ఆయన నిరసన తెలిపారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి చేయడం వెనుక బాబు, పవన్ల హస్తం ఉందన్నారు. ఇదిలా ఉండగా, దళిత మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి సిగ్గుచేటని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. దాడికి నిరసనగా స్థానిక పాత బస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సుధాకర్ మాదిగ, మాలమహానాడు నాయకుడు ఇమ్మానుయేల్, జమ్మలమడుగు డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గాలిపోతుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
'ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తాం'
మహబూబ్నగర్: రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మాల సామాజిక వర్గానికి గుర్తింపు లేకుండా పోయిందని, ఎన్నికల సమయంలో మాలలకు కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు నర్సింహయ్య అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాలలకు రుణాలు రాకుండా పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారన్నారు. రెండేళ్ల పాలనలో కేసీఆర్ దళితులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు శివకేశవులు, వెంకటస్వామి, శ్రీనివాస్, చెన్నకేశవులు, మాధవ్, శ్యాంసుందర్, మన్యం, అజిత్కుమార్, రామకృష్ణ, బ్యాగరి శ్రీనివాస్, వెంకట్రాములు, భీమయ్య, శ్రీనివాసులు, సుదర్శన్, మహేష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.