-
రోగులను నిర్లక్ష్యం చేస్తే డిస్మిస్.. మంత్రి హరీశ్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రోగులపట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డిస్మిస్ చేయడానికి కూడా వెనుకాడబోమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి ఘటనను తీవ్రంగా పరిగణించామని.. అటువంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో ఉన్నతాధికారులతో కలసి ఆయన వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒకట్రెండు ఘటనలు మినహా గతేడాది వైద్య, ఆరోగ్యశాఖ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ‘హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్.. హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్.. టువార్డ్స్ ఆరోగ్య తెలంగాణ’ అనే నినాదాన్ని తాము ఎంచుకున్నామని వివరించారు. అన్ని వయసుల వారికీ వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వైద్య, ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల బడ్జెట్ కేటాయించిందని... ఈ కేటాయింపులతో తలసరి హెల్త్ బడ్జెట్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ పేర్కొనే డబుల్ ఇంజన్ సర్కారున్న ఉత్తరప్రదేశ్ ఈ ర్యాంకుల్లో చివరి స్థానంలో నిలిచిందని హరీశ్రావు ఎద్దేవా చేశారు. అలాగే వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ చార్జిïÙట్ విడుదల చేయడాన్ని ఆయన హాస్యాస్పదంగా అభివరి్ణంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు చార్జిషీట్ పేరుతో హడావిడి చేశారని మండిపడ్డారు. వైద్య రంగంపై నీతి ఆయోగ్ విడుదల చేసిన సూచీలో కాంగ్రెస్పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్ 16వ స్థానంలో, ఛత్తీస్గఢ్ 10వ స్థానంలో, హిమాచల్ప్రదేశ్ 7వ స్థానంలో నిలిచాయనే విషయాన్ని ఆ పార్టీ నేతలు మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని... దీనివల్ల అక్కడక్కడా వారు అనారోగ్యం బారినపడుతున్నారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రానికి ఎన్నో అవార్డులు... దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు లభించిందని.. యునిసెఫ్ కూడా ఈ సేవలను ప్రశింసించిందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి సంరక్షించడంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆయన వివరించారు. అలాగే తెలంగాణ డయాగ్నోస్టిక్ హైదరాబాద్ సెంట్రల్ హబ్కు ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 31 లక్షల మందికి టెలి కన్సల్టెన్సీ ద్వారా వైద్య సేవలు అందించినందుకు కేంద్రం రాష్ట్రానికి అవార్డు ఇచ్చిందని హరీశ్రావు చెప్పారు. పీహెచ్సీ, జిల్లా ఆసుపత్రి, యూపీహెచ్సీలకు నేషనల్ క్వాలిటీ ఆష్యురెన్స్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి మూడు కేంద్ర అవార్డులు లభించాయన్నారు. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం జిల్లాలకు వరల్డ్ టీబీ డే సందర్భంగా కేంద్రం అవార్డులు ప్రకటించిందని గుర్తుచేశారు. గతేడాది 2.59 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు.. ఈ ఏడాది మరిన్ని పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నామని మంత్రి హరీశ్రావు వివరించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామన్నారు. ఈఎన్టీ, సరోజినీదేవి ఆసుపత్రులను మరింత పట్టిష్టం చేస్తామని, ఆహార కల్తీ నియంత్రణపై మరింతగా దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద గతేడాది 2.59 లక్షల మంది రోగులు లబ్ధి పొందారని, ఉద్యోగులు, జర్నలిస్టుల పథకంలో 43,702 మంది లబ్ధి పొందారని మంత్రి వివరించారు. గతంలో పరిమితి రూ. 2 లక్షలు ఉంటే దాన్ని రూ. 5 లక్షలకు పెంచామన్నారు. అలాగే అవయవ మారి్పడి వంటి శస్త్రచికిత్సల కోసం రూ. 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీలో కవరేజీ కలి్పస్తున్నామన్నారు. -
పాపం అని ఉద్యోగం ఇస్తే.. అదును చూసి..
మలక్పేట(హైదరాబాద్): పని కల్పించిన ఓ యజమాని ఇంటికే కన్నం వేసిన సంఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. డీఐ నానునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్కుమార్ అనే వ్యాపారవేత్త మూసారంబాగ్ ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నేపాల్కు చెందిన అశోక్, రేఖ అనే ఇద్దరు వ్యక్తులను కొంత కాలంగా తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. ఎంతో నమ్మకంగా ఉంటూ గురువారం కుటుంబ సభ్యులు పని మీద బయటకి వెళ్లారు. ఇంట్లోని ఓ గదిలో వృద్ధురాలు మాత్రమే ఉంది. ఇదే అదనుగా భావించిన వారు మరో గదిలో ఉన్న బీరువా తాళాలు తెరచి అందులో ఉన్న రూ.10లక్షల నగదు దొంగలించి పరారయ్యారు. ఇంటికి వచ్చిన యజమాని కుటుంబ సభ్యులు తెరిచి ఉన్న బీరువా చూసి కంగుతున్నారు. అందులో ఉన్న రూ.10లక్షలు కన్పించలేదు. విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. మలక్పేట ఏసీపీ వెంకటరమణ ఘటన స్ధలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని పలు యశోదా ఆసుపత్రులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్పేటలోని యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు చేపట్టారు. 20కి పైగా ఐటీ శాఖ బృందాలు.. మూడు బ్రాంచ్లకు చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఇళ్లల్లోపాటు(సురేందర్ రావు-సోమాజిగూడ, రవీందర్ రావు-సికింద్రాబాద్, దేవేందర్ రావు-మలక్పేట), నాగార్జున హిల్స్లోని కార్పొరేట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగినట్లు సమాచారం. వీరి నుంచి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నట్లు ఆదాయపు పన్నుశాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: యశోద ఆసుపత్రిపై ఎందుకంత ప్రేమ? -
ఊరపందుల దాడిలో బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్(మలక్పేట) : ఇంటి ముందు ఆడుకుంటున్న హర్షవర్ధన్(3) అనే బాలుడిపై ఊరపందులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం హైదరాబాద్లోని సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనిచేసుకునే కేశ్యానాయక్కు కుమార్తె, కుమారుడు. కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలోని గుడిసెలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం కేశ్యానాయక్ మూడేళ్ల కుమారుడు హర్షవర్ధన్ గుడిసె ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ఊరపందులు బాలుడిపై దాడి చేశాయి. గుడిసెలో ఉన్న తల్లిదండ్రులు బయటికి వచ్చేసరికి పందులు బాలుని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా స్థానికులు వాటి వెంటపడటంతో విడిచి పెట్టి పారిపోయాయి. పందుల దాడిలో బాలుడికి తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
మలక్పేట్ మార్కెట్లో నిలిచిన ఉల్లి విక్రయాలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement