breaking news
mahesh shah missing
-
ఆ 13,860 కోట్లు నావి కావు
నేను మధ్యవర్తినే.. ఐటీ అధికారులతో గుజరాత్ వ్యాపారి మహేశ్ అహ్మదాబాద్: నల్లధనం మార్చుకునేందుకు కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తనను పావుగా వాడుకున్నారంటూ గుజరాత్ వ్యాపారవేత్త మహేష్ షా శనివారం వెల్లడించాడు. ఆదాయం వెల్లడి పథకంలో భాగంగా రూ. 13,860 కోట్లు ప్రకటించిన మహేష్ షా... చివరికి మొదటి వారుుదా కట్టకుండా చేతులెత్తేసి ఐటీ అధికారులకు షాక్ నిచ్చాడు. నవంబర్ 29 నుంచి పరారీలో ఉన్న షా ... చివరికి తనంతట తానే అహ్మదాబాద్లో ప్రత్యక్షమయ్యాడు. శనివారం అతనిని ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అంతకముందుకు ఒక టీవీ చానల్లో మాట్లాడుతూ కొందరి ఒత్తిడి మేరకే ఈ పని చేశానని, సొమ్ము తనదిగా ప్రకటిస్తే కమిషన్ ఇస్తానంటూ వారు వాగ్దానం చేశారని షా పేర్కొన్నాడు. ఐడీఎస్ పథకం కింద ఎవరి డబ్బైతే వెల్లడించానో... వారు చివరి నిమిషంలో వెనక్కి తగ్గారని, అందుకే మొదటి వారుుదా కట్టలేకపోరుునట్లు చెప్పాడు. చేసిన తప్పును తెలుసుకున్నానని, ఐటీ విభాగం విచారణ అనంతరం అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తానన్నాడు. పాలు, కేబుల్ బిల్లుకు డబ్బుల్లేవు కానీ... స్వచ్ఛంద నల్లధనం వెల్లడి పథకం సమయంలో రూ.13,860 కోట్ల నల్లధనాన్ని వెల్లడించిన షా అతి సాధారణ జీవితం గడిపేవాడనీ, పాలు, కూరగాయలకు కూడా అప్పు ఉన్నాడని తెలిసి ఐటీ శాఖ అధికారులు నివ్వెరపోయారు. షా అహ్మదాబాద్లో స్థిరాస్థి వ్యాపారం చేసేవాడు. అతి సాధారణ జీవితం గడిపే షా ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోవాలలతో బేరమాడేవాడు. పాలుకు రూ.8,000, కూరగాయలకు రూ.5,800 అప్పు ఉన్నాడు. బిల్లు కట్టకపోవడంతో కేబుల్ టీవీ కనెక్షన్ కూడా తొలగించారు. అలాంటి వ్యక్తి ఐడీఎస్లో తన వద్ద రూ.13,860 కోట్ల లెక్క చూపని డబ్బు ఉందంటూ ఆదాయపు పన్ను శాఖకు సమాచారమిచ్చాడు. ఆ డబ్బుకు సంబంధించి నవంబర్ 30 లోపు రూ.1,560 కోట్లు తొలి వారుుదాగా పన్ను రూపంలో చెల్లించాలి. ఆ డబ్బు కట్టలేకపోవచ్చని ఐటీ శాఖకు సమాచారం రావడంతో మహేష్, ఆయన స్నేహితుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు దాడులు చేశారు. దాడుల్లో మహేష్ ఇంట్లో రూ.29,000 మాత్రమే దొరికింది. మహేష్ ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు సరిగా తెలీదని ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ తెహ్ముల్ సేత్నా చెప్పడం గమనార్హం. మహేష్ ఐదు సెల్ఫోన్లను వాడేవాడని, తరచూ నంబర్లు మార్చేవాడని సమాచారం. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీలకు తరచూ వెళ్తూ ఉండేవాడనీ, విమానాశ్రయానికి మాత్రం రిక్షాలో వెళ్లేవాడని తెలిసింది. -
13వేల కోట్ల వెల్లడి కేసులో సంచలనం..!
-
13వేల కోట్ల వెల్లడి కేసులో సంచలనం!
-
13వేల కోట్ల ఆస్తిపరుడు మహేష్ షా.. మిస్సింగ్!
-
13వేల కోట్ల ఆస్తిపరుడు.. మిస్సింగ్!
స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడువు మరికొద్ది నిమిషాల్లో ముగిసిపోతుందనగా.. తన వద్ద రూ. 13,680 కోట్ల ఆస్తి ఉందని గుజరాత్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెల్లడించారు. అయితే.. ఇప్పుడు ఆయన అదృశ్యం అయ్యారు! మహేష్ షా (67) అదృశ్యం అయిన విషయాన్ని ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన షా ముంబై, ఇతర నగరాల్లో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తుంటారు. ఆయన కోసం పోలీసులు ఎన్నిచోట్ల గాలించినా ఇంతవరకు ఫలితం మాత్రం లేదు. అపాజీ అమీన్ అనే సీఏ సంస్థ భాగస్వామి తెహముల్ షెత్నా వద్దకు ఆదాయ వెల్లడి పథకం సమయంలో వెళ్లిన మహేష్.. ఆ పథకం గురించి అడిగారు. సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిపోతుందనగా.. అదేరోజు రాత్రి 11.55 గంటలకు ఆయన అహ్మదాబాద్లోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లి, తన వద్ద రూ. 13,680 కోట్ల ఆస్తి ఉందని చెప్పారు. మరో ఐదు నిమిషాల్లో పథకం గడువు ముగిసిపోయింది. తనకు మనశ్శాంతి కావాలని, అందుకే తాను మొత్తం ఆస్తి వివరాలు చెప్పేస్తానని ఆయన అన్నట్లు సీఏ షెత్నా చెప్పారు. వెల్లడించినదంతా నగదు రూపంలోనే ఉండటం, అది చాలా పెద్దమొత్తం కావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ మొత్తాన్ని ఆయన ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లేందుకు కూడా అంగీకరించారు. దానికి సంబంధించిన రహస్యాలు, ఇతర వివరాలన్నింటినీ అధికారులు ఆయనకు వివరించారు. పథకం నిబంధనల ప్రకారం నవంబర్ 30 నాటికి తొలి వాయిదాలో రూ. 1560 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ఆయన ఆ మొత్తం కట్టలేకపోయారు. నవంబర్ 29 నుంచే షా కనిపించడం లేదని సీఏ షెత్నా ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు, ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలన్నింటిలో సోదాలు చేశారు. ఆరోజు రాత్రి 7 గంటల వరకు తనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారని, తర్వాత మాత్రం ఆయన ఫోన్ స్విచాఫ్ అయిపోయిందని షెత్నా చెప్పారు. -
13వేల కోట్ల ఆస్తిపరుడు.. మిస్సింగ్!