breaking news
Mahesh Chandra
-
ఇది పక్కా ప్లాన్.. త్వరలో మరో ఎన్ కౌంటర్..
-
తెలంగాణలో సరెండర్.. ఏపీలో మావోయిస్టుల షెల్టర్ : ఏడీజీ లడ్డా
సాక్షి, విజయవాడ: ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎన్కౌంటర్ సమయంలో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు.ఏపీలో పట్టుబడిన మావోయిస్టులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ.. భద్రతా బలగాలు చారిత్రక విజయం సాధించాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం. ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలకు అభినందనలు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఎన్కౌంటర్ సమయంలో కొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్చేశాం. కాకినాడలో మరో ఇద్దరిని, కోనసీమలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారు.ప్లాన్ ప్రకారమే ఆపరేషన్.. ఛత్తీస్ఘడ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టాం. నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్లో చనిపోయారు. వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టాం. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నాం. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమం. కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీంలను పట్టుకున్నాం. వెపన్స్ 45, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రిని పట్టుకున్నాం. మా ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారు. మా ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసింది. మాకు ముందే సమాచారం వచ్చినా.. వారి పై నిఘా పెట్టాం. వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించాం. అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నాం.వచ్చే ఏడాది మార్చి నాటికి ఆపరేషన్ కగార్ పూర్తి.. తెలంగాణలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారు. వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి మూవ్మెంట్, ప్లాన్లపై ఇతర సమాచారం లేదు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదు. వచ్చ ఏడాది మార్చినాటికి ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తాం. మావోయిస్టుల కదలికలపై అనేక మార్గాల ద్వారా సమాచారం వస్తోంది. అనుమానితులపై నిఘా ఉంచాం. ఈరోజు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఆరు, ఏడుగురు చనిపోయారని సమాచారం ఉంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లొంగిపోతే ప్రభుత్వం నుంచి రివార్డు ఇస్తాం’ అని చెప్పారు. -
‘పిఠాపురంలో’ మూడు ప్రేమకథలు
‘అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా..’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్చంద్ర తెరకెక్కించిన కొత్త చిత్రానికి ‘పిఠాపురంలో..’ అనే టైటిల్ ఖరారైంది. ‘అలా మొదలైంది’ అన్నది ఉపశీర్షిక. సన్నీ అఖిల్, రెహానా, డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ ప్రధానపాత్రల్లో నటించారు. దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మహేశ్ చంద్ర మాట్లాడుతూ– ‘‘కుటుంబ భావోద్వేగాలు కలగలిసిన ప్రేమకథా చిత్రమిది. ఈ చిత్రంలో మూడు జంటల ప్రేమకథలను, ముగ్గురు తండ్రుల పెంపకాల్లోని లోటు΄ాట్లని చూడొచ్చు. కథను నమ్మి, ఈ సినిమా తీశాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. -
10న నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక
సాక్షి, హైదరాబాద్: నాయి బ్రాహ్మణ యువతీ యువకుల వివాహ సంబంధాల కోసం పరిచయ కార్యాక్రమం ఈనెల 10న జరగనుంది. ఆదివారం దిల్షుక్నగర్ కొత్తపేటలోని బాబు జగ్జీవన్రామ్ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మహేష్ చంద్ర నాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిచయ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న నాయి బ్రాహ్మణలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పునర్వివివాహ సంబంధాల కోసం చూస్తున్న వితంతువులు, డైవోర్సిలు కూడా తమకు నచ్చిన భాగస్వామిని ఈ వివాహ పరిచయ కార్యక్రమం ద్వారా వెతుక్కునే అవకాశముందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 9849566988, 9391357109 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
నాలుగు భాషల్లో రెడ్ అలర్ట్
‘‘తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలక్షణమైన ఇతివృత్తంతో ఈ సినిమా చేస్తున్నాం. సినీ నిలయ క్రియేషన్స్ సంస్థ ద్వారా ప్రతిభావంతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని నిర్మాత పీవీ శ్రీరాంరెడ్డి చెప్పారు. చంద్రమహేశ్ దర్శకత్వంలో హెచ్.హెచ్. మహాదేవ్, అంజనామీనన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘రెడ్ అలర్ట్’. ఇప్పటికి 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చంద్రమహేశ్ మాట్లాడుతూ -‘‘హీరో, హీరోయిన్, కాశీ విశ్వనాథ్ మినహా ఏ భాషకు చెందిన నటీనటులతో ఆ భాషలో చిత్రీకరణ జరిపాం. యాక్షన్ థ్రిల్లర్ విత్ కామెడీ ఇది. నిర్మాత సహకారంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం’’ అని తెలిపారు. మహాదేవ్ మాట్లాడుతూ -‘‘కథ విని ఉద్వేగానికి గురయ్యాను. నవంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటులు కాశీ విశ్వనాథ్, కాదంబరి కిరణ్, శుభోదయం వరప్రసాద్, సాయినరేశ్, తేజ, అమర్, రచయిత శ్రీరామ్ చౌదరి, సంగీత దర్శకుడు రవివర్మ, ఛాయాగ్రాహకుడు కల్యాణ్ సమి, సమర్పకుడు త్రిలోక్ రెడ్డి తదితరులు మాట్లాడారు.


