-
మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డు
-
అది వారి అభిప్రాయం!
దుబాయ్: టి20 ఫార్మాట్ నుంచి తాను తప్పుకోవాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చేస్తున్న విమర్శలపై మహేంద్ర సింగ్ ధోని తొలిసారి స్వయంగా స్పందించాడు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా స్పష్టతనిచ్చాడు. ‘ప్రతీ ఒక్కరికీ జీవితంలో తమదైన సొంత అభిప్రాయాలు ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. భారత జట్టులో భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువగా స్ఫూర్తినిచ్చే అంశం. సహజ ప్రతిభ లేని చాలా మంది క్రికెటర్లు ఎంతో సాధించడం కూడా మనం చూశాం. కేవలం ఆటపై ఉన్న పిచ్చి ప్రేమే దానికి కారణం. ప్రతీ ఒక్కరికి దేశం తరఫున ఆడే అవకాశం రాదు’ అని ధోని వ్యాఖ్యానించాడు. శనివారం ఇక్కడ ధోని తన సొంత అకాడమీ ప్రారంభించిన అనంతరం పలు అంశాలపై మాట్లాడాడు. ఫలితాలకంటే ప్రక్రియపైనే ఎక్కువగా నమ్మకం ఉంచే తాను... ఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తే ఏం జరుగుతుందని తానెప్పుడూ భయపడలేదని చెప్పాడు. తన ట్రేడ్మార్క్ ‘హెలికాప్టర్’ షాట్ను నేర్చుకోమని ఈతరం కుర్రాళ్లకు ఎప్పుడూ చెప్పనని ధోని అన్నాడు. ‘రోడ్లపై టెన్నిస్బాల్ క్రికెట్ ఆడేటప్పుడు నేను ఆ షాట్ను నేర్చుకున్నాను. అది చాలా కష్టమైన షాట్. టెన్నిస్ బంతితో అయితే బ్యాట్పై ఎక్కడా తగిలినా అది దూరం వెళుతుంది కానీ సాధారణ క్రికెట్లో మాత్రం బ్యాట్ మధ్యలోనే బంతి తగలాలి. ఈ షాట్ ఆడే సమయంలో గాయాలపాలు అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది కాబట్టి నేనెప్పుడూ అది నేర్పించను’ అని ధోని స్పష్టం చేశాడు. పాండ్యాకు అప్పుడే విశ్రాంతా: గంగూలీ కోల్కతా: శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందుగా ఎంపిక చేసి ఆ తర్వాత ‘విశ్రాంతి’ పేరుతో హార్దిక్ పాండ్యాను తప్పించడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించారు. ‘నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. అతను గాయంతో ఉన్నాడా అనే విషయం నాకైతే తెలీదు. పాండ్యా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఇది విరామం లేకుండా ఆడాల్సిన వయసు. కాబట్టి సరైన కారణం కూడా తెలీదు’ అని గంగూలీ అభిప్రాయపడ్డారు. మరోవైపు వన్డేలతో పోలిస్తే టి20ల్లో ధోని తడబడుతున్నాడనే విషయం అర్థమవుతోందని గంగూలీ అన్నారు. ఈ విషయంపై కోహ్లి, టీమ్ మేనేజ్మెంట్ ధోనితో విడిగా మాట్లాడాలి అని సౌరవ్ సూచించారు. -
శాశ్వత పరిష్కారం కావాలి:ధోని
ముంబై: మహారాష్ట్రలో నీటి కరువు కారణంగా ఐపీఎల్ మ్యాచ్లను వేరే చోటకి తరలించాలనడం సరికాదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అభిప్రాయపడ్డాడు. రాష్ట్రంలో చోటు చేసుకున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమని ధోని స్పష్టం చేశాడు. 'ఐపీఎల్ మ్యాచ్లకు కొద్ది శాతం నీరు మాత్రమే అవసరమవుతుంది. ఐపీఎల్ మ్యాచ్ ల తరలింపుతో రాష్ట్రంలో చోటు చేసుకున్న పూర్తిస్థాయి సమస్యకు పరిష్కారం లభించదు. దానికి శాశ్వత పరిష్కారం వెతకాలి. రాష్ట్రంలో కరువు ఉన్న ప్రాంతాలకు నీటిని ఎలా అందించాలి దానిపై అంతా దృష్టి సారించాలి. ఇప్పటికే నీటి సమస్యపై చర్చ తారాస్థాయికి చేరింది. మరోవైపు రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయా?లేదా?అనే సందేహం కూడా ప్రజల్లో ఉంది' అని ధోని పేర్కొన్నాడు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఇసుక అక్రమ తరలింపు కేసులో ఇద్దరికి జైలు శిక్ష
రైల్వే గేట్ తగిలి ఒకరికి తీవ్ర గాయాలు
కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: మండవ
చోరీ కే సులో ఇద్దరి అరెస్టు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
వీడిన మిస్సింగ్ మిస్టరీ
వరుస నష్టాలకు బ్రేక్
నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
వీక్షకులను ఇలా పెంచుకోవాలనుకోవడం కరెక్ట్ కాదేమో సార్!
తప్పక చదవండి
Advertisement