breaking news
Maha veera
-
కల్నల్ సంతోష్బాబుకు మహావీరచక్ర
సాక్షి, సూర్యాపేట: భారత్–చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబుకు మహావీరచక్ర పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో గతేడాది జూన్ 15న సంతోష్ వీరమణం పొందిన విషయం తెలిసిందే. చదవండి: (మన కనక రాజుకు పద్మశ్రీ) తండ్రి కల నెరవేర్చిన కుమారుడు.. దేశ సేవ చేయాలన్న తన తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ ఆశయాన్ని నెరవేర్చాడు సంతోష్బాబు. సూర్యాపేటకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు సంతోష్ 1983లో జన్మించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సూర్యాపేటలోని సంధ్య హై స్కూల్లో, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యనభ్యసించారు. పాఠశాలలో మౌర్య, గుప్తా హౌస్కు కెప్టెన్గా వ్యవహరించారు. నేషనల్ ఢిపెన్స్ అకాడమీ పుణేలో డిగ్రీ పూర్తి చేశారు. 2004 డిసెంబర్లో జమ్మూలో తొలిసారి మిలటరీ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్లో కల్నల్గా పదోన్నతి వచ్చింది. బిహార్ 16వ బెటాలియన్ కామాండింగ్ అధికారిగా ఉన్న కల్నల్ సంతోష్బాబు.. తాను నేతృత్వం వహిస్తున్న బలగాలతో గాల్వన్ లోయల్లో విధులకు వెళ్లారు. కల్నల్ సంతోష్బాబు తన సర్వీసు ఎక్కువ కాలం సరిహద్దులోనే పని చేశారు. 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా విధులు నిర్వహించాడు. సంతోష్బాబు భార్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 ఉద్యోగ నియామక పత్రంతో పాటు రూ.4 కోట్ల చెక్కును సీఎం కేసీఆర్ అందజేశారు. కల్నల్ తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కు ఇచ్చారు. ఆమె ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్నారు. -
చిరు పుట్టిన రోజున మెగా గిఫ్ట్
ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంపై మాత్రం ఎలాంటి వార్తా లేదు. బాహుబలి 2 రిలీజ్ తరువాత చిరు 151 సినిమాను మరింత భారీగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్న మెగా టీం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. మరోసారి చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ రూపొందించనున్నారు. అందుకే ముందుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ నిర్ణయించినా.. ఇప్పుడు అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలన్న ఉద్దేశంతో మహావీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న ప్రచారం జరుగుతోంది.