breaking news
madi reddy pratap reddy
-
అందుబాటులోకి 21 సంజీవని బస్సులు
సాక్షి, విజయవాడ: ఇంద్ర బస్సులను సంజీవని బస్సులుగా మార్చామని, వీటి ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. వీటిని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 21 సంజీవని వాహనాలు ఏర్పాటు చేశామని, వాటిని అన్ని జిల్లాలకు పంపిస్తామని తెలిపారు. రానున్న 10 రోజుల్లో మరో 30 వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. తమిళనాడులో కేసులు ఎక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రానికి బస్సులు నడపలేకపోతున్నామన్నారు. (ఏపీఎస్ఆర్టీసీ చూపు.. కార్గో వైపు !) "టీఎస్ఆర్టీసీలో ఆపరేషన్స్ విభాగంలో కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు బుధవారం హైదరాబాద్లో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. సంచార రైతు బజారు కోసం ఆర్టీసీ బస్సులను తయారు చేశాం. కరోనా సమయంలోనూ ఆర్టీసీ సిబ్బంది సేవలందిస్తున్నారు. ప్రతి జిల్లా హెడ్క్వార్టర్స్లో సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. లాక్డౌన్ కారణంగా ఆర్టీసీకి రూ.4,200 కోట్ల నష్టం వచ్చింది, అయినా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామ"ని మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. (ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు లేనట్లే!) -
ఎన్నికల యుద్ధం.. పార్టీలు సిద్ధం
కీసర, న్యూస్లైన్: మండల పరిధిలోని నాగారం, దమ్మాయిగూడల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా సాగనుంది. మొన్నటి వరకు ఇక్కడ పంచాయతీ ఎన్నికలుం టాయో లేదోనన్న సందేహానికి హైకోర్టు ఉత్తర్వులతో తెరపడింది. ఏప్రిల్ 13న పంచాయతీ ఎన్నికలు నిర్వహించేం దుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. దీంతో ఆశావహులు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు.నాగారంలో దాదాపు 75 కాలనీ లు, దమ్మాయిగూడాలో 50కిపైగా కాల నీలున్నాయి. నాగారంలో 20,666 మం ది, ద మ్మాయిగూడలో 14,846 మంది ఓటర్లు ఉన్నారు. నాగారం సర్పంచ్ స్థానం జనరల్కు, దమ్మాయిగూడ సర్పంచ్ స్థానాన్ని బీసీ-మహిళకు కేటాయించారు. నగర శివారులో ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్ స్థానం కూడా ఎమ్మెల్యేతో సమానం. దీంతో పార్టీలు ఖర్చుకు వెనకాడకుండా పోటీకి సిద్ధమవుతున్నాయి. నాగారంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ మండల మాజీ కన్వీనర్ మాదిరెడ్డి ప్రతాప్రెడ్డి, టీడీపీ తరఫున కౌకుంట్ల చంద్రారెడ్డి, కాంగ్రెస్ తరఫున ర్యాల అశోక్యాదవ్, బీజేపీ నుంచి కందాడి సత్తిరెడ్డిలు సర్పంచ్ బరిలో నిలవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పంచాయతీ పరిధిలోని 18 వార్డుల్లో తమ అనుచరులను రంగంలోకి దింపడానికి ఆయా నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక దమ్మాయిగూడ సర్పంచ్ విషయానికొస్తే టీడీపీ నుంచి మాజీ సర్పంచ్ రామారం వెంకటేష్గౌడ్ సతీమణి రాజ్యలక్ష్మి, కాంగ్రెస్ తరఫున మాజీ వార్డు సభ్యుడు పడాల యా దగిరి సతీమణి బరిలో ఉన్నారు. వీరు కాక మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూ డా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 16 వార్డులకు కూడా అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది. ఈ రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు తమ ప్రచార పర్వానికి తెరతీశారు. పది రోజులుగా గ్రామంలో సం చరిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే పని లో పడ్డారు. ఈ రెండు గ్రామాలకు ఈనె ల 29న ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 1వరకు నామినేషన్ల గడువు, ఏప్రిల్ 2న నామినేషన్ల పరిశీలన, 3న అప్పీళ్ల స్వీకరణ, 4న పరిశీలన, ఏప్రిల్ 5న నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.