breaking news
Maa Oori Raja Reddy Movie
-
'మా ఊరి రాజారెడ్డి' మూవీ ట్రైలర్ లాంచ్
నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా నటించిన సినిమా 'మా ఊరి రాజారెడ్డి'. రవి బాసర దర్శకత్వం వహించగా.. ఆర్ ఎస్ మూవీ మేకర్స్పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మించారు. తాజాగా హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. మార్చి 1న థియేటర్లలోకి ఈ చిత్రం రాబోతుంది. (ఇదీ చదవండి: లండన్లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?) ఈ సినిమాను ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని హీరో నిహాన్ చెప్పాడు. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని హీరోయిన్ వైష్ణవి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: మలయాళ బ్లాక్బస్టర్ హిట్ సినిమా.. తెలుగు రిలీజ్కి రెడీ) -
‘మా ఊరి రాజారెడ్డి’ రిలీజ్ డేట్ ఫిక్స్
నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఊరి రాజారెడ్డి’. రవి బాసర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 25న ట్రైలర్ ని మార్చ్ 1న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు రజిత మరియు సునీత మాట్లాడుతూ : ఎంతో ఇష్టంతో చాలా కష్టపడి ఈ సినిమా ని నిర్మించాం. మంచి మంచి లొకేషన్స్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసాం. ప్రేక్షకుల ఆశీస్సులు ఆదరణ మాపై ఈ సినిమాపై ఉండాలని ఈ సినిమా మన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామన్నారు. దర్శకుడు రవి బాసర మాట్లాడుతూ : మార్చ్ 1న మా ఊరి రాజారెడ్డి సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి మంచి లొకేషన్స్ లో ఈ సినిమాని చిత్రీకరించాం. బోరిగామా విలేజ్, గోపాల్ పేట్ తండా, గండి రామన్న దేవస్థానం, కడం హరితహారం ప్రాజెక్టు మరియు నిర్మల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. మంచి లొకేషన్స్ లో ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాం. ఈనెల 25న ట్రైలర్ లాంచ్ చేయబోతున్నాం. ఈ సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.