breaking news
m girija shankar
-
సామాజిక చైతన్యం రావాలి
జెడ్పీసెంటర్, న్యూస్లైన్: సామాజిక స్వాతంత్య్రం సాధించాలని, అప్పుడే బడుగులు అభివృద్ధి చెందుతారని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. సాంఘి క సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాజ్యంగ నిర్మాత, దళిత ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్ 124జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక చైతన్యం రావాలని, అప్పుడే హక్కులను సాధించుకోవచ్చన్నారు. ప్ర పంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఒక్క గొప్ప రాజ్యాంగా న్ని దే శానికి అందించిన ఘనత అం బేద్కర్కే దక్కిందన్నారు. అణగారి ని వర్గాల అభ్యున్నతి కోసం రా జ్యాంగంలో అనేక హక్కులను క ల్పించిన మహావ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువు ద్వారానే మనకు గు ర్తింపు వస్తుందన్నారు. సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలు, దురాచారాలను రూపుమాపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చదువు కోసం అనేక పథకాలను అమలు చేస్తుంద ని తెలిపారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. మహనీయుల ఆశయ సాధన కోసం అందరూ ప్రయత్నిం చాలని సూచించారు. కార్యక్రమం లో ఎస్పీ నాగేంద్రకుమార్, జేసీ శర్మణ్, డీఆర్డీఏ పీడీ చంద్ర శేఖర్రెడ్డి, ఆర్డీఓ హనుమంత్రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ జయప్రకాష్, డీఎస్డబ్ల్యూఓ శ్రీనివాస్రావు, ఏ ఎస్డబ్ల్యూఓ రాములు అధికారులు సత్యనారాయణ, సబిల్, జీవన్, చంద్రశేఖర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో ‘పాలమూరు జాతర’
కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లా విశిష్టత, సంస్కృతి ప్రతిబింబించే విధంగా పాలమూరు జాతర ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వెల్లడించారు. సోమవారం రాత్రి తన చాంబర్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..పాలమూరు సంస్కృతి, ప్రాచీనచరిత్రను ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఈ జాతరను ఫిబ్రవరి 7, 8, 9తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహిస్తామన్నారు. జాతరకు సంబంధించి ఆయా శాఖలకు అప్పగించిన బాధ్యతలను విధిగా నెరవేర్చాలని సూచించారు. ఈనెలాఖరులోగా కమిటీలను నియమించి, కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగేలా చూడాల్సిందిగా అధికారులను కోరారు. మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో రోజుకొక కార్యక్రమం ఉండేవిధంగా ప్రణాళికలు సిద్ధంచేయాలని కోరారు. ఇందులో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పూలు, పండ్ల ప్రదర్శనలతోపాటు, మండలాల ఫొటోలు ఉండేవిధంగా చూడాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా బాలల చిత్రాలను ప్రదర్శించడంతోపాటు కార్నివార్, శోభాయాత్ర, హస్తకళలు, చేనేత వస్తుప్రదర్శన, జానపదాలు, సంగీత విభావరి, కవి సమ్మేళనం, ఆదర్శ రైతుల ఉత్పత్తులు ప్రదర్శించాలని సూచించారు. అదేవిధంగా పాటలపోటీలు, హాస్యవల్లరి, పాలమూరు థీమ్సాంగ్, వంటి కార్యక్రమాలు జిల్లావాసులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. పలువురికి సన్మానాలు పాలమూరు జాతర సందర్భంగా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లతోపాటు, కవులు, రచయితలు, పారిశ్రామిక వేత్తలను సన్మానించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను ముందుస్తుగానే సిద్ధంచేసి వారికి సమాచారం అందేవిధంగా చూడాలని డీఆర్వో రాంకిషన్ను కోరారు. ఈ సన్మానాలతో వారికి పాలమూరు వైభావాన్ని చాటిచెప్పే విధంగా కార్యక్రమాలు ఉండాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఏజేసీ డాక్టర్ రాజారాం, జెడ్పీ సీఈఓ రవీందర్, హౌసింగ్ పీడీ రవీందర్రెడ్డి, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ హన్మంతరావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.