-
ఓసినీ వేషాలో..! ఉడుత చేష్టలకు నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్
సాధారణంగా జంతువులు యజమాని దృష్టిని ఆకర్షించడానికి రకరకాల తిక్క పనులు చేస్తుంటాయి. ఇటు.. అటు.. దూకుతుంటాయి. పక్క జంతువులతో ఊరికే గొడవ పడుతుంటాయి. కొన్ని సార్లు దెబ్బతగిలినట్లు యాక్టింగ్ కూడా చేస్తుంటాయి. ఇలాంటి చేష్టలను మన పెంపుడు కుక్కల్లో చూస్తుంటాం. కానీ ఉడుతలు కూడా ఈ కొవలోకి వచ్చేశాయా? అని అనిపిస్తుంది మీరు ఈ వీడియో చూస్తే..! ఇంతకూ ఓ నల్లని ఉడత ఏ చేసిందో తెలుసా..? ఉడుతలు కూడా యాక్టింగ్ చేస్తాయా? అంటే అవుననే అనాలి. దానికి ఏం అనిపించిందో తెలియదు కానీ ఇంట్లో చీపురుతో కాసేపు ఆటలాడింది. అనంతరం ఆ చీపురును మీద వేసుకుని గది ఫ్లోర్పై బోర్లా పడుకుంది. చీపురు దాని పొట్టపై పడి ఉండడంతో.. ఉడుతపై చీపురు పడి గాయపడినట్లుందే అని అనిపించాల్సిందే సదరు వీక్షకునికి. దాని నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చనుకోండి..! ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఉడుత కొంటె చేష్టలకు వ్యూవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ పెట్టారు. (ఫ్లైయింగ్ ఉండుత.. లైయింగ్ ఉడుత) 'ఎగిరే ఉడుత.. అబద్దాల ఉడుత' అని మరొకరు కామెంట్ చేశారు. Squirrel fakes an injury pic.twitter.com/5xXeTFUv7U — Crazy Clips (@crazyclipsonly) June 3, 2023 ఉడుతలు చాలా చురుకుగా ఉంటాయని ఓ జంతు నిపుణుడు తెలిపారు. నిత్యం ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతుంటాయని చెప్పారు. పట్టణాల్లోని గదులు వాటికి చాలా చిన్న ప్రదేశం కావున ఆడుకోవడానికి కావాల్సిన ప్రదేశం ఉండదని అన్నారు. నల్లని ఉడుతలను పెంచడానికి అనుమతి లేదని చెప్పారు. వాటికి ప్రత్యేకమైన కేర్ అవసరమని పేర్కొన్నారు. వెటర్నరీ సెంటర్లలో లభించవని తెలిపారు. సాధారణంగా ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో ఉంటాయని చెప్పారు. ఇదీ చదవండి: వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నీస్ రికార్డ్ -
శతక నీతి – సుమతి: అద్దం... అబద్ధం
‘బలవంతుడనాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా/బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కి చావదే సుమతీ !’ అన్న సుమతీ శతకకారుడి నీతి సూత్రాన్ని చర్చించుకుంటున్నాం... నిజానికి ఏ కాలానికి ఆ కాలంలో పెద్దలు పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి ఇటువంటి హితోక్తులు చాలా చెబుతుంటారు. వాటిని విని అనుసరించిన వారు విచక్షణతో, వివేకంతో వారి జీవితాలను సుఖమయం చేసుకుంటుంటారు. నందుల చరిత్ర తెలిసే ఉంటుంది. కేవలం పొగరుబోతు తనంతో, అతిశయంతో నిష్కారణంగా వైరం పెట్టుకొని మలయకేతు, పర్వతకుడు, వైరోచకుడు..ఇలా ఎంతో మంది రాజులను అవమానించారు. ఆ క్రమంలోనే అన్నశాలలోకి అన్నం తినడానికి కూర్చొన్న చాణక్యుడిని అవమానకరంగా మాట్లాడారు. ఆయన చాలా గొప్పవాడు, మహావిద్వాంసుడు, మహా మేధావి అంటూ అందరూ చెబుతున్నా వినకుండా జుట్టుపట్టి ఈడ్పించారు నందులు. పిలక ఊడిపోయింది.. మిమ్మల్ని పదవీచ్యుతుడిని చేసేదాకా ఈ పిలక ముడి వేయను.. అని అక్కడే శపథం చేసాడు చాణక్యుడు. చంద్రగుప్తుణ్ణి ముందు నిలబెట్టి నందుల చేతిలో అవమానం పొందిన రాజులందరినీ ఏకం చేసిన చాణక్యుడు వ్యూహరచన చేసిన యుద్ధంలో ఇంత గొప్ప నందులు ఏమయిపోయారు. మొత్తం వంశమే మిగలకుండా పోయింది. నందుల మీద అపార ప్రేమ కలిగిన మహా మేధావి ఒకాయన ఉండేవాడు. ఆయన పేరు రాక్షసుడు. చాణక్యుడికి ప్రతిభకు లొంగిపోయి చంద్రగుప్తుడికి ప్రధానమంత్రి అయ్యాడు. చంద్రగుప్తుడు తన అభిరుచి మేరకు ఒక రాజభవనం కట్టించుకున్నాడు. మొత్తం సిద్ధమయిన తరువాత దానిలో ఉండడానికి చాణక్యుడి అనుమతి కోరాడు. ‘వీల్లేదు’ అని శాసించాడు రాజగురువు. చంద్రగుప్తుడు చిన్నాచితకా రాజేమీ కాదు... అప్పట్లో భారత దేశంలో వైభవంగా వెలిగిన మగధ సామ్రాజ్యాధిపతి. అంత గొప్ప రాజ్యానికి తిరుగులేని మహారాజయి ఉండి తను ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోకి పోవడానికి అనుమతి అడగడం, దాన్ని చాణక్యుడు తిరస్కరించిన వెంటనే సమ్మతించడం... సాధారణ విషయమేమీ కాదు. వినయం అంటే అదీ. చెప్పినంత సులువు కాదు అలా ఉండడం. మీరెప్పుడు అనుమతిస్తే అప్పుడే గృహప్రవేశం చేస్తానన్నాడు. చాణక్యుడు కొంతమంది సైనికులను వెంటపెట్టుకుని ఆ మహాసౌధాన్ని అణువణువూ గాలిస్తున్నాడు. ఆంతరంగిక మందిరం వంటి ఒకగది నిండా పెద్ద పెద్ద అద్దాలు బిగించి ఉండడం చూసి అనుమానించాడు. పిలిచి అడిగాడు అక్కడివారిని.. అలంకారం కోసం పెట్టామని చెప్పారు. అంతకంటే గొప్ప అలంకారం రావడానికి నేను చిట్కా చెబుతానంటూ వాటిని తొలగించి చిత్తరువులు పెట్టమన్నాడు. అద్దాలు తొలగిస్తుంటే వాటి వెనుక గదులు, వాటిలో సాయుధులైన సైనికులు కనబడ్డారు. వెంటనే తన సైనికులతో వారిని తుదముట్టించాడు. చంద్రగుప్తుడు నిర్ఘాంతపోయాడు. అద్దాలు గదినిండా ఉన్నప్పుడు లోనికి ప్రవేశించిన వారు తమ ప్రతిబింబాన్ని భిన్నకోణాలలో చూసుకుంటూ మురిసిపోతూ ఆదమరిచి ఉంటారు. ఆ క్షణాల్లో వెనుకనుంచి చంపేయడానికి రాక్షసుడు అనే మంత్రి చేసిన కుట్ర బట్టబయలయిపోయింది. చంద్రగుప్తుడు మహారాజయినా వినయంతో ప్రవర్తించినందుకు క్షేమంగా బయటపడ్డాడు. వాళ్లెంత, వీళ్ళెంత ...అని గర్వాతిశయంతో ధిక్కరించి నడుచుకొన్నందుకు నంద రాజులలో ఒక్కడంటే ఒక్కడూ మిగలలేదు. వీటిలో నీతిని గ్రహించాలి. మనకంటే గొప్పవాళ్లుంటారనే సత్యాన్ని గ్రహించి ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా ...అంటూ బద్దెన గారిస్తున్న సందేశం కూడా అదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బిడ్డకు తండ్రెవరో తప్పు చెప్పినందుకు.....
సాక్షి, న్యూఢిల్లీ : తన బిడ్డకు తండ్రి ఎవరో తప్పు చెప్పినందుకు తల్లికి, అవును ఆ బిడ్డకు తండ్రిని తానేనంటూ నాటకమాడిన ఆ తల్లి కొత్త బాయ్ ఫ్రెండ్కు వెస్ట్ వేల్స్లోని స్వాన్సీ క్రౌన్ కోర్టు జైలు శిక్ష విధించింది. వారిద్దరు జైలు శిక్ష పూర్తి చేసుకొని వచ్చేవరకు బిడ్డ సంరక్షణ బాధ్యతలను స్వయంగా చూసుకోవాల్సిందిగా ఆ బిడ్డ అసలు తండ్రి ఆశ్లే సేస్ని కోర్టు ఆదేశించింది. వెస్ట్ వేల్స్లోని మాన్సెల్టన్కు చెందిన లూజీ బాయిస్ (30) మూడు నెలల క్రితం ప్రసవించింది. అప్పటికే తన మొదటి బాయ్ఫ్రెండ్ ఆశ్లీసేస్తో ఆమె గొడవపడి విడిపోయింది. పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. వెస్ట్ వెల్స్ నిబంధనల ప్రకారం బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరు బర్త్ రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లి బిడ్డ పేరిట సర్టిఫికెట్ తీసుకోవాలి. మొదటి బాయ్ ఫ్రెండ్తో గొడవ పడి విడిపోయినందున ఇక అతనితో ఎలాంటి సంబంధాలు ఉండరాదని భావించిన లూజీ బాయిస్, తాను ప్రస్తుతం ప్రేమిస్తున్న 34 ఏళ్ల నాథన్ లెగట్తో కలిసి బిడ్డ సర్టిఫికెట్ కోసం వెళ్లింది. అక్కడ అధికారుల ముందు బిడ్డకు తల్లిగా సంతకం చేసింది. ఆ తర్వాత అధికారులు బిడ్డకు తండ్రి మీరేనా? అంటూ నాథన్ లెగట్ను అడిగారు. అందుకు ఆయన అవునంటూ సంతకం చేస్తూ భోరుమని ఏడ్చారు. దీంతో అధికారులకు సందేహం వచ్చింది. వారిని విచారించి అసలు తండ్రి ఎవరో కనుక్కోవాల్సిన బాధ్యతను అధికారులు ఓ ఎన్జీవో సంస్థకు అప్పగించారు. ఎన్జీవో సంస్థ డీఎన్ఏ పరీక్షల ద్వారా నాథన్ లెగట్ తండ్రి కాదని, లూజీ బాయిస్ మొదటి బాయ్ ఫ్రెండే ఆశ్లే లేస్ తండ్రని తేల్చింది. అబద్ధమాడిన రెండో బాయ్ఫ్రెండ్ నాథన్, లూజీ బాయిస్, మొదటి బాయ్ఫ్రెండ్ ఆశ్లే సేస్ ఇందులో తల్లి బాయిస్, తండ్రిగా నాథన్ లెగట్లు అబద్ధామాడినందుకు వారిపై పోలీసులు కేసు పెట్టి కేసు విచారణను స్వాన్సీ కోర్టుకు అప్పగించారు. బిడ్డ విషయంలో అబద్ధమాడినందుకు కోర్టు తల్లికి ఎనిమిది నెలల జైలు శిక్ష, తాజా బాయ్ ఫ్రెండ్కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ రెండు రోజుల క్రితం తీర్పు చెప్పింది. తన మాజీ ప్రియురాలు లూజీ బాయిస్ అన్నా, తమ ఇద్దరికి పుట్టిన బిడ్డ అన్నా ఇప్పటికీ తనకు ఇష్టమేనని విచారణ సందర్భంగా అంగీకరించిన బిడ్డ అసలు తండ్రి ఆశ్లే లేస్కే వారు విడుదలై వచ్చే వరకు బిడ్డ సంరక్షణ బాధ్యతలను కోర్టు అప్పగించింది. అయితే శిక్షపడే నాటికి బాయిస్ రెండోసారి గర్భంతో ఉంది. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరో కోర్టు ప్రశ్నించలేదు, తల్లి కూడా ఎవరికి చెప్పలేదు. -
అబద్ధం చెప్పడం
జీవన కాలమ్ అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు. మనం చేసే పనుల్లోకెల్లా అబద్ధం చెప్పడం చాలా కష్టతరమైన పని. అబద్ధానికి ముందు కావలసినంత పరి శ్రమ కావాలి. ఫలానా అబద్ధం వల్ల కథ అడ్డం తిరిగితే తప్పిం చుకునే దారులో, సమర్థిం చుకునే మార్గాలో అప్పటికప్పుడు కరతలామలకంగా సిద్ధంగా ఉండాలి. అబద్ధం చెప్పడంలో సూపర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రముఖ నటుడు, నా అనుంగు మిత్రుడు, మహానటుడు కె. వేంకటేశ్వరరావుకి ఇస్తాను. ‘‘ఏరా! మొన్న నాకోసం లీలా మహల్ జంక్షన్ దగ్గర కలుస్తాను అన్నావు? రాలేదేం?’’ అన్నామనుకోండి. రాలేకపోవడానికి వెయ్యి కారణాలు చెప్పవచ్చు. కానీ చెప్పడు. ‘లీలా మహల్ జంక్షన్ దగ్గర ఏ వేపు నిలబడ్డావు?’ ‘సోడా కొట్టు దగ్గర’ అంటే ‘అదీ.. నేను లేడీస్ గేటు దగ్గర ఒక్క అరగంట పైగా నిలబడి వెళ్లిపోయా’ నంటాడు. వాడిని ఏడిపించాలని ‘అవునవును. ఈ చారల చొక్కాతో ఓ మనిషిని చూశాను. నువ్వనుకోలేదు’ అన్నామనుకోండి. తను అబద్ధం ఆడి దొరికిపోనందుకు సిగ్గుపడాలి కదా? పడడు. ‘మరి నన్ను పలుకరించలేదేం’ అని ఎదుటి ప్రశ్న వేస్తాడు. రెండు అబద్ధాల మధ్య నిజం ఎక్కడో చచ్చిపోయి, నిజాన్ని పెట్టుబడిగా పెట్టిన మన ఆవేశం నీరు కారిపోతుంది. అబద్ధానికి చాలా ఒరిజినాలిటీ కావాలి. గొప్ప సమయస్ఫూర్తి కావాలి. తను చెప్తున్నది అబద్ధమని ఎదుటివాడికి అర్థమవుతుందని తెలిసినా ‘సిగ్గులేని తనం’ కావాలి. ఒక్క ఉదాహరణ. ‘నిన్న పొద్దుట ఎక్కడరా? ఎంత వెతికినా దొరకలేదు?’ ‘ఎక్కడ బ్రదర్ ఏకామ్రేశ్వరరావుగారు చంపేశారు’ ‘ఎవరు? ఉపముఖ్యమంత్రిగారే! ఏమిటి విశేషాలు?’ ‘వచ్చే కేబినెట్లో విద్యామంత్రిని ఎవరిని పెట్టాలని నా సలహా కోసం కబురు పంపించాడు’.. ‘అదేమిట్రా? ఆయన మొన్న టంగుటూరు ఫ్లై ఓవర్ దగ్గర యాక్సిడెంట్లో పోయారు కదా? వెంటనే సమాధానం వస్తుంది. ‘అదే నీతో చిక్కు. నేను చెప్పేది 1997 మంత్రి గురించి...’ ‘ఆయనెప్పుడూ మంత్రి కాలేదు కదా?’ ‘అందుకే రాజకీయాలు తెలీని వారితో మాట్లాడటం కష్టం. ఆయనే విద్యామంత్రని కనీసం 20 రోజులు మా సర్కిల్సులో అనుకునేవాళ్లం. అతను మీ అందరికీ ఏకామ్రేశ్వరరావు. మాకు మాత్రం విద్యేశ్వరరావు’. అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా మూలుగుతూ, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు. నిజం నీరసమయినది. అది వన్ వే ట్రాఫిక్. నిజాయితీపరుడిని నిద్రలో లేపినా ఒక్కటే చెప్పగలడు– దిక్కుమాలిన నిజం. అబద్ధం అక్షయపాత్ర. సత్య హరి శ్చంద్రుడిలాంటి వెర్రిబాగులవారు ఈ దేశంలో బొత్తిగా కనిపించరు. నా జీవితంలో అబద్ధం బాధపెట్టినట్టు, తలుచుకున్నప్పుడల్లా, డబ్బు కంటే సులువుగా మోసపోయినందుకూ ఇప్పటికీ విలవిలలాడతాను. రేడియోలో పనిచేస్తున్న రోజులు. సినీమా ధర్మమాంటూ కొన్ని వేలు అదనంగా దాచుకున్నాను. ఎందుకు? వెస్పా కొనుక్కోవాలని. మా ఆఫీసుకి ఓ తమిళ ఆఫీసరులాంటి వ్యక్తి వచ్చేవాడు. ఎప్పుడూ పెద్ద కబుర్లు చెప్పేవాడు. అతని వెస్పా పచ్చగా నిగనిగలాడుతూ కనిపించేది. అది నా కల. తెలిసి ‘ఓస్! అదెంతపని ఆరు నెలలు తిరగకుండా– చవకలో కొనిపిస్తాను’ అన్నాడు. అతని మాటలు, చెప్పే ధోరణీ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్నట్టుగా ఉండేవి. ఒకసారి కన్సైన్మెంట్ వచ్చింది. దాన్ని చూపించడానికీ నాకిష్టపడలేదు. ‘చూడగానే నవనవలాడే అమ్మాయిని మీకు అప్పజెప్తాను’ అన్నాడు. ఎట్టకేలకు మరో కన్సైన్మెంట్ వచ్చింది. తనే ఎగిరి గంతేశాడు. మా ఆవిడకీ నాకూ కరచరణాలు ఆడలేదు.. అన్నీ గోడౌన్లోకి వచ్చాక మిమ్మల్నిద్దరినీ తీసికెళ్తానన్నాడు. ఒక మధ్యాహ్నం ఉన్నట్టుండి ఫోన్ చేశాడు. ‘ఈసారి రెండు రకాల ఆకుపచ్చలు కలిపాడు సార్! బాడీ చిలక పచ్చ. హాండిల్బార్లో చిన్న రంగు కలిపాడు’ అన్నాడు. ఫోన్లో వెనుక వెస్పాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ‘చూడ్డానికి వచ్చేదా?’ అన్నాను. నవ్వాడు. ‘వద్దు సార్ రాతకోతలన్నీ పూర్తి చేయించేశాను. రేప్పొద్దుట మీ ఇంటి ముందుం టుంది. సంతకాలు అక్కడే. నేను రాలేను. ఓ మనిషిని పంపుతున్నాను. నుదుటిమీద కాల్చిన మచ్చ. పేరు రామానుజం. అతనికి 4,220 ఇవ్వండి. రూపాయి ఎక్కువ వద్దు. వెంటనే పంపండి. ఎవరీ రామానుజం? ఆలోచన కూడా రాలేదు. అరగంటలో రామానుజం రావడం, డబ్బు ఇవ్వడం జరిగిపోయింది. ఆ రాత్రి మా ఇద్దరికీ నిద్దుర లేదు. ఆ ఉదయమే కాదు. ఆరు నెలలైనా వెస్పా ఛాయ లేదు కదా.. ఈ ఆర్ముగం అయిపు లేదు. అసలు ఎవరు ఈ రామానుజం? ఏం కంపెనీలో ఉద్యోగి? డబ్బు పుచ్చుకున్నది ఎవరు? రుజువేమిటి? ఆకర్షణని అద్భుతంగా మలచిన గొప్ప సంఘటన ఇది. తర్వాత 4,220 రూపాయలు చూడలేదు. ఆకుపచ్చ వెస్పా చూడలేదు. అబద్ధం అద్భుతమైన ఆభరణం. అది రాణించినట్టు నిజం రాణించదు. ప్రతీ రోజూ ఎన్ని అద్భుతాలు మన మధ్య రాణిస్తున్నాయో పేపరు తెరిస్తే చాలు. అబద్ధం నీడ. నిజం గొడుగు. అబద్ధం అలంకరణ. నిజం నిస్తేజమైన వాస్తవం. అబద్ధం కల. నిజం నిద్ర. - గొల్లపూడి మారుతీరావు -
చిన్నారిపై కన్నతండ్రి కిరాతకం
పాపం, పుణ్యం ఎరుగని పసివాళ్లను చూస్తే ముద్దులాడాలనిపిస్తుంది.. వారి ముద్దు మాటలు విన్నకొద్దీ వినాలనిపిస్తుంది. ఇవన్నీ మరిచిన ఒక తండ్రి.. తన బిడ్డపై అమానుషంగా ప్రవర్తించాడు.. సెల్ఫోన్ చార్జర్ వైర్తో, బెల్టుతో గొడ్డును బాదినట్టు బాదాడు.. బెడ్రూమ్లో కొడుకును ఎత్తి విసిరిపారేశాడు.. ఫుట్బాల్ను తన్నినట్టు తన్నాడు. చిన్నారి తల్లి వారించకపోగా భర్తకే వంతపాడింది. ఈ దారుణం బెంగళూరులో జరిగింది. యశవంతపుర (బెంగళూరు): యశవంతపుర నియోజకవర్గం కెంగేరి గ్లోబల్ విలేజ్ సమీపంలో మహేంద్ర అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. సమీపంలోని ఓ పాఠశాలలో అతని కొడుకు ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఇంట్లో అల్లరి చేశాడని కొడుకును మొబైల్ చార్జర్ వైర్, బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఇంకోసారి అలా చేయను డాడీ అని చిన్నారి ప్రాధేయపడుతున్నా ఆ బండరాయి మనసు కరగలేదు. బెడ్రూంలో కొడుకును ఎత్తి విసిరేయడం, కాళ్లతో ఫుట్బాల్ను తన్నినట్టు తన్నడం చేశాడు. పైగా ఇదేదో ఘనకార్యమన్నట్లు తన ఫోన్లో వీడియో తీశాడు. ఇటీవల ఫోన్ చెడిపోగా దాన్ని ఒక మొబైల్షాప్లో రిపేరుకు ఇచ్చాడు. మెకానిక్ అందులోని వీడియోను చూసి తీవ్ర ఆవేదనకు గురై దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో మహేంద్ర క్రూరత్వం బయటపడింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కెంగేరి పోలీసులు సుమోటోగా పోక్సో కేసును నమోదు చేసి మహేంద్రను అరెస్టు చేశారు. కాగా, కొడుకును కొడుతున్న వీడియోను తన భార్యతో తీయించినట్టు పోలీసుల ఎదుట మహేంద్ర ఒప్పుకున్నాడు. ఇంకోసారి అల్లరి చేస్తే ఈ వీడియోను చూపించి కొడుకును భయపెట్టడానికే రికార్డు చేయించినట్టు చెప్పాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement