breaking news
Lok Janshakti Party (LJP) chief
-
చిరాగ్ పాశ్వాన్కు ఎదురుదెబ్బ.. 22 మంది నేతల రాజీనామా
పట్నా: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్డీయే కూటమిలోని లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్)(LJP)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి షాకిస్తూ పలువురు నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కబర్చిన 22 మంది నేతలకు టికెట్ లభించకపోవటంతో వారంతా రాజీనామా బాటపట్టారు. రాష్ట్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధ్యక్షురాలు రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, సంస్థాగత కార్యదర్శి రవీంద్ర సింగ్ రాజీనామా చేశారు. అదేవిధంగా వారి మద్దతుదారులు పెద్దఎత్తున రాజీనామాలను రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీకి పంపించారు. శాంభవీ చౌదరీ( సమస్తిపూర్), రాజేశ్ వర్మ (ఖాగారియా), వీణా దేవి ( వైశాలీ) వంటి నేతలకు టికెట్లు కేటాయించటంపై రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిరాగ్ పాశ్వాన్, అతని సన్నిహితులు... డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. అయితే ఈ సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో సీనియర్ నేతల అభిప్రాయలు తీసుకోలేదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక.. నామినేషన్ల ప్రక్రియ సమయంలో తమ నేతలకు టికెట్ కేటాయించకుండా పక్కనపెట్టడంపై పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఎల్జేపీకి బీజేపీ ఐదు సీట్ల కేటాయించిన విషయం తెలిసిందే. కీలకమైన హాజీపూర్ స్థానంలో చిరాగ్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చిరాగ్ బంధువు అరుణ్ భార్తి జాముయి స్థానంలో బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర మంత్రి, జేడీ(యూ) సీనియర్ నేత అశోక్ చౌదరీ కుమార్తె ఈ శంభవీ చౌదరీ. ఆమె తొలిసారి పార్లమెంట్లో ఎన్నికల్లో పోటి చేసి తన అదృష్టం పరిక్షించుకోబోతున్నారు. అయితే ఆమెకు అక్కడి బ్రాహ్మణ, భూమిహార్స్ సామాజిక వర్గాల మద్దతు ఉండటం గమనార్హం. మెజార్టీ దళీతల ఒటర్లు సైతం ఆమెకు మద్దతు ఇవ్వనున్నారు. మరోవైపు... వీణా దేవీ మళ్లీ వైశాలీ సీటు దక్కించుకున్నారు. ఆమె 2019లో అభివక్త ఎల్జేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం చీలిక వర్గంలో పశుపతి కుమార్ పరాస్ వైపు మద్దతు పలికినా.. తర్వాత రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబం మీద గౌరవంతో చిరాగ్ వైపే ఉండటం గమనార్హం. ఇక.. గత 2019 ఎన్నికలో ఎల్జేపీ మొత్తం ఆరుస్థానాల్లో విజయం సాధించింది. హాజీపూర్, వైశాలీ, సమస్తీపూర్, జాముయి. నావాదాలో ఎల్జేపీ గెలుపొందింది. సీట్ల పంపకంలో భాగంగా నావాదా సీటు బీజేపీకి దక్కింది. అయితే, రాజీనామా చేసిన ఎల్జేపీ నేతలంతా ప్రతిపక్షాల ఇండియా కూటమిలో మద్దతు ఇవ్వనున్నట్ల ఊహాగానాలు వస్తున్నాయి. -
'నేను కాదు కదా.. నా వాళ్లు కూడా బరిలో లేరు'
పాట్నా: తాను బీహార్ ముఖ్యమంత్రి రేసులో లేనని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత, ఎన్డీయే భాగస్వామి, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి కూడా ఎవరూ ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు ఓ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని, అది కూడా తమ పార్టీ అధినేతకే ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు కాస్తంత అసహనంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో పాశ్వాన్ మంగళవారం మీడియా ముందుకొచ్చి తాను బీహార్ ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని, తన పార్టీ నుంచి కూడా ఎవరూ లేరని, ఈ విషయంలో ఇంకా ఎవరినీ ఏమీ అడగాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ ఎవరినీ ఆమోదిస్తే వారినే ఎల్జేపీ కూడా అంగీకరిస్తుందని అన్నారు. వారు ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్, జీ, హెచ్, ఐ ఇలా ఎవరినీ ప్రకటించినా వెంటనే ఆమోదం తెలుపుతామని చెప్పారు. మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశిల్ కుమార్ మోదీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాశ్వాన్ ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు.