-
చిట్టితల్లి లేదిక..
అనంతపురం క్రైం : మొన్నటి వరకు తల్లి ఒడిలో హాయిగా నిద్రించింది.. తండ్రి భుజాలపై కూర్చుని సంతోషంగా గడిపింది. చుట్టుపక్కల చిట్టిపొట్టి చిన్నారులతో కలిసి అల్లరి చేసింది. అలాంటి చైత్ర ఆడుకుంటూ వెళ్లి కన్పించకుండాపోయింది. చిట్టితల్లి కోసం రెండ్రోజుల పాటు ఆ తల్లిదండ్రులు వెతకని ప్రాంతమంటూ లేదు. కన్పించిన వారినంతా ‘మా లవ్లీ కన్పించిందా’ అంటూ అడిగారు. ఎవరూ జాడచెప్పలేకపోయారు. మంగళవారం ఉదయాన్నే గుండెలు పిండేసే విషాదం.. కన్పించకుండా పోయిన చైత్ర మురుగు కాలువలో మృతదేహంగా కన్పించడం చూసి తట్టుకోలేకపోయారు. గుండెలవిసేలా రోదించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని ఖాజానగర్కు చెందిన సీహెచ్ శ్యాంసుందర్, సరళ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. శ్యాంసుందర్ ‘హీరో’ షోరూంలో పని చేస్తున్నారు. చిన్న కుమార్తె చైత్ర అలియాస్ లవ్ లీ (2) ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటూ కన్పించకుండాపోయింది. పాప కోసం తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో.. కాలనీలో వెతికినా ఫలితం లేకపోయింది. రెండ్రోజులైనా పాప జాడలేకపోయింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు మంగళవారం ఉదయం ఇంటి వెనుక ఉన్న మురుగు కాలువలో వెతికారు. కొద్ది సేపటి తర్వాత చైత్ర వేసుకున్న డ్రస్సు కన్పించడంతో దగ్గరికెళ్లి చూశారు. చిన్నారి వృతదేహం కన్పించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిన్నటి వరకు వచ్చీరాని మాటలతో ఇంటిల్లిపాదినీ అలరించిన చిట్టితల్లి కానరాని లోకాలకు వెళ్లిందని తెలుసుకున్న కుటుంబీకులు బోరున విలపించారు. వృతి చెంది రెండ్రోజులు కావస్తుండడంతో పాప శరీరమంతా ఉబ్బిపోయింది. సమాచారం అందుకున్న మేయర్ మదమంచి స్వరూప, కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, వన్టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, టీడీపీ నేత కోగటం విజయభాస్కర్రెడ్డి, గోవిందరెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి తల్లిని ఓదార్చారు. వృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాలువను శుభ్రం చేసే నాథులే లేరు.. నగరమంతా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రజాప్రతినిధులు అవకాశం వచ్చినప్పుడల్లా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. చైత్రను మింగేసిన మురుగు కాలువను చూస్తే ఏ మేరకు నగర అభివృద్ధి జరుగుతోందో అర్థమవుతుంది. స్వయంగా ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నివాసం, విద్యా సంస్థల మధ్యనే ఈ కాలువ ఉంది. అయినా దీన్ని శుభ్రం చేయించే నాథుడే కరువయ్యారు. ఇదే విషయంపై మేయర్, కమిషనరును మంగళవారం స్థానికులు నిలదీశారు. ‘మీఇళ్ల వద్ద ఇలాగే ఉంటే భరిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. అరగంట పాటు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది పడతారని, అలాంటిది తాము 24 గంటలూ ఎలా కాపురం చేస్తున్నామో ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మురుగు కాలువను శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. -
ఆశ... నిరాశ
బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ అర్జీ విచారణ సందర్భంగా హైకోర్టు ఎదుట మంగళవారం హైడ్రామా నెలకొంది. ఉదయం నుంచే అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు, జయలలిత అభిమానులు పెద్దసంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే హైకోర్టు ఆవరణంలోకి అనుమతించారు. నగరంలో తమిళులు అత్యధికంగా నివసించే శ్రీరాంపుర, హలసూరు, జీవన్బీమానగర్, ఇందిరానగర్, హెచ్ఎఎల్ పరిసర ప్రాంతాలు, ఐటీఐ గేట్, పులకేశీనగర్, ఎంఎస్పాళ్య, జేపీనగర రెండవ స్టేజ్, జయనగర ఐదు, తొమ్మిదవ బ్లాక్లు, మురగేష్ పాళ్య, దొమ్మలూరు, భారతీ నగర్, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి అదనపు బలగాలను మొహరింపజేశారు. తొలుత హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే జయలలితకు బెయిల్ చిక్కిదంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో కోర్టు బయట ఉన్న జయలలిత అభిమానులు ఒక్కసారిగా బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచారు. హొసూరు రోడ్డులోని హొసరోడ్డు జంక్షన్, చందాపుర, అత్తిబెలె తదితర ప్రాంతాల్లోనూ సంబరాలు నిర్వహించారు. ఈ ఉత్సాహం కొద్దిసేపటిలోనే నీరుగారిపోయింది. బెయిల్ నిరాకరణ అయినట్లు తెలియడంతో చెన్నైకు చెందిన సరళ(40) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను అంబులెన్స్లో సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. రెండు గంటలకు పైగా అభిమానులు తమ చేతుల్లో జయలలిత చిత్రాన్ని ఉంచుకుని బోరుమని విలపించారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా... జయలలితకు బెయిల్ నిరాకరణ కావడంతో హొసూరు రోడ్డులోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న బెంగళూరు నగర అదనపు పోలీస్ కమిషనర్ అలోక్కుమార్ హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే అదనపు బలగాలను రంగంలోకి దింపారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం చుట్టూ ఒక కిలో మీటరు వరకు నిషేదాజ్ఞలు విధించారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఏసీపీ హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా హొసూరు రోడ్డులోని పలు ప్రాంతాల్లో టియర్ గ్యాస్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. తమిళనాడుకు కేఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దు హైకోర్టు తీర్పుతో వెంటనే కేఎస్ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులోని ఉన్న తమ సంస్థకు చెందిన వాహనాలను తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ సురక్షిత ప్రాంతంలో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కేఎస్ఆర్టీసీ బస్సులపై దాడులు చేయవచ్చునన్న అనుమానంతో తమిళనాడుకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. దీంతో చెన్నైలో కేఎస్ఆర్టీసీకి చెందిన 150 బస్సులు నిలిచిపోయాయి. తమిళనాడు బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే బెంగళూరులోకి అనుమతిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement