breaking news
liars dice
-
ఆస్కార్కు మన ఎంట్రీగా లయర్స్ డైస్
వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో జరిగే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో పోటీ పడేందుకు మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’ (2013) ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) దేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన సినీ ప్రముఖులతో నియమించిన 12 మంది సినీ ప్రముఖుల జ్యూరీ మంగళవారం నాడు ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. ‘ఉత్తమ విదేశీ భాషా చిత్రం’ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచేందుకు ‘లయ్యర్స్ డైస్’ చిత్రం అర్హమైనదంటూ జాతీయ అవార్డు చిత్రాల దర్శకుడు టి. హరిహరన్ నేతృత్వంలోని జ్యూరీ అభిప్రాయపడింది. మొత్తం 30 భారతీయ చిత్రాలను హైదరాబాద్లో ప్రత్యేకంగా చూసిన జ్యూరీ చివరకు ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఎఫ్.ఎఫ్.ఐ. డిప్యూటీ సెక్రటరీ ప్రకటించారు. ఎఫ్.ఎఫ్.ఐ. ఉపాధ్యక్షుడైన సి. కల్యాణ్కు జ్యూరీ తన సిఫార్సును అందజేసింది. ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్దాస్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రయాణంలో సాగే నాటకీయ ఘట్టాలతో నడుస్తుంది. నగరాలకు వలస పోవడం వల్ల మానవ జీవితంలో తలెత్తిన సంక్షోభాన్ని ఈ చిత్రం ప్రస్తావిస్తుంది. చాలా కాలం క్రితం పని కోసం వెళ్ళిన భర్త కనిపించకుండా పోవడంతో ఓ మారుమూల గ్రామంలోని ఓ యువకురాలైన తల్లి పడే బాధలను ఈ చిత్రం ప్రతిఫలించింది. నవాజుద్దీన్ సిద్దిఖీ, గీతాంజలీ థాపా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులు (ఉత్తమ నటి - గీతాంజలీ థాపా, ఉత్తమ ఛాయాగ్రహణం - రాజీవ్ రవి) అందుకుంది. విమర్శకుల ప్రశంసలందుకొన్న ఈ చిత్రం ఆస్కార్ బరిలో మన ఆశలు పండిస్తుందా అన్నది వేచిచూడాలి. -
ఆస్కార్ బరిలో మన చిత్రం.. 'లయర్స్ డైస్'
జాతీయ అవార్డు పొందిన హిందీ చిత్రం 'లయర్స్ డైస్'కు ఆస్కార్ ఎంట్రీ లభించింది. 87వ అకాడమీ అవార్డుల బరిలో గీతాంజలి థాపా, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ఈ చిత్రానికి అవకాశం వచ్చింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) నియమించిన 12 మంది సభ్యుల జ్యూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. ఈసారి అత్యధికంగా రికార్డు స్థాయిలో 30 సినిమాలు దీనికోసం పోటీ పడ్డాయి. వీటిలోంచి లయర్స్ డైస్ను భారతదేశం తరఫున విదేశీ చిత్రాల కేటగిరీలో అవార్డు కోసం పంపుతున్నట్లు ఎఫ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సుప్రాణ్ సేన్ తెలిపారు. మళయాళ నటి గీతూ మోహన్దాస్ తొలిసారిగా దర్శకత్వం వహించి తీసిన ఈ సినిమాలో తన మూడేళ్ల కూతురితో కలిసి ఓ మహిళ.. తప్పిపోయిన తన భర్త కోసం వెతుకుతుంటుంది. దారిలో వాళ్లకు సైన్యం నుంచి బయటికొచ్చిన ఓ వ్యక్తి కలుస్తాడు. అతడు వారు తమ గమ్యాన్ని చేరుకునేవరకు తోడుంటాడు. 61వ జాతీయ సినిమా అవార్డులలో ఈ సినిమాకుగాను గీతాంజలికి ఉత్తమనటి అవార్డు, రాజీవ్ రాయ్కి ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చాయి.