-
చవకైన 5జీ స్మార్ట్ఫోన్లు, వరుసలో మరిన్ని బ్రాండ్లు!
చవక ఫోన్లతో దేశీ బ్రాండ్లు గతంలో భారత 3జీ, 4జీ మార్కెట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 5జీ విభాగంలోనూ అదే ట్రెండ్కు లావా మొబైల్స్ తెరలేపింది. రూ.10,000లోపు ధరలో మోడల్ను ప్రవేశపెట్టి భారత్లో చవకైన 5జీ స్మార్ట్ఫోన్ ట్యాగ్ను సొంతం చేసుకుంది. మరిన్ని భారతీయ బ్రాండ్లు ఈ విభాగంలో రంగ ప్రవేశం చేయనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 5జీ హ్యాండ్సెట్లు రూ.13 వేల నుంచి లభిస్తున్నాయి. రానున్న రోజుల్లో రూ.10 వేల లోపు ధరలో మోడళ్లు వెల్లువెత్తనున్నాయి. దేశీయ కంపెనీల రాకతో చవక ధరల విభాగం జోరు కొనసాగనుంది. 5జీ నెట్వర్క్ విస్తరణ, కస్టమర్ల ఆదరణనుబట్టి ఈ విభాగంలో భారతీయ బ్రాండ్ల రాక ఆధారపడుతుందని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. గతంలో మాదిరిగా ఇబ్బడి ముబ్బడిగా బ్రాండ్స్ ఉండకపోవచ్చని అన్నారు. ఒకదాని వెంట ఒకటి.. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో జూలై–సెప్టెంబర్లో 4.5 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ రంగంలో 15లోపు బ్రాండ్లదే హవా. షావొమీ తొలి స్థానంలో నిలవగా శామ్సంగ్ రెండవ స్థానంలో ఉంది. వివో, రియల్మీ, ఒప్పో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యాపిల్, వన్ప్లస్, మోటో, మోటరోలా, నోకియా, ఐక్యూ, పోకో వంటివి పోటీపడుతున్నాయి. ఇక 5జీ విభాగంలో 20 శాతం వాటాతో శామ్సంగ్ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశీ బ్రాండ్స్ అయిన మైక్రోమ్యాక్స్, కార్బన్తోపాటు టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో సైతం 5జీ స్మార్ట్ఫోన్స్ రంగంలో ఎంట్రీకి సమాయత్తం అవుతున్నాయి. ప్రస్తుతం అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో మూడింట ఒక వంతు 5జీ మోడల్స్ ఉంటున్నాయి. అన్ని బ్రాండ్స్ కలిపి 300 దాకా 5జీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. చవక మోడళ్లు మార్కెట్ను ముంచెత్తితే 5జీ విభాగం అంచనాలను మించి విక్రయాలను నమోదు చేయడం ఖాయంగా కనపడుతోంది. బ్లేజ్ 5జీ ఫీచర్స్ ఇవే.. లావా మొబైల్స్ బ్లేజ్ 5జీ పేరుతో స్పెషల్ లాంచ్ ఆఫర్లో రూ.9,999 ధరలో ఫోన్ను ఆవిష్కరించింది. 6.51 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, ఆన్డ్రాయిడ్ 12 ఓఎస్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ 2.2 గిగాహట్జ్ ప్రాసెసర్, 50 ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా, 128 జీబీ స్టోరేజ్తో తయారైన ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచింది. 4 జీబీ ర్యామ్, 3 జీబీ వర్చువల్ ర్యామ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ప్రింట్, వాటర్ డ్రాప్ డిస్ప్లే, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. గ్లాస్ బ్లాక్ డిజైన్లో రెండు రంగుల్లో లభిస్తుంది. చదవండి: Disney Layoffs: ఐటీలో మొదలై అక్కడి వరకు.. ఉద్యోగులపై వేటుకు రెడీగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ! -
వావ్.. రూ.10వేలకే బోలెడు ఫీచర్లతో 5జీ స్మార్ట్ఫోన్!
దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కంపెనీలు కూడా కస్టమర్లకు 5జీ అధునాతన టెక్నాలజీ సర్వీసును అందించే క్రమంలో బిజీ అయ్యాయి. అయితే కొన్ని మొబైల్స్కి మాత్రం ఈ 5జీ టెక్నాలజీ సపోర్ట్ చేయదన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మొబైల్ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జీ సేవలు అందించే స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహులు చేస్తున్నాయి. ఈ క్రమంలో రూ. 10వేలకే 5జీ మొబైల్ తీసుకురానున్నట్లు ఇండియన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ప్రకటించింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన ఐఎంసీ 2022 ఈవెంట్లో లావా బ్లేజ్ (Lava Blaze 5G)ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో దొరికే 5జీ ఫోన్లలో ఇదే అతి చౌకైందని, ఈ దీపావళికి ప్రీబుకింగ్స్తో కస్టమర్లకు ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ బడ్జెట్ 5G ఫోన్ కీలక ఫీచర్లు ఇవే! ►5G సపోర్ట్ స్మార్ట్ఫోన్, ► మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, ►1600×720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్తో 6.5 ఇంచెస్ LCD స్క్రీన్, ►90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ►5000mAh బ్యాటరీ, బ్లూ, గ్రీన్ కలర్స్ ► 50mp రియర్ కెమెరా, 8 mp ఫ్రంట్ కెమెరా ►4GB RAM, 128GB ►5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్లు ఉన్నాయు చదవండి: Airtel 5g: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
లావా బడ్జెట్ స్మార్ట్ఫోన్ @రూ.5,699
న్యూఢిల్లీ : లావా కంపెనీ బడ్జెట్ స్మార్ట్ఫోన్, ఫ్లెయిర్ జెడ్1ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ధర రూ.5,699 అని కంపెనీ తెలి పింది. ఈ ఫోన్లో 5 అంగుళాల డిస్ప్లే, 1.3 గిగా హెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్పాండబుల్ మెమెరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొం ది. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్లెట్లలో విక్రయాలు ప్రారంభిస్తామని, ఈ నెల 30 నుంచి స్నాప్డీల్లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ వివరించింది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తడిచి మురిసిన ముంబై : భారీ గాలిదుమ్ముతో ఆగిన విమాన సేవలు
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
సమయం మించిపోతోంది.. రండి.. ఓటేయండి (ఫొటోలు)
మే 19కల్లా అండమాన్కు రుతుపవనాలు
నాన్నను బతికుండగానే కాలం చేయమని కోరా!: నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement