breaking news
Laterite mafia
-
అయ్యన్న ఇంటి ముట్టడికి యత్నం
నర్సీపట్నం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి శనివారం అయ్యన్న ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీ నిర్వహించవద్దని టౌన్ సీఐ స్వామినాయుడు ఎమ్మెల్యేకు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా.. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి. అతడి ఇంటిని ముట్టడించి తీరుతామని పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ముందుకు సాగడంతో ఐదు రోడ్ల కూడలి సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే, పార్టీ నాయకులు మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని సీఐలు ఎమ్మెల్యేకు నచ్చచెప్పడంతో అక్కడ నుండి ఎమ్మెల్యే టౌన్ స్టేషన్కు చేరుకుని అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీనికి ముందు అబిద్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి మద్యం సీసాల దండలు మెడలో వేసి అయ్యన్నపాత్రుడు, చంద్రబాబు దిష్టి బొమ్మలను దహనం చేశారు. తాగుబోతు అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. గొలుగొండ మండలంలో అయ్యన్న బినామీల పేరుతో వందల ఎకరాలు సంపాదించారని, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి సన్ రిసార్ట్స్, లిక్కర్ ఫ్యాక్టరీ వంటి కంపెనీలు ఎలా పెట్టారని అయ్యన్నపాత్రుడిని ఎమ్మెల్యే గణేష్ ప్రశ్నించారు. లేటరైట్ అక్రమ తవ్వకాలతో అయ్యన్నపాత్రుడు రూ.100 కోట్లు దోచుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసునన్నారు. మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, మునిసిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం
-
‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం
► విశాఖలో లాటరైట్ మాఫియా దుశ్చర్య ► దాడికి పాల్పడ్డ వారిలో రౌడీ షీటర్ను పట్టుకున్న స్థానికులు సాక్షి, విశాఖపట్నం: లాటరైట్ మాఫియా అక్రమాలపై వార్తలు రాశాడనే కక్షతో విశాఖ జిల్లా నాతవరం మండల ‘సాక్షి’ విలేకరి ఏడీ బాబుపై కొందరు దుండగులు మంగళవారం హత్యాయత్నం చేశారు. రాత్రి ఏడున్నర గంటల సమయంలో నాతవరం తాండవ జంక్షన్ వద్ద నెట్ సెంటర్లో ఉన్న బాబు వద్దకు మూడు ద్విచక్రవాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు బీరు సీసాలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టడంతో బాబు తలకు, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై దుండగులను నియంత్రించడానికి ప్రయత్నించారు. స్థానికులు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి ఐదుగురు వ్యక్తులు పారిపోయారు. ఒకరిని మాత్రం పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి నర్సీపట్నం ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ బండారు సంతోష్గా గుర్తించారు. అతనిని నాతవరం పోలీస్స్టేషన్లో అప్పగించారు. బాబును హుటాహుటిన నర్సీ పట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకరగణేష్ ఆస్పత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు. అనంతరం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగిని కలసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
లేటరైట్ మాఫియా బరితెగింపు
సాక్షి విలేకరి ఏడీ బాబుపై హత్యాయత్నం ఇనుపరాడ్లు..బీరు బాటిళ్లతో దాడి నర్సీపట్నం : నాతవరం మండలం సాక్షి దినపత్రిక విలేకరి అనిమిరెడ్డి దొంగబాబు (ఏడీ బాబు)పై లేటరైట్ మాఫియా దాడి చేసింది. మారణాయుధాలతో హత్యాయత్నానికి దిగిం ది. బాధితుడు ఏడీ బాబు కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం తాండవ జంక్షన్లో నెట్సెంటర్ నుంచి ఏడీబాబు వార్తలు పంపే పనిలో ఉన్నారు. అదే సమయంలో మూడు వాహనాలపై ఆరుగురు వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా ఏడీబాబుపై దాడి చేశారు. ఇనుపరాడ్లు, బీరుబాటిళ్లతో తీవ్రంగా కొట్టారు. హత్య చేసేందుకు ప్రయత్నించారు. బీరుబాటిళ్లతో తల, చాతి, చేతులపై విచక్షణారహితంగా పొడిచారు. ఇనుపరాడ్డుతో తలపై కొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన నెట్ సెంటర్ నిర్వాహకుడి గొంప నాగేశ్వరరావుపైనా దాడి చేశారు. అప్పటికే చుట్టుపక్కల ఉన్నవారు చేరుకోవడంతో ఆగంతకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఉడాయిస్తున్న వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని నాతవరం పోలీసులకు అప్పగించారు. అతడు నర్సీపట్నంకు చెందిన బండారు సంతోష్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఏడీబాబు, నెట్ సెంటర్ నిర్వాహకుడు నాగేశ్వరరావును నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు ఎవరితోనూ వివాదా లు లేవని, ఇటీవల లేట్రైట్ అక్రమాలపై కథనాలు రాయటంతో లేట్రైట్ మాఫియా తనపై హత్యాయత్నం చేయించిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ సీఐ రేవతమ్మ, నాతవరం ఎస్సైలు ఏడీ బాబు నుంచి వాగ్మూలం తీసుకున్నారు. దాడి ఘటనపై పూర్తి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలి ఏడీ బాబుపై హత్యాయత్నంకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గం కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. ఆగంతకుల దాడిలో తీ వ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబును పరామర్శించారు. ఏఎస్పీ ఐశ్వర్యరస్తోగిని కలిసి సంఘటనపై ఫిర్యాదు చేశా రు. విలేకరిపై దుండగులు చేసిన దాడిని వివరించి దోషులపై తక్షణం కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. దాడి వెనుక లేట రైట్ మాఫియా హస్తం ఉందనే అనుమానాన్ని ఏఎ స్పీ ఎదుట వ్యక్తం చేశారు. బాబును పరా మర్శించిన వారులో పార్టీ పట్టణ అధ్యక్షులు కోనే టి రామకృష్ణ, గొలుసు నర్సింహమూర్తి ఉన్నా రు. అలాగే ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి రాము, జిల్లా శాఖ అధ్యక్షులు సీహెచ్బీఎల్ స్వామి, ఐజేయూ కౌన్సిల్ సభ్యు డు కె.రామకృష్ణ పరామర్శించారు. పత్రికా విలేకరిపై దాడులు సరైంది కాదన్నారు. దోషులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాల ఖండన విశాఖపట్నం:విధి నిర్వహణలో ఉన్న ‘సాక్షి’ నాతవరం మండల విలేకరి ఎ.డి.బాబుపై ఆరుగురు దుండగులు మంగళవారం రాత్రి హత్యాయత్నం చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బీరు సీసాలు, ఇనుప రాడ్లతో దాడి చేయడం దారుణమని, దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. రూరల్ విలేకరులకు రక్షణ లేకుండా పోయింది అక్రమాలను పసిగట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్న విలేకరులపై దాడులు చేయడం అమానుషం. నిస్వార్ధంగా పనిచేసే రూరల్ విలేకరులకు రక్షణ లేకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం రాజమండ్రిలో జర్నలిస్టుపై జరిగిన దాడిని మర్చిపోకముందే ‘సాక్షి’ విలేకరి బాబుపై హత్యాయత్నం జరగడం బాధాకరం. ఇలాంటివి పునరావృతం కాకుండా నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. –గంట్ల శ్రీనుబాబు, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు సంఘటితంగా ఎదుర్కోవాలి చాలా దారుణ సంఘటన ఇది. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు సర్వసాధారణంగా మారుతున్నాయి. జర్నలిస్టుల ఐక్యత చాటుకోవాల్సిన సమయమిది. దాడులను తిప్పికొట్టేందుకు జర్నలిస్టులందరూ సంఘటితం కావాలి. ‘సాక్షి’ విలేకరి ఎ.డి.బాబుపై దాడిని విశాఖ క్రైమ్ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (వీసీఆర్డబ్ల్యూఏ) ఖండిస్తోంది. –ఎమ్ఎస్ఆర్ ప్రసాద్, కార్యదర్శి, వీసీఆర్డబ్ల్యూఏ అరెస్టు చేయాలి సాక్షి విలేకరి ఎ.డి.బాబుపై దాడి చేసింది ఎంతటివారైనా క్రిమినల్ కేసు పెట్టి అరెస్టు చేయాలి. ఇలాంటి దారుణానికి ఒడిగట్టడానికి ఇంకెవ్వరూ ధైర్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. –కాళ్ల సుబ్బారావు, నేషనల్ జర్నలిస్టు ఫోరం సెక్రటరీ, నర్సీపట్నం