-
కబ్జా చేసి ప్రభుత్వానికే అమ్మేశారు..!
సాక్షి, చెన్నై: ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేయడమే కాకుండా రహదారి పనులకు ఆ స్థలాల్ని అప్పగించి నష్ట పరిహారంగా రూ. 200 కోట్లను ఓ రియల్టర్ మింగేశాడు. ఇద్దరు అధికారుల చేతి వాటంతో ఈ వ్యవహారం సాగి ఉండటంతో కేసును సీబీఐకు సిఫారసు చేస్తూ రెవెన్యూ కమిషనర్ పంకజ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. చెన్నై నుంచి పూందమల్లి– శ్రీపెరంబదూరు – కాంచీపురం – వేలూరు మీదుగా బెంగళూరు వైపు జాతీయ రహదారి సాగుతున్న విషయం తెలిసిందే. ఈ రహదారి పనులకు గతంలో స్థల సేకరణ జరిగింది. స్థలాల్ని ఇచ్చిన వారి నష్ట పరిహారాల చెల్లింపులు కూడా జరిగాయి. ఇందులో ఓ రియల్టర్ అధికారులతో కలిసి మాయాజాలం చేసి ఉండటం తాజాగా వెలుగులోకి వచ్చింది. రహదారి పనులకు, ఆ తదుపరి విస్తరణ పనులకు అంటూ సాగిన స్థల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున మోసం జరిగి ఉన్నట్టు తాజాగా బయట పడింది. శ్రీపెరంబదూరు ఆర్టీఓగా ఇటీవల చార్జ్ తీసుకున్న వెంకటేషన్ పరిశీలనలో స్థల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికే అమ్మి రూ. 200 కోట్లు శ్రీపెరంబదూరు సమీపంలోని బీమన్ తాంగల్ వద్ద ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికే అమ్మి ఉండటం ఆ పరిశీలనలో తేలింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ రహస్యంగానే సాగింది. శ్రీపెరంబదూరులో ఆర్టీఓగా పనిచేసి పదవీ విరమణ పొందిన రాధాకృష్ణన్, పూందమల్లి సెటిల్మెంట్ అధికారి షణ్ముగం గారడి బయట పడింది. ఈ ఇద్దరి రియల్టర్ అశీష్ మెహత ద్వారా తమ వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేయడమే కాకుండా, వాటిని ఆశీష్ మెహత పేరిట మార్చేసి, సెటిల్ మెంట్ సమయంలో సర్వే నెంబర్లను మార్చేసి పెద్ద మాయాజాలమే సృష్టించి ఉండడం బయట పడింది. అంతే కాదు, శ్రీ పెరంబదూరు పరిధిలో జాతీయ రహదారి ఆశీష్ మెహత అనేక చోట్ల స్థలాల్ని కేటాయించి ఉండటం, తద్వారా రూ. 200 కోట్లను నష్ట పరిహారంగా ప్రభుత్వం నుంచి తీసుకుని ఉండటం వెలుగు చూసింది. దీంతో ఈ వ్యవహాన్ని సీబీఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విచారణలో తమకు లభించిన ఆధారాలు, సమగ్ర వివరాలను సీబీఐకి పంపుతూ, ఈ కేసు విచారణకు స్వీకరించాలని రెవెన్యూ కమిషనర్ పంకజ్కుమార్ కోరడం గమనార్హం. చదవండి: చెన్నైలో రూ.70 కోట్ల హెరాయిన్ స్వాధీనం -
భూరాబంధులు
రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఈనాం, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. రాజకీయ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పలుకుబడి ఉన్నవారు దొంగ సర్వే నంబర్లతో నకిలీ పత్రాలు సృష్టించి దర్జాగా ఆక్రమిస్తున్నారు. ఇదేవిధంగా నగరం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విలువైన భూములపై భూ రాబందులు స్వైరవిహారం చేస్తున్నాయి. నకిలీ దస్తావేజులతో కోట్లాది రూపాయల విలువైన భూములను హస్తగతం చేసుకున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందిస్తున్న దాఖలాలు కానరావడంలేదు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆవ భూములు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చదరపు గజం ధర ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉంది. ఇక్కడే వెంకటేశ్వర హోల్సేల్ మార్కెట్ కూడా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూమి బంగారంతో సమానం. దీంతో కొంతమంది బడాబాబుల కన్ను ఈ భూములపై పడింది. అంతే.. సర్వే నంబర్ 327గా ఉన్న ఈ భూములకు అనుబంధంగా 612, 613, 614, 617, 618 సర్వే నంబర్లతో నకిలీ దస్తావేజులు సృష్టించి ఈ భూములను ఆక్రమించారు. వీరిలో ఓ మాజీ శాసనసభ్యుడు, నగరంలోని ప్రముఖ ఎముకల డాక్టర్, రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు, ఇతర ‘పెద్దలు’ ఉన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 87.87 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ వందల కోట్లు ఉంటుంది. వీటిల్లో అత్యధిక భాగం ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది. వెంకటేశ్వర జనరల్ మార్కెట్ వెనక ఆక్రమణలో ఉన్న భూములు ఆ భూముల కథ ఇదీ.. బ్రిటిషు వారి హయాంలో సర్వే నంబర్ 327, 330, 332, 465తో పాటు ఇంకా అనేక సర్వే నంబర్లలోని భూములను దేవాదాయ, ఈనాం కింద పలువురికి కేటాయించారు. ఈ సర్వే నంబర్లలో దాదాపు 22 ఎకరాలను షాహీ ఈనాం కింద ప్రథమ ఈనాందారు ఖాజా జహురుల్లా కుమారుడు దబీర్ మహ్మద్ గాలబ్, ఆయన కుమారులకు శాశ్వత వంశపారంపర్యంగా వచ్చింది. 1902 వరకూ రెవెన్యూ పత్రాల్లో వారి పేర్లున్నాయి. గోదావరికి పలుమార్లు వచ్చిన వరదల వల్ల ఆ భూములు మునిగిపోయాయి. బీఎస్ నంబర్లు 315, 316, 317, 318, 319, 332ఏ, 334, 342లలోని టైటిల్ డీడ్ భూములు, బీఎస్ నంబరు 333బి జిరాయితీ డ్రై, 317ఏ కాలువ, 315 కుంట, 333ఎ, బి ఆవ వెరసి.. 87.87 ఎకరాల భూమిలో దుబ్బు పెరిగిపోయింది. దీంతో వాటిని కొలవడానికి వీలులేదని విలేజ్ నంబర్ 66 డైగ్లాడ్(పాత రికార్డు)లో స్పష్టంగా పేర్కొన్నారు. అందుచేత ఈ సర్వే నంబర్లలోని 87.87 ఎకరాల భూమిని సర్వే నంబర్ 327గా నమోదు చేసినట్లు చూపారు. ఇదే ఆక్రమణదారులకు అవకాశంగా మారింది. ఆ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి, రకరకాల డివిజన్లు సృష్టించి, ఆ భూములను యథేచ్ఛగా ఆక్రమించారు. సర్వే నెంబర్ 327/11లో 2.2 ఎకరాల భూమి తమవని హెచ్చరిక బోర్డు పెట్టిన ఆక్రమణదారులు కల్లుగీత సొసైటీ భూముల కబ్జా సర్వే నంబర్ 327లో సుమారు 16 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలో కల్లుగీత కార్మికుల సొసైటీకి కేటాయించారు. వాటిపై దాదాపు 20 కుటుంబాలు ఆధారపడి జీవించేవి. అయితే ఈ భూములను ఓ మాజీ శాసనసభ్యుడు ఆక్రమించాడు. ఆయా భూములను క్రమబద్ధీకరించుకునేందుకు వివిధ కోర్టుల్లో దావాలు వేయగా అవన్నీ సదరు మాజీ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో సొసైటీ వారు, వారి వారసులు తమకు కేటాయించిన 16 ఎకరాలూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. కొంతమంది అధికారులు ఆ మాజీ శాసనసభ్యుడికి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై సొసైటీ సభ్యులు, ఈనాం భూముల వారసుదారులు కలిసి ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా అతీగతీ లేదు. తమకే ఇవ్వాలంటున్న బాధితులు 1902 రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 327లో 8.88 ఎకరాలు దబీర్ ఇమామ్ మొహిద్దీన్, కాశిమ్ సాహెబ్, ఫకీర్ సాహెబ్, మరో ముగ్గురికి కేటాయించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూములను సర్వే చేసి తమకు అప్పగిచాలని 1998లో వారి వారసులు జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్ ఏడున ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా దీనిపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 2000 సంవత్సరంలో చలనా కూడా తీశారు. వారసుల వద్ద పత్రాలు తీసుకున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోలేదు. 2015లో ‘మీ ఇంటికి – మీ భూమి’లో దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి పురోగతీ లేదు. ఆక్రమణదారుల నుంచి ఈనాం, దేవాదాయ భూములను కాపాడాలని, తమ భూములను తమకు కేటాయించాలని హక్కుదారులు విజ్జప్తి చేస్తున్నారు. భూ రికార్డులు గందరగోళం ఆవలో మొత్తం విస్తీర్ణం 87.87 ఎకరాలు. ఆ భూమిలో నీరు చేరి ఉండడం వల్ల కొలవడానికి వీలు లేకుండా ఉందంటూ రికార్డుల్లో ఉంది. అక్కడ అనేక వివాదాలున్నాయి. సర్వే నంబర్లు సబ్ డివిజన్ అయ్యాయి. సర్వే నంబర్ 327లో 19.20 ఎకరాలు వెబ్లాండ్ రికార్డు ప్రకారం ఇళ్లస్థలాలుగా కనిపిస్తోంది. 87.87 ఎకరాలపై పూర్తిస్థాయిలో సర్వే చేస్తేనే కానీ ఎవరి భూమి ఎవరిదో చెప్పలేం. అక్కడ ఒక్కో సర్వే నంబర్లోని భూమిపై నాలుగైదు యాజమాన్య హక్కు పత్రాలున్నాయి. – కె.పోశయ్య, తహసీల్దార్, రాజమహేంద్రవరం రూరల్ -
పరిహారం చెల్లించకపోతే.. రైలు వారిదే..
సొంతంగా కార్లు, బస్సులు, విమానాలు ఉన్నావారిని చూశాం. సొంతంగా రైలు ఉన్న వారినెక్కడైనా చూశారా. హిమాచల్ ప్రదేశ్కు చెందిన మేలా రాం, మదన్ లాల్ అనే ఇద్దరు రైతులకు సర్కారీ రైలును దక్కించుకునే ఛాన్స్ వచ్చింది. అయితే వారి ట్రైన్ దక్కుతుందా, లేదా అనేది రైల్వేశాఖపై అధారపడివుంది. అన్నీ సవ్యంగా జరగకపోతే ఈ ఇద్దరు రైతులకు రైలు యోగం పట్టనుంది. అవును నిజమే... ఏప్రిల్ 16వ తేదీలోపు బాధిత రైతులిద్దరికీ పరిహారం చెల్లించడంలో రైల్వే శాఖ విఫలమైతే ఢిల్లీ - యున జనశతాబ్ది రైలు వారి సొంతమవుతుందని కోర్టు తీర్పు చెప్పింది. రైల్వేట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు సుమారు రూ. 35 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒక వేళ గడుపులోపు ఆ మొత్తాన్ని చెల్లించడంలో రైల్వే శాఖ విఫలమైతే ఢిల్లీ - యున జనశతాబ్ది రైలును ఆ ఇద్దరి రైతులకు అప్పగించాలని చేయాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెడితే యునా జిల్లాకు వీరు 1998 లో జరిగిన రైల్వే ట్రాక్ నిర్మాణంలో రామ, మదన్ లాల్ భూములను కోల్పోయారు. దీంతో తమ భూములను కోల్పోయామని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతో కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై 2009లో రామ్ కు ఎనిమిది లక్షలు, మదన్ లాల్ కు సుమారు 27 లక్షల పరిహారం చెల్లించాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇంత భారీ పరిహారం చెల్లించలేమంటూ రైల్వే అధికారులు అప్పీలు కెళ్లారు. దీంతో పరిహారాన్ని తగ్గిస్తూ 2011లో తీర్పు వెలువడింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు కెళ్ళారు రైతులు. అయితే ఈ తీర్పుపై స్టే విధించిన హైకోర్టు , దీనిపై మూడు నెలల్లోపు అప్పీలు చేసుకునే అవకాశంతో పాటు, ఆరువారాల్లో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సిందిగా 2013లో రైల్వే శాఖను ఆదేశించింది. కానీ ఇప్పటికీ ఆ డబ్బును డిపాజిట్ చేయడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.దీంతో ఆగ్రహించిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించడంలో జరుగుతున్న జాప్యంపై మళ్ళీ కోర్టుకెళ్లారు. దీనిపై స్పందించిన యునా జిల్లా అడిషనల్ , సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ బన్సాల్ ఈ అరుదైన తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 16 వ తేదీలోపు సుమారు రూ. 35 లక్షల పరిహారం రైల్వే శాఖ చెల్లించాలని లేనిపక్షంలో ఏప్రిల్ 16 నుంచి రైలు ను నిలిపివేయాలని ఆదేశించింది. ఢిల్లీ - యున జనశతాబ్ది రైలు ఆ ఇద్దరి రైతుల సొంతమవుతుందని కోర్టు తేల్చి చెప్పింది.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు
ముంబైలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..
కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?
చెలరేగిన విండీస్ బ్యాటర్లు.. పసికూన ముందు భారీ టార్గెట్
Gunshot: ఓడినా గెలిచాడు YS Jagan
బేగంపేటలో వ్యక్తి దారుణ హత్య..
ఈఎంఐల్లో లంచాలు
సెంట్రల్ క్యాబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట
మహాత్మునికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
Advertisement