breaking news
Kushita Kallapu
-
OTT: ‘త్రీ రోజెస్ సీజన్ 2’ రివ్యూ
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్ సీజన్ 2’. 2021లో ఆహాలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన త్రీ రోజెస్ వెబ్ సిరీస్కి సీక్వెల్ ఇది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి త్రీ రోజెస్ సీజన్ 3 ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. (3 Roses Season 2 Review)కథేంటంటే.. రీతూ అలియాస్ రిత్విక (ఈషా రెబ్బా), మేఘన (రాశి సింగ్) , సృష్టి (కుషితా కల్లపు) ముంబైలో ఒకే హాస్టల్ ఉంటారు. సమీర్తో బ్రేకప్ తర్వాత రీతూ కెరీర్పై ఫోకస్ పెడుతుంది. వీరభోగ వసంత రాయలు(సత్య)తో విడాకులు తీసుకున్న మేఘన.. ఆ విషయం ఇంట్లో తెలియకుండా మ్యానేజ్ చేస్తూ మాజీ భర్త ఇచ్చిన భరణంతో లైఫ్ లీడ్ చేస్తుంది. సృష్టికేమో కొరియన్ డ్రామాల పిచ్చి. ప్రతీది కొరియన్ కళ్లతోనే చూస్తుంది. ఈ ముగ్గురు కలిసి ఓ యాడ్ ఏజెన్సీ పెడతారు. కానీ వారికి ఒక్క యాడ్ కూడా రాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెడిసి కొడతాయి. చివరగా వీరికి ప్రసాద్(హర్ష చెముడు) గోల్డ్ జ్యూవెలరీకి సంబంధించిన యాడ్ ఇవ్వడానికి వస్తాడు. ప్రసాద్ ఎంట్రీతో ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పేంటి? వీరిని ట్రాప్ చేయాలనుకున్న వారి నుంచి ఈ ముగ్గురు అమ్మాయిలు ఎలా బయటపడ్డారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. విశ్లేషణతమకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకునే ముగ్గురు అమ్మాయిల కథ ఈ సిరీస్. అమ్మాయిల స్వేచ్ఛ, సాధికారతల గురించి ఈ సిరిస్లో వినోదాత్మకంగా చర్చించారు. ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అని తెలుసుకొని.. ఫేక్ బంధాల నుంచి బయటపడటంలోనే అసలైన ఆనందం ఉంటుంది అంటూ మంచి సందేశం అందించారు.సీజన్ 2లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా..ప్రస్తుతానికి మాత్రం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొదటి ఎపిసోడ్లో ప్రధాన పాత్రల పరిచయం మాత్రమే ఉంటుంది. ఇక రెండో ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. సీజన్ 1 లాగే సీజన్ 2లో కూడా కామెడీ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు. అయితే సీజన్ 1లో ముగ్గురు యువతులకు వేరు వేరు సమస్యలు ఉండగా...ఇందులో ముగ్గురు కలిసి ఒకే సమస్యను ఎదుర్కొంటారు.సొంతకాళ్లపై బతికేందుకు ముగ్గురు అమ్మాయిలు యాడ్ ఏజెన్సీ ఏర్పాటు చేయడం.. ఈ క్రమంలో గతంలో రిలేషన్షిప్లో ఉన్నవారే మళ్లీ రీతూ లైఫ్లోకి రావడం... మరోవైపు ఒంటరిగా ఉన్న అమ్మాయిల బలహీనలతను ఆసరాగా చేసుకొని.. తమకి అనుకూలంగా మార్చుకునేవాళ్లు.. ఈ క్రమంలో వచ్చే సీన్లన్నీ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇందులో మంచి సందేశం ఇచ్చారు. ఏది ప్రేమ, ఏది వ్యామోహమో తెలియకుండా ఎలా మోసపోతున్నారనేది చూపించిన తీరు బాగుంది. నాలుగు ఎపిసోడ్స్ ఇంకా రిలీజ్ కాలేదు..కాబట్టి పూర్తి కథనం చూసిన ఫీలింగ్ రాలేదు. రొటీన్ కథే అయినా.. కథణం బాగుంటుంది. నటీనటుల విషయానికొస్తే.. ప్రధాన పాత్రల్లో నటించిన ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపు కూడా చాలా బాగా నటించారు. గ్లామర్ పరంగాను అలరించారు. సత్య కామెడీ నవ్వులు పూయించింది. ఇక అమ్మాయిల పిచ్చి ఉన్న పాత్రలో ప్రభాస్ శ్రీను కూడా తన పరిధిమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. వైవా హర్షతో పాటు మిగిలినవారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్కి ప్లస్ అయింది. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్గా కనబడుతుంది. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ మూవీ రివ్యూ
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న రాజ్ తరుణ్.. ఈ మధ్య డీలా పడిపోయాడు. ఆయన ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. గతేడాదిలో వచ్చిన తిరగబడరా సామీ మూవీ డిజాస్టర్గా మిగిలిపోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్.. ‘చిరంజీవ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. రాహుల్ అవురెడ్డి, సుమాసిని రాహుల్ నిర్మించిన ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. నేటి(నవంబర్ 7) నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటి?రాజ్తరుణ్ అంబులెన్స్ డ్రైవర్. దేవుడిపై పెద్దగా నమ్మకం ఉండదు. మనోడి క్యారెక్టర్ నచ్చి హీరోయిన్ కుషిత కల్లపు ప్రేమలో పడిపోతుంది. ఓ రోజు అంబులెన్స్లో వెళ్తుంటే రాజ్ తరుణ్కి యాక్సిడెంట్ అవుతుంది. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు కొన్ని శక్తులు వస్తాయి. మనుషుల తలపై ఓ మీటర్ కనబడుతుంది. అందులో ఆ వ్యక్తి ఆయుష్షు ఎంతవరకు ఉందో కనిపిస్తుంది.తనకు వచ్చిన ఈ స్పెషల్ పవర్స్ని ఉపయోగించి అప్పుల బాధల నుంచి బయటపడతాడు. తన ప్రియురాలి ఫ్యామిలీని కూడా సేవ్ చేస్తాడు. ఇలా జీవితం హాయిగా గడుపుతున్న రాజ్ తరుణ్కి.. ఓ రోజు మార్కెట్లో చాలా మంది పిల్లలను కనిపిస్తారు. వారందరి ఆయుష్షు ఆ రోజే ముగిసిపోతుందనే విషయం తెలుస్తుంది. అసలు ఆ పిల్లలు ఎవరు? ఎందుకు వచ్చారు? వాళ్లంతా చనిపోతారనే విషయం తెలిసిన తర్వాత రాజ్ తరుణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? వాళ్లను రక్షించేందుకు ఏం చేశాడు? అసలు ఈ స్పెషల్ పవర్స్ ఆయనకు ఎందుకు వచ్చాయి? చివరకు తనకున్న పవర్స్తో వారిని రక్షించాడా లేదా? అనేది తెలియాలంటే ఆహాలో సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..మన పక్కనున్న వ్యక్తి చనిపోతాడనే విషయం ముందే మనకు తెలిస్తే..అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి సంఘర్ణనకు లోనవుతారు? ఇలాంటి ఐడియాలు వినడానికే ఆసక్తికరంగా ఉంది. ఆ పాయింట్నే తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అదిరే అభి. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో ముందే తెలిసే స్పెషల్ పవర్ ఉన్న హీరో.. దాన్ని అడ్డుపెట్టుకొని ఎలా ఎదిగాడు. ఆ పవర్ కారణంగా ఎలాంటి ఒత్తిడికి లోనయ్యాడు? ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు? అనేది ఈ సినిమాలో చూపించాడు. సీరియస్ పాయింట్ని తీసుకొని దాన్ని ఫన్నీ వేలో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ అంతా సరదాగానే గడిసిపోతుంది. హీరోకి స్పెషల్ పవర్స్ వచ్చిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుడిలో నెలకొంటుంది. ప్రాణాలు కాపేందుకు హీరో ప్రయత్నం ఆకట్టుకునేలా ఉంటుంది. సెకండాఫ్లో కొన్ని చోట్ల సీరియస్ సీన్స్ వర్కౌట్ అయినా.. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి .వరుసగా వచ్చే ట్విస్టులు కథనంపై ఆసక్తిని పెంచుతాయి. క్లైమాక్స్ లో మరో వచ్చే సీన్లు ఉత్కంఠకి గురిచేస్తాయి. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ దాన్ని అంతే అద్భుతంగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్ని బలంగా రాసుకొని.. కథనంపై ఇంకాస్త దృష్టి పెడితే ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..రాజ్ తరుణ్ ఎప్పటి మాదిరే తన పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పూయిస్తూ..చాలా హుషారుగా కనిపించాడు. హీరోయిన్గా కుషిత కల్లపు పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. ఇమ్మాన్యుయెల్ కాసేపు కనిపించి నవ్వించాడు. సంజయ్ కృష్ణ, కిరీటీ, గడ్డం, రాజా రవీంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అచ్చు రాజమణి సంగీతం జస్ట్ ఓకే. ఎడిటింగ్ షార్ప్గా ఉంది. సినిమా నిడివి 1.50 గంటలే ఉండడం ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
రాజ్ తరుణ్ 'చిరంజీవ' చిత్రం ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
హార్దిక్ పాండ్యాతో ఫొటో..SRHvsMI మ్యాచ్లో నటి కుషిత కల్లపు (ఫొటోలు)
-
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)


