breaking news
Kusha Kapila
-
భారీగా బరువు పెరిగా.. 33 ఏళ్ల వయసులోనే ఆంటీ పాత్రలు వచ్చాయి : బాలీవుడ్ నటి
సినిమా తారలకు ఫిట్నెస్ చాలా అవసరం. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సివస్తోంది. కొంచెం బొద్దుగా కనిపించినా సరే.. వాళ్లను దూరం పెట్టేస్తుంటారు. అందుకే హీరోయిన్లు తమ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. బరువుని కంట్రోల్ చేసేందుకు డైటింగ్తో పాటు డేటింగ్ కూడా చేస్తుంటారు. అయినప్పటికీ వారి శరీరంపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి కుషా కపిల(Kusha Kapila) శరీరంపై కూడా నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ఉన్నపళంగా బరువు తగ్గడంపై రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై స్వయంగా కుషానే వివరణ ఇచ్చింది. తన బాడీ గురించి ఇతరులతో మాట్లాడాల్సిన అవరసం లేదని..తనకు నచ్చినట్లుగా తాను ఉంటానని చెబుతూనే ఎందుకు బరువు తగ్గాల్సి వచ్చింది వివరించింది.బరువు తగ్గడం నాకేమి కొత్తకాదు. స్కూల్ డేస్లో ఉన్నప్పుడే నేను బరువు పెరిగాను. దీంతో మా అమ్మ నన్ను జిమ్లో జాయిన్ చేయించడంతో మళ్లీ మాములు స్థితికి వచ్చాను. ఆ తర్వాత కాలేజీ రోజుల్లో మళ్లీ నా బరువు విపరీతంగా పెరిగింది. ఎందుకు అలా జరిగిందో తెలియదు. నా బాడీని పట్టించుకోకుండా నా కామెడీపైనే ఎక్కువ ఫోకస్ చేశాను. లెక్చర్లు కూడా నా చదువుని పట్టించుకోకుండా నా కామెడీని ఎంజాయ్ చేసేవాళ్లు. 22 ఏళ్ల వయసులో నేను చాలా బరువు పెరిగాను. దీంతో నా ఫ్రెండ్స్ ఫోటోలు షేర్ చేసి ‘ఇలా మారిపోయావేంటి?’ అని అడిగారు. వారి మాటలే నా జీవితాన్ని మార్చేశాయి. నా బాడీపై ఫోకస్ పెట్టాను. ఆరు నెలల్లో విపరీతంగా తగ్గిపోయాను. రోజుకు 800 క్యాలరీస్ కంటే తక్కువ ఆహారాన్ని తీసుకున్నాను. ఆ సమయంలో నా శరీరంలో భారీగా మార్పులు జరిగాయి. చాలా సన్నబడిపోయాను. 12 రోజుల పాటు జ్వరం వచ్చింది. కొన్నాళ్ల పాటు అన్నం కూడా తినలేదు. ఆస్పత్రికి వెళితే.. టీబీ అటాక్ అయిందని చెప్పారు. తక్కువ తినడం కారణంగానే టీబీ వచ్చిందని చెప్పారు. ఇమ్యునిటీ పవర్ పూర్తిగా తగ్గిపోయింది.టీబీ కారణంగా బరువు తగ్గినా.. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అంతలా నా మైండ్ మారిపోయింది. కానీ నేను 30 ఏళ్లకు వచ్చేసరికి.. పనిపై ఫోకస్ పెట్టి శరీరాన్ని పట్టించుకోవడం వదిలేశాను. డైట్ ఫాలో కాలేదు. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రం తీసుకున్నాను. ముంబైకి వెళ్లిన తర్వాత బరువు పెరగడం, తగ్గడం స్టార్ట్ అయింది. అయినా కూడా నేను నా పనిపైనే ఫోకస్ పెట్టాను. వైద్యులను సంప్రదిస్తే.. నీ లైఫ్స్టైల్ని పూర్తిగా మార్చుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి నేను మళ్లీ నా బాడీపై ఫోకస్ చేశాను.డైట్ ఫాలో అయ్యాను. 33 ఏళ్ల వయసులో నేను కాస్త లావుగానే ఉన్నాను. దీంతో 45-50 ఏళ్ల ఆంటీ పాత్రలే ఎక్కువ వచ్చాయి. అప్పట్లో ఆ పాత్రలు చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు అలా చేశానో ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు బరువు తగ్గడానికి కారణం కూడా సినిమా చాన్స్ల కోసమే. జిమ్ చేస్తూ డైట్ ఫాలో అవుతున్నాను. నా బాడీపై ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నాను. నా శరీరంతో నేను ఏదైనా చేస్తా. ఏం చేస్తున్నానని ఇతరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అని కుషా కపిల చెప్పుకొచ్చింది.కుషా కపిల కెరీర్ విషయానికొస్తే.. కామెడీ కంటెంట్తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లోనూ నటించారు. అనంతరం 2017లో కుషా కపిల.. జోరావర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకున్నారామె. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2023లో విడిపోయారు. -
ఆడవారిని మాత్రమే తప్పు పట్టడం అన్యాయం: కమెడియన్
కామెడీ కంటెంట్ క్రియేటర్ కుష కపిల గతేడాది జోరావర్ సింగ్ అహ్లువాలియా నుంచి విడాకులు తీసుకుంది. ఇది తన వ్యక్తిగత విషయం అయినప్పటికీ ఓ షోలో తన విడాకుల మీద సెటైర్లు వేశారు. అది భరించలేకపోయిందీ కమెడియన్. కామెడీ హద్దులు దాటొద్దని హెచ్చరించింది.అమ్మకు ఎక్కువ ఇబ్బందిఅయినప్పటికీ జనాలు ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నారని మండిపడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ సమాజం మహిళల పట్ల కాస్తయినా దయ చూపదు. విడాకుల వల్ల నాకన్నా మా అమ్మ ఎక్కువ ఇబ్బందిపడుతోంది. అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తోంది. అటు బంధువులకు ఇటు సమాజానికి వివరణ ఇస్తోంది.అన్యాయంనేనంటే బయట సాధారణంగా తిరగలేను, సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఇదంతా తప్పించుకోవచ్చు. కానీ అమ్మకు అలా కాదుగా.. తను సాధారణ జీవితం గడుపుతోంది. అందరూ నిర్మొహమాటంగా నా గురించి అడుగుతూ ఉంటే తను చెప్పలేక చెస్తోంది. ఈ సమాజం కాస్త మారింది. కానీ మారాల్సింది ఇంకా చాలా ఉంది. ఎప్పుడు ఏం జరగాలనేది మన చేతిలో లేదు కదా.. అయినా ఆడవారిని మాత్రమే తప్పు పట్టడం అన్యాయం, క్రూరం అని చెప్పుకొచ్చింది. చదవండి: ఫైట్స్ చేయడం సవాల్గా అనిపించింది: కావ్యా థాపర్ -
కామెడీ పేరుతో అవమానించారు, ఇంత నిర్దయగా ప్రవర్తిస్తారా?: నటి
కామెడీ పండించడం అంత ఈజీ కాదు. కానీ ఇది తనకు కొట్టిన పిండి అన్నట్లుగా అవలీలగా నవ్వులు పూయించగలదు కుశా కపిల. సోషల్ మీడియాతో స్టార్డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లో, ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’, ‘సెల్ఫీ’, ‘థాంక్యూ ఫర్ కమింగ్’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది. ఇటీవల ప్రెట్టీ గుడ్ రోస్ట్ షోలో పాల్గొంది.అది నా తప్పేఅక్కడ స్టాండప్ కమెడియన్లు తన మీద కుళ్లు జోకులు వేయడాన్ని సహించలేకపోయింది. తన వ్యక్తిగత విషయాలైన విడాకుల గురించి కూడా సెటైర్లు వేయడాన్ని తట్టుకోలేకపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ ఒకరు చెప్పారని ఆ షోకి వెళ్లాను. నన్ను ఈరేంజ్లో రోస్ట్ చేస్తారనుకోలేదు. వాళ్లు ఏం ప్లాన్ చేశారనేది ముందుగానే అడిగి తెలుసుకోవాల్సింది. నా ఫ్రెండ్ మీద నమ్మకంతో నేనా పని చేయలేదు. అది నా తప్పే!అందరి ముందు చులకనగాఅక్కడున్న ప్రేక్షకులు, సాంకేతిక నిపుణుల ముందు నన్ను చులకన చేసి మాట్లాడారు. నాపై వేసిన జోక్స్ కూడా నన్ను అవమానించేట్లుగా ఉన్నాయి. వీరికి మానవత్వమే లేదా అనిపించింది. కామెడీ పేరుతో ఒక మనిషిని ఇంత దారుణంగా హేళన చేయడం కరెక్ట్ కాదు. ఆ ఎపిసోడ్ ప్రసారం చేసేందుకు కూడా నా మనసు అంగీకరించలేదు. కానీ దాన్ని అడ్డుకుంటే నేను పిరికిదాన్నని ట్రోల్ చేసేవారు. అందుకే ఆ ఎపిసోడ్ ప్రసారం కానిచ్చాను.అదే గమనించాఅయితే నా తర్వాత షూట్ చేసిన ఎపిసోడ్లలో మాత్రం వారు హద్దులు దాటలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో నోటికొచ్చిన జోక్స్ వేయలేదు. ఈ ఆరు నెలల్లో నేను గమనించిందేంటంటే విడాకులు తీసుకున్న మహిళలను ఏమైనా అంటారు. వారిని విలన్లలాగా చూస్తారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కుష కపిల లైఫ్ హిల్ గయి అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది.చదవండి: నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్ -
World Laughter Day: మీ నవ్వుల చల్లదనాన్ని మంచుకొండ అప్పడిగింది...
ఒకరు జోక్ వేస్తే నవ్వడం చాలా వీజీ. నవ్వించడం మాత్రం నవ్వినంత ఈజీ కాదు. టోటల్గా చెప్పొచ్చేదేమిటంటే... నవ్వించడం అనేది అత్యంత కష్టతరమైన టాస్క్. ఈ నవ్వుల మహారాణులు మాత్రం అవలీలగా నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సం΄ాదించుకున్నారు.నిఫ్ట్ గ్రాడ్యుయేట్ అయిన కుష కపిల బిల్లీ మసి, సౌత్ దిల్లీ గర్ల్స్లాంటి క్యారెక్టర్లతో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఆమెకు 1.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నిత్యజీవిత సంఘటనల ఆధారంగా దిల్లీకి చెందిన డాలీసింగ్ కామేడినీ మేడ్ ఈజీ చేసింది. ముంబైకి చెందిన ప్రజక్తా కోలి కామెడీ వీడియోలు మోస్ట్ ΄ాపులర్ అయ్యాయి. అబ్జర్వేషనల్ కామెడీకి ఆమె వీడియోలు అద్దం పడతాయి. కోలికి యూట్యూబ్లో 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. స్టాండ్–అప్ కమెడియన్గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ప్రశస్తి సింగ్. అమెజాన్ ప్రైమ్ వీడిమో సిరీస్ ‘కామిక్స్థాన్’ సూపర్ హిట్ అయింది. ఎంబీఏ చేసిన ప్రశస్తి ‘నవ్వించడం’ తన ΄్యాషన్ అంటోంది. వీరు మాత్రమే కాదు కనీజ్ సుర్క, శ్రిష్ఠి దీక్షిత్, నిహారిక ఎన్ఎం, సుప్రియ జోషి, సుముఖి సురేష్, ఐశ్వర్య మోహన్రాజ్, సుమైర... లాంటి ఎంతోమంది నవ్వుల ప్రపంచంలో మహారాణులుగా వెలిగి΄ోతున్నారు. -
ఎందెందు వెదికినా కరివేపాక్ కలదు
‘కరివేపాకులా తీసేయకు’ అని అంటాంగానీ ‘కరివేపాక్ మైసూర్పాక్ కంటే మహాగ్రేట్ సుమీ’ అంటుంది సోషల్ మీడియా ఫేమ్ కుశల కపిల. ఫ్యాషన్ ఎడిటర్, ఎంటర్టైన్మెంట్ రైటర్, కామెడీ కంటెంట్ క్రియేటర్గా ప్రతిభ చాటుకున్న కుశల తాజాగా కరివేపాకుపై దృష్టి పెట్టింది. ‘ఇందు గలదు. అందు లేదు అనే సందేహం వలదు’ టైప్లో కపిల కరివేపాకు గురించి ఇన్స్టాగ్రామ్ ‘రీల్’ చేసింది. ఈ రీల్ 8 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకోవడమే కాదు ‘కడి పట్ట’ ట్రెండ్గా వైరల్ అయింది. -
సోషల్ మీడియా సెన్సేషన్ కుశా కపిలా గురించి ఈ విషయాలు తెలుసా?
కుశా కపిలా... సోషల్ మీడియాతో స్టార్డమ్ తెచ్చుకున్న నటి. కామెడీ కంటెంట్తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ వచ్చిన ఫాలోయింగ్తో సినీ అవకాశాలను సొంతం చేసుకుంది. అలా సినిమాలతో పాటు వరుస వెబ్ సిరీసుల్లోనూ నటిస్తోన్న ఆమె గురించి కొన్ని విషయాలు.. కుశా కపిలా.. న్యూఢిల్లీకి చెందిన పంజాబీ అమ్మాయి. ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ చేసింది. చదువు పూర్తికాగానే.. ఫ్యాషన్ రంగంలోనే పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. కొంత కాలం కాపీ రైటర్గానూ పని చేసింది. ఆ తర్వాత ‘ఐదివా’ అనే ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా చేరింది. సోషల్ మీడియాలో ఢిల్లీ పంజాబీ గాసిప్ ఆంటీ ‘బిల్లీ మాసి’ అనే పాత్రను క్రియేట్ చేసి.. నటించింది. దాంతో కుశా పాపులర్ అవడమే కాక సోషల్ మీడియా సెన్సేషన్గానూ మారింది. ‘సన్ ఆఫ్ అబిష్’ అనే టీవీ షోతో బుల్లితెర ప్రవేశం చేసింది. నటనపై ఉన్న ఆసక్తితో ‘ఘోస్ట్ స్టోరీస్’తో వెబ్ తెరపైనా మెరిసింది. అమెజాన్ ఒరిజినల్ కామెడీ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’లో కీలక పాత్ర పోషించి సినిమా ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ‘సెల్ఫీ’, ‘థాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాల్లోనూ నటించింది. ∙ ప్రస్తుతం ‘మైనస్ వన్: న్యూ చాప్టర్’, ’సోషల్ కరెన్సీ’ వెబ్ సిరీస్లతో అలరిస్తోంది. జీవితంలో ఎన్నో అవమానాలు, విమర్శలను ఎదుర్కొంటేనే మనకేం కావాలో తెలుస్తుంది. – కుశా కపిలా