breaking news
kunuru
-
హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి
Live Updates: 06:10 PM హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి చెందినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident. — Indian Air Force (@IAF_MCC) December 8, 2021 05:45 PM రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్ని పర్యటనలు రద్దు చేసుకున్నారు. మహారాష్ట్రలోని కొత్త దర్బార్ హాల్ను ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి హాజరుకావాల్సి ఉంది. ప్రస్థుత పరిస్థితుల దృష్ట్యా పర్యటనను రద్ధు చేసుకున్నట్లు సమాచారం. 05:18 PM ►సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ భేటీ జరగనుంది. ప్రధాని మోడీ నివాసంలో సిసిఎస్ సమావేశం జరగనుంది. 05:03 PM హెలికాప్టర్లో 14 మంది ప్రయాణం చేస్తుండగా, 13 మంది మృతిచెందారు. ప్రమాదంలో రావత్ భార్య మధులిక కన్నుమూశారు. సీడీఎస్ బీపీన్ రావత్ గాయాలతో బయటపడ్డారు. హుటాహుటిన రావత్ను ఆసుపత్రికి తరలించారు. వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో రావత్కు చికిత్స అందిస్తున్నారు. 04:50 PM ►బిపిన్ రావత్కు అత్యవసర చికిత్స 04:20 PM ►సూలూరు ఎయిర్బేస్కు బయల్దేరిన ఎయిర్ చీఫ్ మార్షల్ ►కాసేపట్లో సూలూరు ఎయిర్బేస్కు ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరి 04:10PM ►హెలికాప్టర్ ప్రమాదంపై గురువారం పార్లమెంట్లో ప్రకటన ►ప్రమాద ఘటనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న రక్షణ శాఖ మంత్రి 03:50PM సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తనకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం బిపిన్రావత్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 03:44PM ►బిపిన్రావత్ ఇంటికి కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ 03:34PM ►ప్రమాదానికి వాతావరణం కానీ, సాంకేతిక లోపం కానీ కారణమై ఉండొచ్చని ఎక్స్ ఎమ్ఐ-17 పైలెట్ అమితాబ్ రంజన్ అన్నారు. 03:25PM హెలికాప్టర్ ప్రమాదంపై సందేహాలు.. 1. ప్రతికూల వాతావరణమా? 2. సాంకేతిక లోపలా..? 3. హెలికాప్టర్ విద్యుత్ తీగలకు తాకిందా..? 4. తక్కువ ఎత్తులో ప్రయాణించిందా..? 5. విజిబులిటీ లేకపోవడమా..? 03:20PM ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. పెద్ద శబ్దాలు వినిపించడంతో ఏం జరిగిందో చూడటానికి ఇంటి నుంచి బయటకు రాగా ఛాపర్ చెట్టును ఢీ కొంటూ, మంటలు చెలరేగడం, మరో ముగ్గురుని ఢీ కొట్టడం కళ్లారా చూశాను. వెంటనే ఇరుగుపొరుగువారికి, అధికారులకు సమాచారం అందించాను. ప్రమాద సమయంలో హెలికాప్టర్ నుంచి అనేక మృతదేహాలు పడటం చూశాను. 03:15PM ►కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సమావేశం అనంతరం ఘటనాస్థలికి వెళ్లనున్న రాజ్నాథ్ 03:05PM వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే ఓ హోటల్ సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గురైన హెలీకాప్టర్లో సీడీఎస్ బిపిన్రావత్తో సహా ఆయన భార్య మధులిక, మరికొందరు కుటుంబసభ్యులు, సీడీఎస్ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన సహాయ సిబ్బంది ముగ్గురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగతా 11 మంది దుర్మరణం పాలైనట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది. హెలికాప్టర్ సామర్థ్యం 24 మంది. 02:53PM తమిళనాడు సీఎం ఆరా.. హెలికాప్టర్ ప్రమాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 02:23PM కేబినెట్ భేటీ.. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందన్న విషయం తెలిసిన వెంటనే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అయ్యింది. 02:04PM ప్రధాని సమీక్ష.. హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రమాద వివరాలను మోదీకి వివరించారు. స్పందించారు. రాజ్నాథ్ సింగ్ ప్రమాదం గురించి పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. Tamil Nadu Army Helicopter Crash Telugu Live Updates: తమిళనాడులో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ కూనూరు వద్ద అటవీ ప్రాంతంలో కుప్ప కూలింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో మొత్తం 14 మంది ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. కాగా, భారత వాయుసేన ప్రమాదాన్ని అధికారంగా ధ్రువీకరించింది. విచారణకు ఆదేశించింది. -
కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 13 మంది మృతి
Tamil Nadu Army Helicopter Crash Video: బుధవారం తమిళనాడు కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. 2019లో ఆయన సీడీఎస్గా నియమితులయ్యారు. డిఫెన్స్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్(డీడబ్లు్యడబ్ల్యయే) అధ్యక్షురాలిగా మధులిక సేవలనందిస్తున్నారు. రావత్ మరణాన్ని భారత వైమానిక శాఖ(ఐఏఎఫ్) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది. ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే బతికి బయటపడ్డారని, ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మరణించినవారిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం వెల్లింగ్టన్లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి అవశేషాలను కోయంబత్తూర్ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకుపోనున్నట్లు పోలీసు, రక్షణవర్గాలు తెలిపాయి. శుక్రవారం వీరికి ఢిల్లీ కంటోన్మెంట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ‘‘ దుర్ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా 11 మంది మరణించారని తెలిపేందుకు విచారిస్తున్నాం’’ అని వైమానిక శాఖ ట్వీట్ చేసింది. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్లో ప్రసంగించేందుకు రావత్ రావాల్సిఉంది. ఇదే కాలేజీలో రావత్ గతంలో విద్యాభ్యాసం చేశారు. చదువుకున్న చోటికి వెళ్తూ మృత్యు ఒడిలోకి రావత్ చేరటం విధివైపరీత్యం. ప్రమాదంలో బతికిబయటపడ్డ వరుణ్ సింగ్ ఈ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. (చదవండి: త్రివిధ దళాలకు డీఆర్డీఓ వ్యవస్థలు) మృతుల్లో రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కే సింగ్, నాయక్ గురుసేవక్సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్నాయక్ వివేక్, లాన్స్ నాయక్ బీ సాయితేజ, హవల్దార్ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్ ఉన్నారని అధికారులు చెప్పారు. వీరిలో సాయితేజ ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. బిపిన్కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. బిపిన్ మరణంతో సైనిక దళాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. ఆయన వ్యూహాలను, సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాయి. 2016–2019 కాలంలో ఆయన ఆర్మీ చీఫ్గా పనిచేశారు. అనంతరం రక్షణబలగాల ఉమ్మడి అధిపతిగా నియమితులయ్యారు. రావత్ మరణంపై ఆర్మీ చీఫ్ నరవణె, తదితర ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రావత్ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆర్మీ ట్వీట్ చేసింది. సీసీఎస్ అత్యవసర సమావేశం రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ క్రాష్ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశమైంది. ఇందులో ప్రధాని, రక్షణ; హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యులతో పాటు కేబినెట్ సభ్యులు రావత్ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాద వివరాలను రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్, ప్రధాని మోదీకి వివరించారు. ఐఏఎఫ్ చీఫ్ను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. తదనంతరం రాజ్నాధ్ ఢిల్లీలోని రావత్ నివాసానికి వెళ్లి రావత్ కుమార్తెను పరామర్శించారు. రావత్ గొప్ప సైనికుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రావత్ మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాద సంఘటనపై శుక్రవారం రాజ్నాధ్ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. (చదవండి: కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం) ఇలా జరిగింది... ►ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి రావత్ తదితరులు బుధవారం ఉదయం 9గంటలకు బయలుదేరారు. ►ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ ఎయిర్బేస్కు చేరారు. ►11.45 గంటలకు రావత్ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్ సూలూర్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయింది. 45 నిమిషాల్లో వెల్లింగ్టన్లోని స్టాఫ్కాలేజీకి చేరాల్సిఉంది. ►మధ్యాహ్నం సుమారు 12.20 గంటలప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రమాదస్థలానికి 8 అంబులెన్సులు, వైద్య బృందాలు చేరుకున్నాయి. ►నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో ఛాపర్ కూలిపోయింది. స్థానికులు తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించారు. ►పొగమంచు వాతావరణంలో ఛాపర్ బాగా కిందకు వచ్చిందని, కూనూర్ సమీపంలోని ఒక లోయలో కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ►ఘటనా స్థలికి చేరేటప్పటికే మంటలు ఛాపర్ను ఆక్రమించాయని తెలిపారు. ►కూలిపోయే సమయంలో ఒక ఇంటిని హెలికాప్టర్ గుద్దుకుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ►ఛాపర్ నుంచి ఇద్దరు వ్యక్తులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షి పెరుమాళ్ చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని చెట్లు ధ్వంసం అయ్యాయి. ►ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా ఉపయోగం లేకపోయింది. ►ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి, పరిసరాల్లోని చెట్లుచేమా తగలబడ్డాయి. వీటిని ఆర్పేందుకు అక్కడివారు యత్నించారు. ►మంటలు అదుపులోకి వచ్చాక చూస్తే ప్రయాణీకులు మరణించినట్లు తెలిసింది. ►గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు. ►మధ్యాహ్నం 1.53 గంటలకు రావత్ మరణాన్ని ఐఏఎఫ్ అధికారికంగా ధృవీకరించింది. ►సాయంత్రం 6.03 గంటలకు మరణవార్తను ఐఏఎఫ్ ప్రకటించింది. ఉలిక్కిపడ్డ పశ్చిమ కనుమలు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రావత్ పయనిస్తున్న హెలికాప్టర్ కూలిన దుర్ఘటనతో పశ్చిమ కనుమలు ఉలిక్కిపడ్డాయి. నీలగిరి జిల్లాలోని తేయాకు తోటల్లోని కార్మికులు తొలిసారి ఈ దుర్ఘటనను గుర్తించారు. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించడాన్ని గమనించారు. చప్పుళ్లు ఏదో ప్రమాదానికి సంకేతమని గుర్తించి వెంటనే సంఘటనా స్థలాన్ని వెతుకుతూ వెళ్లారు. అప్పటికింకా ఆ ప్రాంతంలో కొంత పొగమంచు ఉంది. అక్కడకు వెళ్లాక భగభగలాడే మంటలు, లోహవస్తువులు విరిగిపోతున్న ధ్వనులను గుర్తించి నివ్వెరపోయారు. ప్రమాదం జరిగిందని స్థానికులు సాయం చేసేందుకు తయారయ్యారు. పెద్ద మంటల కారణంగా సంఘటన స్థలం దగ్గరకు పోలేకపోయారు. దాదాపు అరగంట పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయని సాక్షులు చెప్పారు. -
చిత్తూరు జిల్లాలో ఏనుగల బీభత్సం
-
కుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లా ప్రజలను ఏనుగులు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా కుప్పం మండలం కూనూరు, నెర్నిపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలపై దాడి చేయటంతో భారీగా పంట నష్టం జరిగింది. ఏనుగులు గ్రామాల్లో సైతం చొరబడటంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు ఏనుగులను తమిళనాడు వైపు తరిమేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గత మూడు నెలలుగా కుప్పం నియోజకవర్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి.