Ksheerarama
-
పంచారామాలలో ప్రసిద్ధం : క్షీరారామం
పూర్వం ‘‘ఉపమన్యుడనే బాల భక్తుడు పాలకై పరమేశ్వరుని ప్రార్థించగా, శివుడు కరుణించి తన త్రిశూలాన్ని అక్కడి నేలపై గుచ్చాడట. అప్పుడు ఆ ప్రదేశం నుంచిపాలు ఉద్భవించాయని, అందుకే దీనికి ‘క్షీరపురం’,పాలకొలను’’ అన్న పేర్లు కలిగాయని, అలాగే ఆ బాలభక్తుడి పేరు మీదుగా ‘ఉపమన్యుపురం’ అనే పేరు వచ్చిందని పండితుల వాక్కు. అదే నేటి పాలకొల్లు.ఆలయ విశేషాలు...క్షీరారామంలో వెలసిన స్వామి శ్రీ క్షీరా రామలింగేశ్వరుడు. తెల్లగా పాల వలె మెరిసే ఈ శివలింగం రెండున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శివలింగంపై ఉన్న నొక్కులు కుమారస్వామి అమృత లింగాన్ని భేదించినపుడు తగిలిన బాణపు దెబ్బలని భక్తుల విశ్వాసం. ఈ శివలింగం పై భాగం మొనతేలి ఉండటంతో ఇది శివుడి కొప్పు భాగాన్ని సూచిస్తోందని పెద్దల వాక్కు. కాగాశాసనాల్లో ఈ స్వామిని ‘కొప్పు లింగేశ్వరుడు’గా పేర్కొనటం విశేషం. ప్రతి ఏడాదీ ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల్లో సూర్యోదయ సమయాల్లో, భానుడి కిరణాలు పెద్దగోపురం రెండో అంతస్థు నుంచి ప్రాకారాల మధ్యగా క్షీరా రామలింగేశ్వర లింగంపై ప్రసరించటం విశేషం.చదవండి: సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్! పెద్దగోపురం...దేవాలయానికి శిఖరం–శిరస్సు, గర్భాలయం–కంఠం, ధ్వజస్తంభం–జీవం కాగా గోపురం పాదం లాంటిదని ఆగమశాస్త్రం చెబుతోంది. ఎంతో పురాణ, చారిత్రక ప్రాశస్త్యం, అద్భుత శిల్పకళ కలిగిన శ్రీ క్షీరారామలింగేశ్వరాలయ గోపురం పాలకొల్లు పెద్దగోపురంగా ప్రసిద్ధి పొందింది. ఇది సుమారు 120 అడుగుల ఎత్తు కలిగి 9 అంతస్థులతో గోపురం చివరిదాకా వెళ్లేందుకు అనువుగా లోపలి వైపు మెట్లు కలిగి ఉంది. ఈ గోపురం మీది ఎన్నో అద్భుత శిల్పాలు చూపరులను కట్టి పడేస్తాయి.ఉత్సవాలు...ఈ క్షేత్రంలో ఉగాది, చైత్రశుద్ధ దశమినాడు స్వామి వార్ల కళ్యాణాలు, చైత్రశుద్ధ ఏకాదశినాడు రథోత్సవం, వినాయక చవితి, శరన్నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి, కార్తీకమాస అభిషేకాలు, జ్వాలా తోరణం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, ముక్కోటి, లక్ష కుంకుమ, బిల్వార్చనలు, కోటి బిల్వార్చనలు, సహస్ర ఘటాభిషేకాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఇవి కాక ఆయా సందర్భాలలో మరెన్నో విశేషపూజలు, ఉత్సవాలు జరుగుతాయి. మహా శివరాత్రి నాడు శ్రీ పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర, లక్ష్మీ జనార్ధనుల ఊరేగింపు రంగురంగుల విద్యుద్దీప కాంతుల నడుమ సాంçస్కృతిక వేడుకలతో కన్నుల పండుగగా జరుగుతుంది. పర్వదినాల్లో భక్తి, భజన కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, పురాణ ప్రవచనాలు జరుగుతాయి.– డి.వి.ఆర్. -
పంచారామాలు... ప్రసిద్ధ క్షేత్రాలు
భీమవరం(ప్రకాశం చౌక్)/పాలకొల్లు సెంట్రల్: కార్తీకమాసం తొలి సోమవారానికి పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామక్షేత్రాలైన భీమవరం గునుపూడి లోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆల యం (సోమారామం), పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం) ముస్తాబయ్యాయి. భీమవరంలో క్షేత్రానికి వేకువజాము నుంచి భక్తుల తాకిడి ఉంటుందని, సుమారు 50 వేల మంది భక్తులు వస్తా రనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ ఎం.అరుణ్కుమార్ తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశామని, ఉచిత దర్శనంతో పాటు రూ. 50, రూ.100 ప్రత్యేక దర్శనా లు కల్పిస్తామన్నారు. ఆలయం వెనుక వైపు స్వామికి అభిషేకాలు, కార్తీక నోములు నోచు కునే ఏర్పాట్లు చేశామన్నారు. అన్నదాన కమి టీ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తామని, పోలీసు, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఆదివారం అధిక సంఖ్యలో.. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. క్షీరారామం.. శోభాయమానం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మన్ కోరాడ శ్రీనివాసరావు, ఈఓ యాళ్ల సూర్యనారాయణ ఆదివారం ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం వెలుపల ప్రాకారం లోపల ఉన్న గోశాల వద్ద కార్తీక దీపాలు వెలిగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్లు ఆంజనేయస్వామి ఆలయం పక్కన, సర్వదర్శనం క్యూలైన్లు దేవస్థానం కార్యాలయం పక్కనున్న మండపం వద్ద కేటాయించారు. ప్రసాదం విక్రయాలను ప్రత్యేక క్యూలైన్ పక్కన అలాగే సేవా సంస్థలు, దాతలు పా లు, ప్రసాదాలను ఆలయం బయట ఉత్తరం గేటు వద్ద భక్తులకు అందించేలా చర్యలు తీసుకున్నారు. వేకువజామున కార్తీక దీపాలు వెలిగించడంతో పాటు దీప, ఉసిరి, సాలగ్రామ, వస్త్ర, గోదానాలు ఇచ్చే భక్తుల కోసం ఆలయ ఉత్తర భాగంలో గోశాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. పంచారామ యాత్రికుల వాహనాల పార్కింగ్కు బస్టాండ్ వెనుక సంత మార్కెట్ రోడ్డు, మార్కెటింగ్ యార్డు రోడ్డు వద్ద స్థలాలను కేటాయించారు. క్షేత్రంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేసినట్టు ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. -
క్షీర రామ లింగేశ్వర స్వామి దేవాలయంపై సాక్షి ప్రత్యేక కథనం
-
క్షీరారామంలో హైకోర్టు జడ్జి
పాలకొల్లు సెంట్రల్ (పశ్చిమగోదావరి జిల్లా) :పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయానికి హైకోర్టు జడ్జి బి.వ్యాఘ్రేశ్వర శివశంకర శర్మ సోమవారం విచ్చేశారు. క్షీరా రామలింగేశ్వరునికి, జనార్దనస్వామికి, లక్ష్మి, పార్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డి నరసింహమూర్తి, ఈవో యర్రంశెట్టి భద్రాజీలు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.