breaking news
krishna board members
-
5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో రబీ సాగునీటి అవసరాలు, వేసవిలో తాగునీటి అవసరాలపై చర్చించి లభ్యత ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లో బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు మంగళవారం కృష్ణా బోర్డు చైర్మన్ ఎ.పరమేశం లేఖ రాశారు. కృష్ణా నదికి ఈ ఏడాది భారీ ఎత్తున వరదలు రావడంతో ఇరు రాష్ట్రాలు అవసరమైన మేర నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది. వరద ప్రవాహం తగ్గాక వాడుకున్న నీటి లెక్కలు తేల్చి, ఆ తర్వాత అవసరాలను బట్టి కేటాయిస్తామని పేర్కొంది. ప్రస్తుతం నీటి సంవత్సరం ప్రారంభంలోనే నీటి లెక్కలు తేల్చేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో గత నెల 31 వరకు వినియోగించుకున్న నీటి లెక్కలు, వచ్చే మార్చి 31 వరకు సాగు, తాగునీటి అవసరాలు చెప్పాలని ఇటీవల రాష్ట్రాల ఈఎన్సీలను బోర్డు కోరింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాలు ఇప్పటిదాకా వినియోగించుకున్న నీరు ఆధారంగా మిగిలిన వాటా జలాలను కమిటీ కేటాయించనుంది. -
నేటి నుంచి ‘కృష్ణా’ బోర్డు సభ్యుల పర్యటన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా శనివారం నుంచి కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. ఈ నెల 8న కృష్ణా బోర్డు మార్గదర్శకాల తయారీపై ఇరు రాష్ట్రాలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా అంతకుముందుగానే రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల పరిధుల్లో పర్యటించనున్నారు. శనివారం కృష్ణా డెల్టాలో పర్యటించిన అనంతరం శ్రీశైలం ఎడమ, కుడి గట్టు కాలువ, సాగర్ కుడి, ఎడమ కాలువల కింద సైతం పర్యటనలు జరిపి అక్కడి స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న నిర్ణీత ఆయకట్టు, వాస్తవ నీటి లభ్యత, వినియోగం తదితరాలను పరిశీలించనున్నారు.