-
కంటికి రెప్పలా..!
ఘాట్లలో క్లీనింగ్ పుష్కర నగర్లో నిరంతర కాపలా సేవల్లో ఫైర్ సిబ్బంది సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల్లో అగ్నిమాపక సిబ్బంది విస్తృత సేవలందిస్తున్నారు. ఘాట్లను నిరంతరం కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. ప్రతి ఘాటులోను ఫైర్ సిబ్బంది క్లీనింVŠ లోనూ, వీవీఐపీల ప్రోటోకాల్, పుష్కర నగర్ల్లో యాత్రికుల భద్రత పరంగా తమవంతు సేవలు అందిస్తున్నారు. పోలీసుల్లా ఘాట్ల పరిధిలో భక్తులను సూచనలు, సలహాలు అందిస్తూ వయసు మీరిన వారికి చేదోడుగా,తప్పిపోయిన పిల్లల విషయంలో చేయూత నిస్తూ సేవలు అందిస్తున్నారు. పర్యాటకశాఖ ఏర్పాటు చేసినా బోటు షికారులో ఘాట్లలో భక్తులకు ఏలాంటి ప్రమాదాలు లేకుండా ఫైర్ రెస్కూ్య టీం పర్యవేక్షిస్తోంది. విధుల్లో 1050 మంది సిబ్బంది.. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పుష్కర సేవల్లో 1050 మంది ఫైర్సిబ్బంది నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫైర్ స్టేషన్ల నుంచి సిబ్బంది, అ«ధికార యంత్రాంగాన్ని పుష్కర సేవలకు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఘాట్ల క్లీనింగ్లో వీరి పాత్ర కీలకంగా ఉంది. శానిటేషన్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ 40 ఫోర్టబుల్ పంపులతో పరిశుభ్రత చేస్తున్నారు. గంట, గంటకు పంపులతో శుభ్రం చే స్తుండడంతో ఘాట్లలో పరిశుభ్రత తాండవిస్తుండడంతో భక్తులు ఆనందంగా వెళ్తున్నారు. పుష్కరాలకు ఐదు రోజుల ముందు నుంచే వీరు ఘాట్ల శుభ్రత విషయంలో శ్రద్ధ పెట్టారు. నిరంతర నిఘా.. పోలీసులు భక్తుల భద్రత విషయంలో కాపలా ఉంటే ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాల బారినపడకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 45 పుష్కర నగర్ల్లో 30 వాహనాలను వుంచారు. పుష్కర నగర్ ఏర్పాటు చేయకముందే వీరు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని నిబంధనల మేర విద్యుత్ సదుపాయం కల్పించారు. రాత్రి సమయాల్లో నిద్రించే సమయాల్లో ఏలా వ్యవహరించాలి అనే దానిపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక వీవీఐపీల ప్రోటోకాల్ ,హెలిప్యాడ్ వద్ద వీరి పాత్ర కీలకంగా ఉంది. ఘాట్ల పరిధిలో ¿¶ క్తుల భద్రత విషయంలో రెస్కూ్య టీంలు పనిచేస్తున్నాయి. మొత్తం 8 బోట్లు ద్వారా ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ కాపలా కాస్తున్నారు. ఫెర్రి ఘాట్లో 1, దుర్గాఘాట్ లో 2, అమరావతిలో 2, పున్నమి ఘాట్ లో 2, భవానీ ఘాట్లో 1 వంతున బోట్లుల్లో కాపలా కాస్తున్నారు. మరో రెండు అదనంగా ఉన్నాయి. ఏక్కడ భక్తులు ప్రమాదం జరిగినా వెంటనే ఆ రెస్కూ్యటీంలు వారిని వెంటనే రక్షించి వైద్య శిబిరాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు తరహాలో సేవలు.. పోలీసు తరహాలో ఫైర్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.ప్రతి ఘాట్ లో ఓ స్టేషన్ అధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ వుంటుంది అలాగే ప్రధాన ఘాట్లలో జిల్లా ఫైర్ అధికారి పర్యవేక్షణ చేస్తున్నారు. ఘాట్ల వద్దకాపలాతో పాటు వయస్సు మీరిన వారిని ఆసరాగా నిలచి స్నానలకు తీసుకెళ్లడం, చిన్నారులు తప్పిపోకుండా ట్యాగింగ్ వేయించడం, అనారోగ్యంగా ఉన్న ఉన్నవారిని వైద్య శిబిరాలకు తరలించండం ఇలాంటి సేవల్లో వీరు భాగస్వాములు అవుతున్నారు. -
రద్దీకి తగినట్లు ఏర్పాట్లు
విజయవాడ (రైల్వేస్టేçÙన్): స్టేషన్లో పుష్కర ప్రయాణికుల రద్దీని సీనియర్ డీ.సీ.ఎం షిఫాలి శనివారం పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. తూర్పుముఖద్వారం1, 2ల వద్దనున్న బుకింగ్ కౌంటర్లు, ఏ.టి.వి.ఎంలను ఆమె పరిశీలించారు. రానున్న 2 రోజుల్లో రద్దీ మరింత పెరగనుండంటంతో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. 1వ నెంబరు ప్లాట్ఫాం వద్ద టికెట్ జారీకి ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను ఆమె పరిశీలించారు. -
దుర్గాఘాట్లో మంత్రి నారాయణ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం దుర్గాఘాట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రితో పాటు నగర మేయర్ కోనేరు శ్రీధర్, కార్పొరేషన్ కమిషనర్ వీరపాండియన్ ఉన్నారు. నీటిలో పువ్వులు, ఇతర పూజ సామగ్రి కనిపించడంతో వెంటనే వాటిని తొలగించాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కమిషనర్కు సూచించారు. ఘాట్లో పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థులు, యువకులే కనిపించడంతో వారితో కాసేపు ముచ్చటించారు. -
తూచ్...నాన్ వెజ్ అమ్ముకోవచ్చు
►మాంసం విక్రేతలకు ‘పచ్చ’జెండా ►తమ్ముళ్ల డీల్ సెట్ విజయవాడ సెంట్రల్ : నగరంలో మాంసం విక్రయాల నిషేధానికి అధికారులు చెల్లుచీటి ఇచ్చేశారు. పవిత్ర కృష్ణా పుష్కరాలు అయినప్పటికీ మాసం అమ్ముకోవచ్చు. కబేళా కూడా పనిచేస్తోందంటూ కమిషనర్ జి.వీరపాండియన్ బుధవారం ప్రకటించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా నగరంలో చేపలు మాంసపు ఉత్పత్తుల విక్రయాలను 9 నుంచి 25వ తేదీ వరకు నిషేధిస్తున్నామని ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే వ్యాపారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని మొన్న హెచ్చరించారు. రెండు రోజులు గడిచే సరికి తూచ్...అన్నారు. దీని వెనుక పెద్ద కథే నడిచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కథ ఇదీ మాంసం విక్రయాల నిషేధం నగరంలోని స్టార్ హోటల్ నిర్వాహకులకు మింగుడుపడలేదు. కృష్ణాపుష్కరాలకు మద్యం, మాంసం భారీఎత్తున విక్రయాలు జరుగుతాయని, ఇలాంటి సమయంలో నిషేధం విధిస్తే తమ ఆదాయం ఏం కానూ? అని టీడీపీ ప్రజాప్రతి నిధుల వద్ద పంచాయితీ పెట్టారు. ఎంపీ కార్యాలయంలో సర్వం తానై వ్యవహరించే ఓ చోట నేత రంగంలోకి దిగాడు. స్టార్ హోటళ్ల నిర్వాహకులతోపాటు చిన్న చితకా హోటళ్ల యజమానులు, మాంసం దుకాణ విక్రయదారులతో రాయ‘బేరాలు’ సాగించాడు. మంగళవారం రాత్రి డీల్ కుదిరింది. తెల్లవారే సరికి ఓ మంత్రి కమిషనర్తో మాట్లాడేశారు. మాంసం లేకపోతే హోటళ్ల యజమానులు ఇబ్బంది పడతామంటున్నారు, వదిలేయమంటూ మంత్రి కమిషనర్ కు ఆదేశాలిచ్చారు. మాంసం విక్రయాలపై నిషేధం శుభ్రంగా అటకెక్కింది. కబేళా యథావిధిగా పనిచేస్తోందని, వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ చెబుతున్నారు. పారిశుధ్యానికి విఘాతం కల్గిస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరికల కొసమెరుపు విసిరారు. మంత్రి పేషీ హడావుడి సిటీలో చికెన్, మటన్, చేపలు ఇతరత్రా మాంసం రోజుకు సగటున 20 టన్నులు విక్రయం జరుగుతోందని అంచనా. సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వ్యాపారం సాగుతోంది. వేడుకలు, ఫంక్షన్ల సీజన్లో 50 శాతం అదనంగా వ్యాపారం ఉంటోంది. ఈక్రమంలో నాన్ వెజ్ విక్రయాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించగానే ఓ మంత్రి పీఏ నగరపాలక సంస్థ అధికారులకు ఫోన్ చేసి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో సార్ అడగమన్నారంటూ వివరాలు సేకరిం చారు. రెండు రోజుల్లో రంగంలోకి దిగిన తెలుగు తమ్ముళ్లు డీల్ సెట్ చేసేశారు. -
పుష్కర వేళ.. ఇలా వెళ్దాం
బృహత్తర కార్యక్రమానికి మరో రోజులో తొలి అడుగు పడనుంది. మన రాష్ట్రమే కాదు.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు.. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి కోట్లాదిమంది భక్తులు కృష్ణమ్మ పుష్కర స్నానమాచరించి పునీతమవ్వాలని ఇప్పటికే బయల్దేరి ఉంటారు. కానీ, విజయవాడ నగరంలో ఇంకా జరుగుతున్న పుష్కరాలు, పలు అభివృద్ధి పనుల నేపథ్యంలో కొంతమేర రూట్మ్యాప్లో గజిబిజికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారి కోసం.. వాహనాలు ఎక్కడ దిగాలి? ఘాట్కు ఎలా చేరుకోవాలి? వంటి వివరాలతో ప్రత్యేక కథనం. శాటిలైట్ బస్స్టేషన్లు : 6 – ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం – వైవీరావు ఎస్టేట్ – జాకీర్ హుస్సేన్ కళాశాల (ఇబ్రహీంపట్నం) – వీటీపీఎస్ ఏ కాలనీ గ్రౌండ్ – కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల – పెదకాకాని శాటిలైట్ రైల్వేస్టేషన్లు : 4 – రాయనపాడు – గుణదల – మధురానగర్ – కృష్ణా కెనాల్ శాటిలైట్ బస్, రైల్వేస్టేషన్ల వద్ద పుష్కర నగర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సకల సౌకర్యాలూ ఉంటాయి. అక్కడి నుంచి ఘాట్ల వద్దకు ఉచిత ఆర్టీసీ బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. పార్కింగ్ ప్రదేశాలు : 121 ఉచిత బస్సులు : 740 గుంటూరు వైపు నుంచి.. – అమరావతి, ధ్యానబుద్ధ ఘాట్ : గుంటూరు నగరం.. ఆ చుట్టుపక్కల నుంచి వచ్చే యాత్రికులు అమరావతి ఘాట్కు చేరుకోవచ్చు. ఇక్కడే ధ్యానబుద్ధ ఘాట్ కూడా ఉంది. గుంటూరు నుంచి నేరుగా అమరావతిలోని గుంటూరు రోడ్డు లేదా విజయవాడ రోడ్డు లేదా సత్తెనపల్లి రోడ్డులో ఏర్పాటుచేసిన పుష్కర నగర్కు చేరుకోవచ్చు. ప్రయివేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ ఏర్పాటుచేసిన బస్సుల్లో ఘాట్ల వద్దకు చేరుకోవచ్చు. సుమారు 1.5 కిలోమీటరు దూరంలో ఉండే ఈ ఘాట్లకు నడుచుకుని అయినా వెళ్లవచ్చు. – సీతానగరం ఘాట్ : గుంటూరు నగరం.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చెన్నై నుంచి వచ్చేవారు ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న సీతానగరం ఘాట్కు చేరుకోవచ్చు. ఇక్కడ 8 పుష్కరనగర్లు ఏర్పాటు చేశారు. పాత జాతీయరహదారిలో 3, జాతీయ రహదారిపై 3, కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద ఒకటి, మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఒకటి పుష్కర ఘాట్ను సిద్ధం చేశారు. ప్రైవేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో ఉండవల్లి సెంటర్ చేరుకోవాలి. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న పుష్కర ఘాట్కు నడిచే వెళ్లాలి. హైదరాబాద్ నుంచి.. ముక్త్యాల ఘాట్ : హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ముక్త్యాల భవానీ ఘాట్కు వెళ్లాలంటే 65వ నంబర్ జాతీయ రహదారిలోని షేర్మహ్మద్పేట అడ్డరోడ్డు నుంచి 13 కిలోమీటర్ల దూరంలోని ముక్త్యాల భవానీ ఘాట్కు వెళ్లాలి. వెళ్లే దారిలో సీమ పందుల పెంపక కేంద్రం సమీపంలో పుష్కర నగర్ ఏర్పాటు చేశారు. ప్రయివేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఘాట్కు చేరుకోవచ్చు. వేదాద్రి ఘాట్ : వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఘాట్కు వెళ్లాలంటే చిల్లకల్లు నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. గౌరవరం నుంచి వేదాద్రి 10 కిలోమీటర్లు. 65వ నంబర్ జాతీయ రహదారి కొణకంచి అడ్డరోడ్డు నుంచి 13 కిలోమీటర్లు వెళ్లాలి. భక్తులు సులభంగా తెలుసుకునేందుకు ప్రధాన సెంటర్లలో రూట్ మ్యాప్లను ఏర్పాటు చేశారు. పవిత్ర సంగమం ఘాట్ : కృష్ణా, గోదావరి నదులు కలిసే చోటు పవిత్ర సంగమం ఘాట్. పుష్కరాలకు హైదరాబాద్.. ఆపై ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఎక్కువగా స్నానాలు చేసే అవకాశం ఉంది. ఈ ఘాట్ వద్ద స్నానాలు చేయాలనుకునే భక్తులు ప్రయివేట్ వాహనాల్లో వస్తే ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ దగ్గర ఆగాల్సి ఉంటుంది. అక్కడే పుష్కర నగర్ ఉంటుంది. ప్రయివేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఘాట్ మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే హైదరాబాద్.. ఆపై ప్రాంతాల భక్తులు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో జాకీర్ హుస్సేన్ కాలేజీ వరకూ చేరుకోవాలి. అక్కడే పుష్కర నగర్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఘాట్కు ఆర్టీసీ ఉచిత సర్వీసుల్లో చేరుకోవచ్చు. ఇక మైలవరం, భద్రచలం కొండపల్లి నుంచి వచ్చే వాహనాలు వీటీపీఎస్ ప్లే గ్రౌండ్లో ఏర్పాటుచేసిన పుష్కర నగర్ వద్ద ఆగాల్సి ఉంటుంది. భవానీ, పున్నమి ఘాట్లు : హైదరాబాద్.. ఆపై ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భవానీ, పున్నమి ఘాట్లలో పుష్కర స్నానం చేయాలనుకుంటే.. ప్రయివేట్ వాహనమైనా, ఆర్టీసీ బస్సు అయినా భవానీపురం దర్గా వద్ద ఏర్పాటుచేసిన పుష్కర నగర్ వద్ద ఆగాలి. అక్కడి నుంచి నడుచుకుని ఈ రెండు ఘాట్లకూ చేరుకోవచ్చు. దుర్గాఘాట్ : బెజవాడ దుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రికి సమీపంలో ఉన్న దుర్గాఘాట్లో పుణ్యస్నానం చేయాలనుకునే దూరప్రాంతపు భక్తులు భవానీపురం దర్గా వద్ద అయినా దిగవచ్చు. లేదంటే విజయవాడలోని వైఎస్సార్ కాలనీ సమీపంలోని వైవీ రావు ఎస్టేట్ వద్ద ఏర్పాటుచేసిన పుష్కర నగర్లో దిగవచ్చు. అక్కడి నుంచి దుర్గాఘాట్తో పాటు భవానీ, పున్నమి ఘాట్కు ఉచిత బస్సులు నడుస్తాయి. హంసలదీవి కృష్ణా సాగర సంగమం : హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నుంచి వచ్చేవారు హంసలదీవిలోని కృష్ణా సాగర సంగమ ప్రాంతంలో పుణ్యస్నానం చేయాలనుకుంటే.. ఆర్టీసీ బస్సులను ఆశ్రయించవచ్చు. విజయవాడ నుంచి అవనిగడ్డకు నిత్యం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అవనిగడ్డ నుంచి కోడూరు.. ఉల్లిపాలెం మీదుగా హంసలదీవి రావాలి. అక్కడి నుంచి సముద్రతీరంలో డాల్ఫిన్ భవనం వద్ద పుష్కర నగర్ ఉంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా సాగర సంగమ ప్రాంతానికి చేరుకోవచ్చు. ప్రయివేట్ వాహనాలైతే కోడూరు నుంచి దింటిమెరక గ్రామం.. పాలకాయతిప్ప నుంచి సముద్రం తీరంలోని పుష్కర నగర్కు చేరుకోవచ్చు. భారీ వాహనాల మళ్లింపు ఇలా.. – విజయవాడ నుంచి రోజూ విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై వెళ్లే భారీ వాహనాల కోసం పుష్కరాల 12 రోజులూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను కంచికచర్ల, ఇబ్రహీంపట్నం నుంచి మళ్లిస్తారు. కంచికచర్ల మీదుగా జుజ్జూరు, జమలాపురం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ చేరుకోవచ్చు. ఇబ్రహీంపట్నం మీదుగా కొండపల్లి, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్కు చేరవేస్తారు. – విశాఖ నుంచి చెన్నై, హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి రూటు మారుస్తారు. 740 ఆర్టీసీ ఉచిత సర్వీసులు కృష్ణా పుష్కరాలకు విజయవాడలో 740 ఉచిత సిటీ బస్సులు నడుపుతున్నారు. శాటిలైట్ బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పుష్కర పార్కింగ్ ప్రాంతాల నుంచి ఉచిత బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి మూడు నిమిషాలకు ఒక ఉచిత బస్సు ఉంటుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని శాటిలైట్ బస్స్టేషన్ వరకూ వస్తాయి. అక్కడి నుంచి నగరంలోని ఆరు ఘాట్లకు వెళ్లడానికి వీలుగా 100 ఉచిత బస్సుల్ని ఏర్పాటుచేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు వైవీ రావు ఎస్టేట్లోని శాటిలైట్ బస్స్టేషన్ వద్ద ఆగుతాయి. అక్కడి నుంచి ఘాట్లకు 65 బస్సులు ఉంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు ఇబ్రహీంపట్నంలోని జాకీర్ హుస్సేన్ గ్రౌండ్లో ఉన్న శాటిలైట్ బస్స్టేషన్లో ఆగుతాయి. అక్కడి నుంచి ఘాట్లకు 45 ఉచిత బస్సులు నడుస్తాయి. తిరువూరు, భద్రాచలం నుంచి వచ్చే బస్సులు వీటీపీఎస్ కాలనీలో శాటిలైట్ స్టేషన్లో ఆగుతాయి. అక్కడి నుంచి 10 ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని పుష్కర ఘాట్లకు మూడువేల బస్సులు నడుపుతున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్స్టేషన్ సిటీ బస్స్టేషన్గా నడుస్తుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement