-
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా పౌద్యాల్!
కాఠ్మాండూ: నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామచంద్ర పౌద్యాల్ ఎన్నికయ్యే అవకాశముంది. దేశాధ్యక్ష ఎన్నికల్లో భాగంగా శనివారం ఆయన అభ్యర్థిత్వానికి ఎనిమిది రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్(యూఎంఎల్), పుష్పకమల్ దహాల్(ప్రచండ) నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్), మరో ఐదు పార్టీ లు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెల్సిందే. అయితే కూటమి పార్టీ అయిన సీపీఎన్(యూఎంఎల్) బలపరిచిన అభ్యర్థి సుభాష్ నెబాంగ్కి కాకుండా అధికార కూటమిలోలేని వేరొక పార్టీ అభ్యర్థి కి ప్రధానమంత్రి ప్రపంచ మద్దతు పలకడంతో రెండునెలల క్రితమే కొలువుదీరిన ప్రభుత్వం కూలే పరిస్థితులు నెలకొన్నాయి. నేపాల్ పార్లమెంట్లో పార్టీ ల ప్రస్తుత బలాబలాల ప్రకారం ఈ ఎనిమిది పార్టీ లు బలపరిచే అభ్యర్థే వచ్చే నెలలో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. ప్రచండ నిర్ణయంతో ఆగ్రహించిన అధికార కూటమిలోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ తాము ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ లింగ్డెన్ ఉపప్ర«దానిగా రాజీనామా చేశారు. కూటమి పార్టీ లు మద్దతు ఉపసంహరిస్తే నెలరోజుల్లోపు పార్లమెంట్లో ప్రచండ విశ్వాస పరీక్షలో నెగ్గాలి. -
మోదీతో నేపాల్ ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేపాల్ రాయబార కార్యాలయంలో నేపాల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ స్వాగతం పలికారు. ఓలి శనివారం ప్రధాని మోదీతో ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొంటారు. ఆదివారం ఉత్తరాఖండ్లోని పంత్నగర్లో ఉన్న జీబీ పంత్ వ్యవసాయ, సాంకేతికత యూనివర్సిటీని సందర్శిస్తారు. అక్కడి సంకరణ విత్తనాల ఉత్పత్తి కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అదే యూనివర్సిటీ ఓలికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. -
బీజేపీలో జేవీపీ విలీనం
రాంచి: జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీపీ-ప్రజాతాంత్రిక్)లోని ఒక వర్గం బుధవారం లాంఛనంగా బీజేపీలో విలీనమైంది. కేపీ శర్మ అధ్యక్షతలోని జేవీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు- సర్మేశ్ సింగ్, చంద్రికా మహతా, జై ప్రకాశ్ భోక్తా, నిర్భయ్ సహవాది, పూల్చంద్ మండల్ బీజేపీలో చేరారు. రాంచీలోని పార్టీ కార్యాలయంవద్ద జరిగిన కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నేత అర్జున్ ముండా, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, జార్ఖండ్ శాఖ అధ్యక్షుడు రవీంద్ర రాయ్ వారిని పార్టీలోకి స్వాగతించారు. జేవీపీ-ప్రజాతాంత్రిక్ అధ్యక్షుడు బాబూలాల్ మారాండీ కూడా బీజేపీలో చేరాలని అర్జున్ ముండా విజ్ఞప్తి చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement