-
ఏపీ: ఈ–కేవైసీ గడువు 15 వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం చేసే (ఈ–కేవైసీ) గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ మంగళవారం ప్రకటించారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ–కేవైసీ నమోదు గడువు ఆగస్టు 31తో ముగిసింది. వరుస సెలవులు, పండుగలు రావడం, సర్వర్లు సరిగా పని చేయక పలు చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గడువు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్తో అనుసంధానం అవసరం లేదన్నారు. ఆపై వయసున్న పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ఉందని, పెద్దలు మాత్రం సెప్టెంబర్ 15లోగా చేయించుకోవచ్చని వివరించారు. ఇవీ చదవండి: ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్ ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. -
మూడు సంస్థలకు కొత్త సీఈవోలు
సాక్షి, అమరావతి: వచ్చే నెలలో కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీ రానుండటంతో అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధంగా ఏపీ ప్రభుత్వం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రంగానికి చెందిన మూడు సంస్థలు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిట), ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ (ఐఐడీటీ)లకు ఆయా రంగాల్లో విశేష అనుభవం ఉన్న వ్యక్తులను త్వరలో సీఈవోలుగా నియమించనుంది. ఒక్కొక్క సంస్థకు సంబంధించి ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సీఈవోను ఎంపిక చేయనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ‘సాక్షి’కి తెలిపారు. (చదవండి: బోస్కు సముచిత స్థానం) ► ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రమోటింగ్ ఏజెన్సీగా అపిట వ్యవహరిస్తుంది. ► కొత్త కొత్త పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఇన్నోవేషన్ సొసైటీ కృషి చేస్తుంది. ► తిరుపతి కేంద్రంగా ఉన్న ఐఐడీటీ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి కోర్సులను అందిస్తుంది. ► ఇలా మూడు సంస్థలకు సమర్థవంతమైన కొత్త సీఈవోలను ఎంపిక చేయడం ద్వారా ఈ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జట్టీలు, ఫిష్ల్యాండింగ్ సెంటర్లపై సర్వే కృష్ణా, ప.గోదావరి జిల్లాల్లో 27 ప్రాంతాల్లో అధ్యయనం సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన జట్టీలు, ఫిష్ల్యాండింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సైసెఫ్ (సెంటర్ ఫర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ) కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు రోజుల క్రితం సర్వే కార్యక్రమాలను పూర్తి చేసింది. బెంగళూరు కేంద్ర కార్యాలయం నుంచి ఇంజనీరింగ్, ఫిషరీస్ విభాగాలకు చెందిన ఆరుగురు నిపుణులు 27 ప్రాంతాలను 10 రోజులు పరిశీలించారు. మత్స్యకారులకు వేటలో లభిస్తున్న మత్స్య సంపద, మత్స్యసంపద నిల్వ, మార్కెటింగ్ పరిస్ధితులను అధ్యయనం చేశారు. మత్స్యకారుల మరపడవలు, పడవలు లంగరు వేసుకోడానికి వార్ఫు, ఫ్లాట్ఫారాలు, కోల్డుస్టోరేజి ప్లాంట్ల నిర్మాణాలకు అయ్యే ఖర్చుపై ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీటి ఏర్పాటు తరువాత ఈ ప్రాంతాల అభివృద్ధి ఏమేరకు ఉంటుంది, మత్స్యకారుల జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతాయి అనే అంశాలపైనా పరిశీలన చేశారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కృష్ణాజిల్లాలోని నాగాయలంక, ఈలచెట్ల దిబ్బ, ఎదర్లంక, గొల్లలమోద, క్యాంప్బెల్పేట, పల్లెతుమ్మలపాలెం, ప.గో. జిల్లా దెయ్యపుదిబ్బ వంటి ప్రాంతాలపై అధ్యయనం చేశారని మత్స్యశాఖ కమిషనర్ సోమశేఖరం తెలిపారు. -
ఐటీకి విశాఖ అనుకూలం
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అందమైన ఐటీ సిటీగా విశాఖ అభివృద్ధి చెందనుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గురువారం ఆర్కే బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే “ఎడ్జ్ కంప్యూటింగ్, ప్రోసెస్ ఆటోమేషన్ త్రూ రోబోటిక్స్, ఇండస్ట్రీ 4.0, కాగ్నెటివ్ టెక్నాలజీ(ఈపీఐసీ)–2020’ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన విశాఖలో ఐటీ అభివృద్ధి, ఆధునిక టెక్నాలజీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం శశిధర్ మాట్లాడుతూ ఐటీ పరిశ్రమలకు విశాఖ అనుకూలమైన ప్రాంతమని, వాటి ఏర్పాటుకు ఎవరొచ్చినా స్వాగతిస్తామన్నారు. వైజాగ్ నుంచి ఐటీ సంస్థలు, పరిశ్రమలు తరలిపోతున్నాయనే వదంతులను నమ్మవద్దని, ఎటువంటి ఐటీ కంపెనీలు ఎక్కడికి వెళ్లిపోవడం లేదని స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఐటీ కాన్సెప్ట్ సిటీలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో కంపెనీలను నెలకొల్పేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామన్నారు. విశాఖను ఐటీ, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిలికాన్ వేలీ సిటీ తర్వాత విశాఖ మాత్రమే ఐటీ రంగానికి అనువుగా ఉంటుందన్నారు. పరిశ్రమలు, ఐటీ రంగాల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను అభివద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి డ్రాఫ్ట్ ఐటీ పాలసీని తీసుకురానున్నట్లు చెప్పారు. విశాఖలో ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఐవోటీ ఏర్పాటుకు నిధులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నాస్కామ్ సంయుక్తంగా ఆంధ్రా యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(ఐవోటీ)ను ఏర్పాటు చేసేందుకు నిధులు విడుదల చేశామని శశిధర్ తెలిపారు. ఆర్ఐఎన్ఎల్ సహకారంతో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డ్రోన్ టెక్నాలజీ తదితర వాటి అభివృద్ధికి రాష్ట్రంలో రెండో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతమని, దీని ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు. ఉత్పత్తి మరింత సులభతరం.. విశాఖ స్టీల్ప్లాంట్ సీఎండీ పి.కె.రథ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కులో ఉత్పత్తులు పెంచేందుకు ఆధునిక ఆటోమేషన్ టెక్నాలజీ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. ఉక్కు పరిశ్రమ కారణంగా జాతీయ నికర ఉత్పత్తిలో 2 శాతం వాటా చేకూరుతోందన్నారు. ఆధునికీకరణ క్రమంలో ఆటోమేషన్ టెక్నాలజీతో నాణ్యత గల ఉక్కును తయారుచేయడంతో ఉత్పత్తి ఇంకా పెరుగుతుందని చెప్పారు. ఈ ఆటోమేటివ్ ఎక్విప్మెంట్తో ఉత్పత్తి మరింత సులభతరంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సదస్సు మ్యాగజైన్ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్(పర్సనల్) కె.సి.దాస్, క్వాడ్జెన్ వైర్లెస్ సొల్యూషన్స్ చైర్మన్ సి.ఎస్.రావు, ఆర్ఎన్ఐఎల్ డైరెక్టర్ కె.కె.ఘోష్, సదస్సు కన్వీనర్ బి.గోవర్థన్రెడ్డి, సీఎస్ఐ విశాఖ చాప్టర్ ట్రెజరర్ ఎ.ఎన్.బిశ్వాల్, వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆటోమేషన్ టెక్నాలజీతో ముందుగానే.. ఆధునిక ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా ముందుగానే మలేరియా ప్రభావిత ప్రాంతాలను కనుగొని, ఎంత మంది ప్రభావితులయ్యారో తెలుసుకోవచ్చని కోన శశిధర్ పేర్కొన్నారు. గతంలో విశాఖ ఏజెన్సీలో మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయని, అటువంటి ఆరోగ్య సమస్యలను ఈ టెక్నాలజీతో ముందస్తుగానే పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆయా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు, భౌగోళిక పరిస్థితులు, ఇతర ప్రభావిత విషయాలను గుర్తించి ముందుగానే తెలుసుకోవచ్చని వివరించారు. ఈ–ప్రగతి ప్రాజెక్టు ద్వారా ఆటోమేషన్ టెక్నాలజీతో మరింత సమర్థవంతమైన పాలన అందిస్తామన్నారు. -
నిస్సహాయ మహిళకు చేయూత
నరసరావుపేటటౌన్: అక్కమ్మ కథ...తీరని వ్యథ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ కోన శశిధర్ స్పందించారు. బాధితురాలికి వైద్యసేవలు అందించాలని డీఎంఅండ్హెచ్వోకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని కేతముక్కల అగ్రహారం దళితవాడకు చెందిన కలిసేటి అక్కమ్మ భర్త నుంచి నిరాదరణకు గురై యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పేగులు కాలి పోయాయి. ఆరోగ్యశ్రీ కార్డు లేనికారణంగా ఆపరేషన్ చేయమని వైద్యులు తేల్చిచెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకొని నిస్సహాయస్థితిలో సాయం కోసం ఎదురుచూస్తూ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె నిస్సహాయతపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్ వైద్య సహాయక చర్యలు చేపట్టాలని వైద్యాధికారుల్ని ఆదేశించారు. డీఎంఅండ్హెచ్వో సూచనతో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి. మోహనశేషు ప్రసాద్ శుక్రవారం అక్కమ్మను పరామర్శించారు. గతంలో జరిగిన వైద్యసేవల గురించి ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ వడ్లమూడి శ్రీనివాసరావు ఏరియా వైద్యశాల వైద్యమిత్ర రోజా రమణిని అడిగి అక్కమ్మ వివరాలను సేకరించారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసేందుకు సా«ధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తున్నట్లు రోజారమణి తెలిపారు. శస్త్రచికిత్స కోసం అక్కమ్మను తిరుపతి పంపేందుకు రవాణా ఖర్చులు భరించడానికి పట్టణంలోని హైలైన్ మొబైల్ షోరూం అధినేత కూనిశెట్టి హనుమంతరావు ఆర్థిక సహాయం చేసేం దుకు ముందుకొచ్చారు. రవాణా ఖర్చును అందిస్తామని హామీ ఇచ్చి సేవా దృక్పథాన్ని ఆయన చాటు కున్నారు. -
కాలం చెల్లిన వాహనాలకు చెక్
గుంటూరు వెస్ట్: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నగరంలో కాలుష్యం అధికంగా ఉందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తగ్గించాలంటే కాలం చెల్లిన వాహనాలను తీసేయాల్సిందేనని అధికారులకు ఆదేశాలిచ్చారు. పాత వాహనాలకు సరైన ఇంధనం వాడడం లేదన్నారు. దీంతో కాలుష్యం ఊహకందని విధంగా పెరిగిపోతుందన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశం మందిరంలో జిల్లా కాలుష్య నియంత్రణా మండలి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో విపరీతంగా ట్రాఫిక్ సమస్య పెరిగిపోయిందన్నారు. 2017లో నగరంలో ఒక ఘనపు మీటరుకు దుమ్ము సాంద్రత 66.5 మైక్రో గ్రాములు ఉందన్నారు. దీనిని 60 మైక్రో గ్రాములకు తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. కాలుష్య నివారణకు జిల్లా కాలుష్య నివారణ మండలి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజలు కూడా దీనిపై తమ వంతు బాధ్యతను గుర్తెరగాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డీఆర్వో నాగబాబు, జిల్లా కాలుష్య నియంత్రణా మండలి ఈఈవీఆర్.మహేశ్వరరావు, ఉప రవాణా కమిషనర్ రాజారత్నం, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం. అజయ్కుమార్, జిల్లా సరఫరాల అధికారి ఇ.చిట్టిబాబు పాల్గొన్నారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement