breaking news
Kolam tribesmen
-
లంబాడా రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి
ఎదులాపురం(ఆదిలాబాద్) : లంబాడా కులానికి చెందిన రెవెన్యూ సిబ్బంది కొలాం రైతులను మోసం చేస్తున్నారని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు అన్నారు. సోమవారం కలెక్టర్ దివ్యదేవరాజన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కొలాం రైతులకు రైతుబంధు పథకం వర్తించకుండా లంబాడా కులానికి చెందిన రెవెన్యూ ఉద్యోగులు కుటిల ప్రయత్నాలు చేస్తూ అన్యాయం చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఐదెకరాలు ఉన్న కొలాం గిరిజన రైతు భూమిని గుంటలుగా చూపిస్తూ ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ను తుంగలో తొక్కుతున్నారని పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి ఆదిలాబాద్, నార్నూర్ తహసీల్దార్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్వార్టర్స్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను కలిసి సమస్యను విన్నవించారు. మామిడిగూడ, సల్పలగూడ, పోతగూడ, హత్తిగుట్ట, తిప్ప, చితగుడ, ముక్తాపూర్, అడ్డగుట్ట, యాపల్గూడ, తదితర గ్రామాల రైతులు తానాజీ కురుసింగా, రత్నజాడె ప్రజ్ఞకుమార్, టేకం సురేష్, నందులాండ్గే పాల్గొన్నారు. -
కొలాం గిరిజనుల అభివృద్ధికి చర్యలు
ఐటీడీఏ పీవో కర్ణన్ అర్జుని కొలాంగూడలో కొలాం గిరిజనుల ప్రత్యేక సమావేశం నార్నూర్ : కొలాం గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ తెలిపారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు చేయడం అలవర్చుకుంటే గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఆదివారం నార్నూర్ మండలంలోని అర్జుని కొలాంగూడ గ్రామంలో కొలాం గిరిజన సంఘాల అధ్వర్యంలో కొలాంల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పీవో ముఖ్య అతిథిగా హాజరై గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కొలాం గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వ్యవసాయ చేయడానికి భూమి ఉన్నా ఎండ్లు లేవు. నీళ్లు, క రెంటు మోటారు, ఆరుులింజన్లు లేవు. కొలాం గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మంజూరు చేసే సబ్సిడీ రుణాలు అందడం లేదని కొలాం గిరిజనుడు కన్నా పీవో దృష్టికి తెచ్చారు. పీవో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీలేని రుణాలు తీసుకొని చిన్నచిన్న పనులు చేసుకోవాలన్నారు. చిన్న చిన్న రుణాల కోసం ఐటీడీఏ, బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఐకేపీ ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం, జీవన్జ్యోతి బీమా యోజన పథకం కింద కొలాం గిరిజనులకు ఐటీడీఏ ద్వారా బీమా చేయడం జరిగిందని తెలిపారు. ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం 1000 రైల్వే పోలీసు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిందని, గ్రామంలో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులు ఈ నెల మార్చి 3వరకు స్థానిక ఐకేపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ఐటీడీఏ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రూపావంతిజ్ఞానోబాపుస్కర్, ఎంపీపీ రాథోడ్ గోవింద్నాయక్, కొలాం అభివృద్ధి అధికారి భాస్కర్, సర్పంచ్ జంగుబాయి కన్నా, ఎంపీటీసీ సభ్యుడు దేవురావ్, మాజీ ఎంపీటీసీ భీంరావ్, గ్రామ పటేల్ జంగు, తహశీల్దార్ దేవానందం, ఎంపీడీవో సుధాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనివాస్, పశువైద్యాధికారి రామకృష్ణ, ఈజీఎస్ ఏపీవో రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.