breaking news
k.kavita
-
రాష్ట్రాల హక్కును హరించేలా ఉన్నాయి: ఎంపీ కవిత
న్యూఢిల్లీ: గవర్నర్కు శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలిచ్చే కేంద్రం ప్రతిపాదనలను నిజమాబాద్ ఎంపీ కవిత తప్పుపట్టారు. శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలు గవర్నర్ కు ఇవ్వడమంటే రాష్ట్రాల హక్కును హరించడమే అని ఎంపీ కవిత అన్నారు. కేంద్ర ప్రతిపాదనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని కవిత వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో అందరం శాంతియుతంగా సామరస్యంగా ఉంటున్నానమని ఎంపీ కవిత తెలిపారు. రాష్ట్ర విభజన కోసం జరిగిన ఉద్యమ సందర్భంగానూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినా తర్వాత కూడా ఇరుప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగాయని ఎక్కడా ఏ చిన్న ఘటన నమోదు కాలేదని ఆమె తెలిపారు. కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి కేంద్రం జోక్యంపై నిరసన తెలిపామన్నారు. కేంద్ర ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నామని ఎంపీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘కారు’ ఖరారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసింది. దీంతో జిల్లాలో రెండు లోక్సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. తొలి విడతలో ఎనిమిది శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంగళవా రం నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ, నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు. తె లంగాణ జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు నిజా మా బాద్ ఎంపీ స్థానానికి టికెట్ దక్కింది. అందరూ ఊహించినట్లు మహారాష్ట్రలో వ్యాపారవేత్తగా స్థిరపడిన భీంరావ్ బ స్వంత్రావు పాటిల్కు టీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ టికెట్ను కట్టబెట్టారు. 2009 లో పోటీ చేసిన ఓటమిపాలైన బిగాల గణేశ్ గుప్తకు కవిత ప్రవేశంతో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి అవకాశం చే జారిపోగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. దీంతో టీఆర్ఎస్ అర్బన్ ఇన్చార్జిగా ఉన్న బస్వ లక్ష్మీనర్సయ్యకు షాక్ ఇచ్చినట్లయ్యింది. అర్బన్ స్థానం పై కోటి ఆశలు పెట్టుకున్న ఆయనకు కవిత, బీబీ పాటిల్ల ఆగమనంతో భంగపాటు కలిగింది. తనకు టికెట్ కేటాయించక పోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన లక్ష్మీనర్సయ్య రెబల్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ నగర కమిటీ సభ్యులు మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.