breaking news
Khemchand
-
మణిపూర్ సీఎంగా ఖేమ్చంద్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో పరిణామాలు ఒక్కరోజులో మారిపోయాయి. రాష్ట్రపతి పాలన రద్దు కాగా, ఆ వెంటనే నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఏడాది కాలంగా కొనసాగుతున్న రాజకీయ అనిశి్చతికి తెరపడింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా బీజేపీ సీనియర్ నేత వై.ఖేమ్చంద్ సింగ్తో గవర్నర్ అజయ్భల్లా లోక్భవన్లో బుధవారం ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యే, కుకీ వర్గానికి చెందిన మహిళా నేత నేమ్చా కిప్జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎల్.డిఖో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సభ్యుడు గోవింద్దాస్ కాంథౌజమ్, ఎన్పీపీ సభ్యుడు కె.లోకెన్సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కిప్జెన్ అక్కడి నుంచే వర్చువల్గా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ కొత్త ప్రభుత్వ గడువు వచ్చే ఏడాది దాకా ఉంది. ప్రమాణ స్వీకారం కంటే ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వు జారీ చేశారు. -
'తన్నండి కానీ.. ఎముకలు విరగ్గొట్టొద్దు'
మీరట్: తమ సంస్థకు చెందిన యువ గో సంరక్షకులకు విశ్వహిందూ పరిషత్ మరో సలహా చెప్పింది. గోవులను అక్రమంగా తరలించేవారిని, హింసించేవారిని కొట్టండి అయితే, వారి ఎముకలు మాత్రం విరగ్గొట్టద్దు అంటూ మరో వివాదాస్పద సలహాను ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బ్రజ్, ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన గో సంరక్షక బృందం ఉన్నత ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరంతా విశ్వహిందూపరిషత్ కు చెందిన వారే. ఈ సందర్భంగా గో సంరక్షక శాఖ కేంద్ర కమిటీ సభ్యుడు ఖేమ్చంద్ మాట్లాడుతూ 'గోవులను స్మగ్లింగ్ చేసేవారిని కొట్టండి.. కానీ వారి ఎముకలు విరగ్గొట్టద్దు. విశ్వహిందూపరిషత్కు చెందినవారు, చెందని వారు ఈ విధంగా ముందుకు వెళితే ఏ ఒక్కరూ ఆవులను తరలించేందుకు సాహసం చేయలేరు. కనీసం అలాంటివారు ఎదురుపడలేరు. ఆవుల సంరక్షణ అంటే మేక్ ఇన్ ఇండియా కాదని.. దేశాన్ని రక్షించుకోవడం' అని చెప్పారు. 'ఈ మధ్య ప్రధాని మోదీ గో సంరక్షణపై చాలా మాట్లాడారు. ఆయన చెప్పిన చాలా అంశాలతో నేను అంగీకరించను. కానీ నేను ఒక విషయాన్ని అంగీకరిస్తా. ఏ ఒక్కరం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఈ విషయం నేను తరుచుగా చెబుతూనే ఉన్నాను. అందుకే స్మగ్లర్లను తన్నండి.. కానీ వారి ఎముకలు విరగ్గొట్టొద్దు. ఎందుకంటే పోలీసులతో కేసులై సమస్యల్లో ఇరుక్కుంటారు. ఇక మోదీ మాటలతో నేను విభేదించకుండా ఉండలేకపోతున్నాను. ఒకప్పుడు భారత్ను బంగారు పక్షి అనేవారు. నాడు ఎలాంటి పరిశ్రమలు లేవు. మేక్ ఇన్ ఇండియా వల్ల ఆ రోజుల్లో భారత్ కు బంగారు పక్షి అని పేరు వచ్చిందా? మొత్తం భారత్ను ఆ రోజుల్లో కాపాడింది గోవులే. గో సంరక్షకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎవ్వరికీ తెలియదు. ఈ క్రమంలో వారు వీరమరణం కూడా పొందుతున్నారు' అని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో గో సంరక్షణ పేరిట దళితులపై, ముస్లింలపై దాడులు ఎక్కువవుతున్నాయని కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.


