breaking news
Khairatabad Assembly Constituency
-
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బోనాల సందడి దృశ్యాలు
-
కలలో కూడా ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు: పీవీఆర్
సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కొడుకు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి ఇంటికి మంత్రి హరీష్రావు వెళ్లారు. హైదరాబాద్లోని విష్ణు నివాసంలో సోమవారం ఆయన్ను కలిసి బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారు. కాగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ టికెట్ను తనకు కాకుండా అజారుద్దీన్కు ఇవ్వడంతో విష్ణువర్దన్రెడ్డి అసహానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విష్ణువర్ధన్రెడ్డి ఆదివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసిన విషయం తెలిసిందే. దీంతో విష్ణు బీఆర్ఎస్లో చేరడం లాంఛనంగా మారింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్లో ఈ పరిస్థితి వస్తుందని కలలోకూడా ఊహించలేదని పేర్కొన్నారు. మా నాన్న(పీజేఆర్) 35 ఏళ్లు, తాను 17 ఏళ్లు కాంగ్రెస్కు సేవ చేశామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్లో గాంధీభవన్ను అమ్మేసే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. అతి త్వరలోనే తాను బీఆర్ఎస్లో చేరనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో విష్ణుకు సరైన గౌరవం కల్పిస్తామని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. విష్ణును బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నామని, ఆయనకు బీఆర్ఎస్ మంచి భవిష్యత్తును ఇస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి విష్ణు అని, బీఆర్ఎస్లో చేరేందుకు సుముకుత వ్యక్తం చేశారని తెలిపారు. తాము, విష్ణు అయిదేళ్లు శాసనసభ సభ్యులుగా ఉన్నామని, అనేక ఉద్ధమాల్లో ఆయన తమతో కలిసి పోరాడినట్లు ప్రస్తావించారు. తెలంగాణ వాదులకు, ద్రోహులకు మధ్య యుద్ధం జరుగుతోందని హరీష్ రావు విమర్శించారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరకిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 5 కోట్లకు ఒక్కో ఎమ్మెల్యే టికెట్ అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారని మండిపడ్డారు. పీసీసీ పదవిని కూడా కొనుక్కున్నారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి జరగుతోందని, సీఎం పాలనలో హైదరాబాద్లో తాగునీటి సమస్య లేదని తెలిపారు. -
ఖైరతాబాద్ నియోజకవర్గం: ఈసారి అధికారం ఎవరిది?
ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈ సారి మాజీ మంత్రి దానం నాగేందర్ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, 2014లో గెలిచిన చింతల రామచంద్రారెడ్డిపై 28402 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. నాగేందర్ గతంలో మూడుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన, ఒకసారి టిడిపి పక్షాన కూడా గెలిచారు. 2009-2014 మధ్య కాంగ్రెస్ ఐ మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ఐ పక్షాన పోటీచేసి ఓటమి చెందిన తర్వాత కొంతకాలానికి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిక్కెట్ పొంది విజయం సాదించారు. కాగా ఇక్కడ మహాకూటమిలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన దాసోజు శ్రావణ్ సుమారు 33500 ఓట్లతో మూడోస్థానానికి పరిమితం అయ్యారు. నాగేందర్కు 63063 ఓట్లు రాగా, చింతల రామచంద్రారెడ్డికి 34666 ఓట్లు వచ్చాయి. నాగేందర్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. ఖైరతాబాద్లో ఆరుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు, నాలుగుసార్లు బిసి (మున్నూరుకాపు)నేతలు గెలవగా రెండుసార్లు వెలమ, ఒకసారి వైశ్య సామాజికవర్గం గెలిచాయి. నగరంలో ప్రాధాన్యత కలిగిన ఖైరతాబాద్ నియోజకవర్గం 1967 నుంచి ఏర్పడిరది. కాంగ్రెస్. కాంగ్రెస్ (ఐ)లు ఏడుసార్లు, టిడిపి రెండుసార్లు, బిజెపి ఒకసారి టిఆర్ఎస్ ఒకసారి గెలుపొందాయి. ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. కాంగ్రెస్ ఐ ప్రముఖుడు పి. జనార్దనరెడ్డి ఐదుసార్లు గెలుపొందగా, 1967-72 టరమ్లో ఎన్.కృష్ణారావు ఉప ఎన్నికలోను, ఆ తర్వాత సాధారణ ఎన్నికలోను గెలిచారు. పి. జనార్ధన్రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి గెలిచారు. తదుపరి 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలిచారు. నగరంలో గతంలో ముఖ్యనేతగా ప్రసిద్ది వహించిన బి.వి.గురుమూర్తి ఒకసారి ఇక్కడ గెలవగా, అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంటు నుంచి రెండుసార్లు విజయం సాధించారు. ఇక్కడ గెలిచినవారిలో ఇద్దరు తప్ప మిగిలినవారంతా మంత్రి పదవులు నిర్వహించడం విశేషం. బి.వి.గురుమూర్తి గతంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరరెడ్డి మంత్రివర్గాలలో పనిచేయగా, పి.జనార్దనరెడ్డి 1981లో టి.అంజయ్య, 82లో భవనం వెంకట్రామ్ల మంత్రి వర్గాలలోను, 1991, 92లలో నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలోను బాధ్యతలు నిర్వహించారు. ఎమ్.రామచంద్రరావు 1983లో ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో ఉన్నారు.1984 తెలుగుదేశం సంక్షోభంలో రామచంద్రరావు నెలరోజుల నాదెండ్ల క్యాబినెట్లో కూడా పనిచేశారు. కె. విజయరామారావు 1999 ఎన్నికల తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో చేరారు. బి.వి.గురుమూర్తి1954లో రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. దానం నాగేందర్ అంతకుముందు ఆసిఫ్నగర్లో మూడుసార్లు గెలిచారు. నాగేందర్ 2004లో టిడిపి పక్షాన పోటీ చేసి గెలుపొందడం విశేషం. అయితే కాంగ్రెస్ ఐ అధికారంలోకి రావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి, టిడిపికి రాజీనామా చేసి తిరిగి అసిఫ్నగర్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. 2009లో ఖైరతాబాద్లో గెలిచాక వైఎస్ క్యాబినెట్లో, తదుపరి రోశయ్య, కిరణ్ క్యాబినెట్ లలో పనిచేశారు. 2014లో ఓడిపోయారు. 2018లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు. 1999లో కెసిఆర్కు బదులుగా విజయరామారావుకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్ర చరిత్రే మారిపోయిందన్న అబిప్రాయం ఉంది. అసంతృప్తికి గురైన కెసిఆర్ తదుపరి కొంతకాలం ఉప సభాపతిగా ఉండి, ఉప సభాపతి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టిఆర్ఎస్ ను స్థాపించి, తెలంగాణ రాష్ట్ర సాదనలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. విజయరామారావు సిబిఐ డైరెక్టర్గా రిటైర్ అయిన తర్వాత టిడిపిలో చేరి ఖైరతాబాద్లో గెలిచి మంత్రి అయ్యారు. ఆ విధంగా రాష్ట్ర విభజనకు ఇది ఒక కీలకమైన మలుపుగా చెబుతారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..