-
ఫ్యాబ్ ఇండియాకు షాక్: భారీ నష్టపరిహారం డిమాండ్
సాక్షి, ముంబై: పాపులర్ రీటైల్ చైన్ నకిలీ ఖాదీ దుస్తులను అమ్ముతోందా? తాజా పరిణామాలు ఈ అనుమానాలను బలాన్నిస్తున్నాయి. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవీఐసీ) ఫ్యాబ్ ఇండియాకు ట్రేమ్ మార్క్ వివాదం కింద నోటీసులు పంపించింది. ఫ్యాబ్ ఇండియా రీటైల్ ఔట్లెట్లలో అనుమతి లేకుండా తమ ట్రేడ్మార్క్ను ఉపయోగించి వందలకోట్లు దండుకుందని ఆరోపించింది. ఇందుకుగాను భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. చేనేత వస్త్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందంటూ మండిపడిన సంస్థ సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఖాదీ మార్క్ ట్యాగ్ కింద నకిలీ ఖాదీ వస్త్రాలను (కర్మాగారంలో తయారైన పత్తి వస్త్రాలను)విక్రయిస్తోందనీ, తద్వారా ఖాదీ ప్రతిష్టకు తీవ్ర నష్టంతోపాటు కూడా రా వినియోగదారులను తప్పుదారి పట్టిసతోందని తన నోటీసులో పేర్కొంది. తన చట్టబద్ధమైన "చర్ఖా" ను అక్రమంగా ఉపయోగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఖాదీ ట్యాగ్ తో దుస్తుల అక్రమ విక్రయాలు చేపట్టిందని కమిషన్ ఆరోపించింది. ఇందుకుగాను నష్టపరిహారంగా రూ. 525 కోట్లను చెల్లించాలని, లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాదు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా హెచ్చరించింది. అయితే కేవీఐసీ, ఫ్యాబ్ ఇండియా మధ్య ట్రేడ్ మార్క వివాదం ఇప్పటిదికాదు. గతంలోనే కేవీఐసీ ఫ్యాబ్ ఇండియాకు నోటీసులు పంపించింది. 2015 ఆగస్టులో అక్రమ, అనధికారిక ఖాదీ మార్క్ వస్త్రాల విక్రయాలను నిలిపివేయాలని కోరింది. అలాగే వార్తాపత్రిల్లో తప్పుదారి పట్టించే ప్రకటనలు కూడా ఆపేయాలని కూడా హెచ్చరించింది. దీనికి ఫ్యాబ్ ఇండియా సానుకూలంగా స్పందించింది. అయితే మళ్లీ 2017, జనవరి లో ఫ్యాబ్ ఇండియా మళ్లీ రీతిలో వ్యవహరిస్తుండటంతో షాక్ అయిన కేవీఐసీ మరోసారి నోటీసులిచ్చింది. వీటికి స్పందించిన ఫ్యాబ్ ఇండియా కమిషన్ ప్రతినిధులతో చర్చలను కోరుతూ గతేడాది ఫిబ్రవరి 10న సమాధానం చెప్పింది. అయితే తాజాగా ఈ ఆరోపణలను మాత్రం అవాస్తవాలు, నిరాధారాలంటూ ఫ్యాబ్ ఇండియా ప్రతినిధి తిరస్కరించారు. తాము కేవీఐసీ చట్ట అతిక్రమణలకు పాల్పడటం లేదనే విషయాన్ని గత కొన్నాళ్లుగా పదే పదే సంస్థ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. చట్టపరమైన చర్యలకు దిగితే.. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం విశేషం. -
రేవంత్ రెడ్డికి టోకరా వేయబోయి..
హైదరాబాద్: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(కేవీఐసీ) పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాలాజీ అలియాస్ దేవర కుమార్ ప్రధానమంత్రి కృషి యోజనలో భాగంగా రూ. 2 కోట్లు ఇప్పిస్తానని కొంతకాలంగా పలువురికి ఫోన్లు చేస్తున్నాడు. ఇదే విధంగా మహబూబ్ నగర్ జడ్పీ సీఈవో, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుతో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఫోన్ చేశాడు. ‘రేవంత్ సార్ నాకు తెలిసినవారి ద్వారా రూ. 2 కోట్లు ఇప్పిస్తా’అని ఆశ చూపాడు. మే 31వ తేదీలోగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని తెలిపాడు. అనుమానం రావడంతో ఫోన్కాల్పై రేవంత్ పీఏ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు వలపన్ని సోమవారం కుమార్ను పట్టుకున్నారు. అతడు ఎవరెవరి నుంచి ఎంత డబ్బు వసూలు చేశాడో తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- 'పవర్'లెస్.. భ'జనసేన' మాకొద్దు!!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
Advertisement