-
ప్రగతి భవన్ను అంబేడ్కర్ బహుజన్ భవన్గా మారుస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ను అంబేడ్కర్ బహుజన్ భవన్గా మార్చుతామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. పార్టీలో సీఎం ఎవరైనా సరే టీపీసీసీ అధ్యక్షుడిగా తాను సీఎంగా ఉన్న వారితో దళిత, గిరిజనుల విద్య, అభివృద్ధి కోసం మొదటి సంతకం చేయిస్తానని చెప్పారు. బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దళిత, గిరిజనుల అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. బుధవారం మూడుచింతలపల్లిలోని దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా బుధవారం సాయంత్రం రేవంత్రెడ్డి నిమ్మరసం ఇచ్చి రెండు రోజుల దీక్షను విరమింపజేశారు. సీఎంగా కేసీఆర్ రాజభోగాలు అనుభవిస్తున్న ప్రగతిభవన్ను అంబేడ్కర్ బహుజన్ భవన్గా మార్చి అక్కడి నుంచే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లేలా చేస్తామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. దత్తత పేరుతో దగా.. సీఎం కేసీఆర్ దత్తత పేరుతో గ్రామాలను దగా చేశారే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదని రేవంత్రెడ్డి విమర్శించారు. మూడుచింతలపల్లిని దత్తత తీసుకునే సమయంలో అది చేస్తా, ఇది చేస్తా అని ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ చేయలేదన్నారు. సీఎం దత్తత గ్రామాలపై తాను చర్చకు సిద్ధమని, అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా అధికారంలో ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవడం విడ్డూరమన్నారు. పేదల పిల్లలు చదువుకుంటే రాజ్యాధికారం అడుగుతారని, చైతన్యవంతులు అవుతారని.. అందువల్లే సీఎం కేసీఆర్ 4,632 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కాలేజీలు మూసివేయించారని ఆరోపించారు. తండ్రి ఓ మాట, కొడుకో మాట హుజూరాబాద్లో ఓటమి భయం పట్టుకుందని అందుకే సీఎం కేసీఆర్ ఒకటంటే.. ప్రెస్మీట్లో కుమారుడు కేటీఆర్ మరోటి అంటున్నారని రేవంత్రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ దండోరా సభలతో కేసీఆర్ అనే ఎలుక బయటికొచ్చిందని వ్యాఖ్యానిం చారు. కేసీఆర్ జపాన్ ఎలుకలాంటి వాడని. ప్రమాదాన్ని ముందే గ్రహించి ఫామ్హౌస్ నుంచి బయటికొచ్చారని ఎద్దేవా చేశారు. తాను జీవితంలో సుఖంగా జీవిం చేందుకు దేవుడు అన్నీ ఇచ్చాడని, తనకు పదవుల ఆశ లేదని చరిత్రలో గుర్తుండేలా నిలిస్తే చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల ఇన్చార్జి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర నాయకులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మల్లు రవి, నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి వేదిక ఎక్కితే జోకర్... బయట ఉంటే బ్రోకర్ మంత్రి మల్లారెడ్డి వేదిక ఎక్కితే జోకర్.. బయట ఉంటే బ్రోకర్ అని రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్నాడన్నారు. నియోజకవర్గంలో ఎవరు భూములు అమ్మినా, కొన్నా ఆయన మామూళ్లు వసూలు చేస్తారని ఆరోపించారు. జవహర్నగర్లో 268 సర్వే నంబర్లో తప్పుడు పత్రాలు సృష్టించి తన కోడలు పేరుతో ఆస్పత్రి నిర్మించారని, సూరారంలో చెరువును కబ్జా చేసి ఆస్పత్రి నిర్మించారని, మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి కేటాయించిన భూమిలో తన బావమరిది శ్రీనివాస్రెడ్డి పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. మంత్రి, తన అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి, కుమారులు, బావమరిది ఇలా కుటుంబమంతా కబ్జాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మల్లారెడ్డి అక్రమాలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి అక్రమాలను తాను నిరూపిస్తానని, రుజువు చేయలేకపోతే ఏ శిక్ష విధించినా అంగీకరిస్తానని చెప్పారు. చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు? -
రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్లు: సీఎం కేసీఆర్
-
కేసీఆర్ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు
-
కేసీఆర్ ఒక్క కేసు పెడితే.. నేను నాలుగు పెడతా: చంద్రబాబు
సాక్షి, అమరావతి: తాను తలాతోక లేకుండా మాట్లాడుతున్నాని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే తాము కాంగ్రెస్తో కలిశామన్న చంద్రబాబు.. గతంలో తాను ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్నప్పుడు కేసీఆర్ కూడా తనతోనే ఉన్నారని, ఆ తర్వాతనే ఆయన మంత్రి అయ్యారని బాబు అన్నారు. కేసీఆర్ బెదిరించడానికి యత్నిస్తున్నారని, అందుకు తానేమీ భయపడే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ కేసీఆర్ ఒక్కకేసు పెడితే తాను నాలుగు కేసులు పెడతానన్నారు. బంగారు గుడ్లుపెట్లే తెలంగాణను వదిలేసినప్పటికీ తనపై కేసీఆర్ అక్కసు వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు. తనను చెత్త పొలిటీషియన్ అని, కాంగ్రెస్ నాయకులును ఇడీయట్స్ అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. హరికృష్ణ చనిపోయినప్పుడు టీఆర్ఎస్ పొత్తు కోసం అడిగానని, ఇద్దరం కలిసి పని చేద్దామని అన్నానన్నారు. అందులో తప్పేముందని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరతాం -
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన కోవింద్ నగరంలోని హకీంపేట్ విమానశ్రయానికి చేరుకున్నారు. కోవింద్కు తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డీలు స్వాగతం పలికారు. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన హైదరాబాద్లో నాలుగు రోజులపాటు ఉండనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement